తెలంగాణాలో ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో బీజేపీకి చంద్రబాబునాయుడు అవసరం గుర్తుకొచ్చింది. కర్నాటక ఎన్నికల్లో ఎదురైన ఓటమి బీజేపీ అగ్రనేతల మీద బాగానే ప్రభావం చూపినట్లు అర్ధమవుతోంది. కర్నాటకలో ఓటమితో దక్షిణాదిలో బీజేపీ ఉనికి కోల్పోయింది. కోల్పోయిన ఉనికిని మళ్ళీ తెచ్చుకోవాలంటే అంత తేలిక కాదు. పైగా ఈ ఏడాది చివరలోగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో తెలంగాణా కూడా ఒకటి. తెలంగాణాలో ఎలాగైనా గెలవాలని బీజేపీ పెద్ద టార్గెట్టే పెట్టుకున్నది.
క్షేత్రస్ధాయిలో పరిస్ధితులను చూస్తే బీజేపీకి అంతసీన్ కనబడటంలేదు. ఎందుకంటే చాలా నియోజకవర్గాల్లో పార్టీకి బలమైన అభ్యర్ధులే లేరు. ఎంతసేపు కేసీయార్ తో పాటు కేసీయార్ కుటుంబాన్ని తిట్టడం, ఓల్డ్ సిటిలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజలు, ప్రమాణాలకు చాలెంజులు విసరటంతోనే పార్టీ చీఫ్ బండి సంజయ్ రోజులు గడిపేస్తున్నారు. మిగిలిన సీనియర్ నేతల వ్యవహారం కూడా ఇందుకు తగ్గట్లే ఉంది. అందుకనే సుమారు 65 నియోజకవర్గాల్లో ప్రత్యర్ధిపార్టీలకు సవాలు విసిరేంత స్ధాయిలో గట్టి నేతలు లేరు.
ఈ కారణంగానే ఇతర పార్టీల నుండి వలసలను బీజేపీ ప్రోత్సహిస్తోంది. అయినా ఎవరూ కమలంపార్టీవైపు చూడటంలేదు. మరీ పరిస్ధితుల్లో ఏమిచేయాలి ? ఏమిచేయాలో దిక్కుతోచకే మళ్ళీ చంద్రబాబు వైపు చూపుసారించినట్లుంది. అందుకనే ఢిల్లీకి వచ్చి కలవాలని అమిత్ షా నుండి చంద్రబాబుకు పిలుపొచ్చింది. చాలాకాలంగా చంద్రబాబు కూడా వెయిట్ చేస్తున్నారు కాబట్టి వెంటనే ఢిల్లీ చేరుకుని అమిత్ షా తో భేటీ అయ్యారు.
తెలంగాణాలో బీజేపీకి టీడీపీ సహకారంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. తెలంగాణాలో టీడీపీ దాదాపు దెబ్బతినేసిందన్నది వాస్తవమే. అయితే క్యాడర్ ఇంకా పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు. చాలా నియోజకవర్గాల్లో పార్టీకి సుమారు 5 వేల ఓట్లవరకు ఉన్నట్లు తమ్ముళ్ళు చెబుతున్నారు. చాలా నియోజకవర్గాల్లో ఈ ఓట్లే కీలకమయ్యే అవకాశాలున్నాయి. అందుకనే అర్జంటుగా టీడీపీతో పొత్తుపెట్టుకుని ఆ ఓట్లను బీజేపీకి వేయించేట్లుగా చంద్రబాబుతో అమిత్ మాట్లాడారట. తొందరలోనే మరో మీటింగ్ ఉంటుందని అప్పటికి మరింత క్లారిటి వస్తుందని తమ్ముళ్ళు చెబుతున్నారు.
This post was last modified on June 4, 2023 1:21 pm
యుఎస్లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…
ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…
ఆకస్మిక ప్రచండ వరదలతో అతలాకుతలమైన నేపాల్ తాజాగా ప్రపంచ దేశాలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. ``భౌతికంగా మీరు మాకు…
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…
సినిమా బాగుంటే భాషా భేదం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇందుకు చరిత్రలో…