Political News

అమిత్ షాతో చంద్ర‌బాబు భేటీ.. పొత్త‌ల‌పైనే చ‌ర్చ‌లు?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి పొత్తుల విష‌యాన్ని తేల్చే ప‌నిలో ప‌డ్డారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితిలోనూ.. వైసీపీని ఓడించాల‌నే ధ్యేయంతో ఆయ‌న ముందుకు సాగుతున్నారు. దీనిలో భాగంగా శనివారం రాత్రి ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో సుమారు 50 నిమిషాలపాటు భేటీ కావ‌డం.. రాజ‌కీయంగా చ‌ర్చనీయాంశ‌మైంది.

2014లో బీజేపీ-టీడీపీ క‌లిసి పోటీ చేశాయి. ఈ క్ర‌మంలో కేంద్రంలో టీడీపీ ఎంపీలు మంత్రి ప‌ద‌వులు పొందారు. ఇక్క‌డ ఏపీలోనూ బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రి ప‌ద‌వులు ద‌క్కించుకున్నారు. అయితే.. ప్ర‌త్యేక హోదా నేప‌థ్యంలో 2018లో టీడీపీ ఎన్డీయే కూటమి నుంచి బయటికొచ్చిన తర్వాత అమిత్‌షా, చంద్రబాబుల భేటీ జరగడం ఇదే ప్రథమం. ఒకవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, మరోవైపు సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో వీరి సమావేశం ప్రాధాన్యం సంతరించుకొంది.

రాత్రి 8.55 గంటలకు చంద్రబాబు ఒక్కరే కృష్ణ మీనన్‌ మార్గ్‌లోని అమిత్‌షా ఇంటికి వచ్చారు. తర్వాత కొద్దిసేపటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అక్కడికి చేరుకున్నారు. ముగ్గురి మధ్య రాత్రి 9.49 గంటల వరకు సమాలోచనలు జరిగాయి. సమావేశం అనంతరం ఎవరూ మీడియాతో మాట్లాడలేదు.హోంమంత్రితో జరిగిన సమావేశంలో జేపీ నడ్డా కూడా పాల్గొన్నందున దీన్ని రాజకీయపరమైన భేటీగా భావిస్తున్నారు. అయితే భవిష్యత్తులో కలిసి పనిచేయడంపై చర్చించారా.. ఇంకా ఏదైనా అంశాలపై సమాలోచనలు జరిపారా.. అనేది తెలియరాలేదు.

చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్‌, కేశినేని నాని, రామ్మోహన్‌నాయుడు, మాజీ ఎంపీ కంభంపాటి రామమోహనరావులతో కలిసి ల్లీకి వచ్చిన చంద్రబాబునాయుడుకు విమానాశ్రయంలో వైసీపీ రెబ‌ల్‌ ఎంపీ రఘురామకృష్ణరాజు స్వాగతం పలికారు. అనంతరం అంతా కలిసి ఇక్కడి అశోకా రోడ్డులోని ఎంపీ గల్లా జయదేవ్‌ నివాసానికి చేరుకుని అల్పాహారం స్వీక‌రించారు.

This post was last modified on June 4, 2023 10:18 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

41 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago