Political News

అదంతా మోడీ ఘనత.. కానీ ఇప్పుడు?

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విషయంలో మెజారిటీ జనాల్లో ఉన్న అభ్యంతరం ఆయన ప్రచార పిచ్చి గురించే. సమయం సందర్భం చూడకుండా పబ్లిసిటీ కోసం ఆయన పడే తాపత్రయం గురించి అందరికీ తెలుసు. కరోనా టైంలో జనాలు అల్లాడిపోతుంటే.. నెమళ్లతో ఫొటో షూట్లు చేయించుకున్న తీరు తీవ్ర వివాదాస్పదం అయింది. ఇక గత కొన్ని నెలల్లో ఆయన తన ప్రమోషన్ కోసం బాగా ఉపయోగించుకున్నది ‘వందే భారత్’ రైలునే.

దేశంలో కొత్తగా పలు ప్రాంతాల్లో ఒక రైలును ప్రవేశ పెడితే.. ప్రధాని ఎక్కడో ఒక చోట ప్రారంభోత్సవానికి హాజరవుతారు. కానీ మోడీ మాత్రం వాయిదాల పద్ధతిలో ఒక్కో సిటీలో ఈ రైలును మొదలుపెట్టించి.. ప్రతి వేడుకకూ హాజరయ్యారు. తన ప్రమోషన్ కోసం వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను మామూలుగా వాడుకోలేదు మోడీ. ఆ సమయంలో దేశానికి రైల్వే మంత్రి అంటూ ఒకరున్న విషయం కూడా ఎవరికీ గుర్తు రాలేదు.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మొదలైనపుడు ప్రారంభోత్సవంలో, అలాగే మీడియాలో హైలైట్ కావాల్సిన రైల్వే మంత్రి అసలు సోదిలో లేకుండా పోయారు. ఆ క్రెడిట్ కేవలం మోడీకి మాత్రమే దక్కింది. ఆయన ప్రచారానికి ‘వందే భారత్’ బాగా ఉపయోగపడింది. కానీ ఇప్పుడు ఒరిస్సాలో ఘోర రైల్వే ప్రమాదం చోటు చేసుకున్నపుడు మాత్రం మోడీ తెర వెనక్కి వెళ్లిపోయారు. ఇది రైల్వే శాఖ ఘోర వైఫల్యానికి నిదర్శనంగా మారిన సందర్భంలో రైల్వే మంత్రి పేరే వినపడుతోంది.

ఇన్నాళ్లూ మనకొక రైల్వే మంత్రి ఉన్న విషయం కూడా చాలామందికి తెలియదు. కానీ ఇప్పుడు మీడియాలో మంత్రి అశ్విని వైష్ణవే ముఖచిత్రంగా మారారు. ఏదైనా రాష్ట్రంలో బీజేపీ గెలిస్తే మోడీకి క్రెడిట్ ఇస్తూ ఆయనకు మామూలు ఎలివేషన్ ఇవ్వరు బీజేపీ వాళ్లు. కానీ కర్ణాటకలో ఓడిపోతే అది మోడీ ఖాతాలో వేయకుండా జేపీ నడ్డాను తెరపైకి తీసుకొచ్చారు. ఇలా ప్రభుత్వానికి సంబంధించి క్రెడిట్ వచ్చే విషయమైతే మోడీ ముందుకు వస్తారని.. వైఫల్యాన్ని మాత్రం వేరే వాళ్ల మీదికి నెట్టేసి ఆయన సైడ్ అయిపోతారని నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు.

This post was last modified on June 5, 2023 9:48 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

3 hours ago

‘ప్యారడైజ్’ బిర్యాని… ‘సంపూ’ర్ణ వాడకం అంటే ఇది

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

4 hours ago

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

6 hours ago

బన్నీ-అట్లీ… అప్పుడే ఎందుకీ కన్ఫ్యూజన్

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…

6 hours ago

అవతార్ 3 టాక్ ఏంటి తేడాగా ఉంది

భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…

7 hours ago

జననాయకుడుకి ట్విస్ట్ ఇస్తున్న పరాశక్తి ?

మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…

8 hours ago