ఇపుడీ విషయంపైనే సనత్ నగర్ నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది. మంత్రి తలసాని శ్రీనివాసరావుకు మాస్ లీడర్ గా పేరుంది. క్యాడర్ బేస్డు లీడర్ గా పేరున్న తలసానికి నియోజకవర్గంలో మంచి పట్టుంది. అలాంటిది ఇపుడు ఇంత సడెన్ గా హ్యాట్రిక్ విజయంపై ఎందుకింత చర్చ జరుగుతోంది ? ఎందుకంటే హ్యాట్రిక్ కొట్టేది అనుమానంగా తయారైందట. కారణం ఏమిటంటే మద్దతుదారుల్లో చాలామంది బీఆర్ఎస్ ను వదిలి వెళ్ళిపోయారు.
ప్రధానమైన మద్దతుదారుల్లో మరికొందరు తలసానిపై మండిపోతున్నారు. కారణం ఏమిటంటే వాళ్ళల్లో ఎవరికీ ఎలాంటి పదవులు దక్కకుండా మంత్రే అడ్డుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. పైగా కేసీయార్ పై పెరిగిపోతున్న వ్యతిరేకత కూడా ఎక్కువగానే ఉందట. అనేక కారణాల వల్ల మంత్రికి హ్యాట్రిక్ విజయం డౌటే అంటున్నారు. పార్టీలో కూడా కుమ్ములాటలు బాగా పెరిగిపోయాయట. అందుకనే పార్టీలో ఉంటే ఎదుగుదల ఉండదన్న ఆలోచనతో మరికొందరు పార్టీని వదిలేశారు.
2019 పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా కొడుకును పోటీచేయిస్తే ఓడిపోయాడు. నియోజకవర్గవ్యాప్తంగా బీజేపీ చాపకిందనీరులా బలపడుతోంది. అలాగే కాంగ్రెస్ కూడా పుంజుకుంటోందని సమాచారం. అయితే ఇక్కడొక చిన్న లాజిక్ ఏమిటంటే రెండు ప్రధాన ప్రతిపక్షాలు ఎంతబలం పుంజుకుంటే అధికారపార్టీకి అంత లాభం. అంటే ప్రతిపక్షాల మధ్య ఓట్లు చీలిపోతే అధికారపార్టీ అభ్యర్ధి గెలుపుకు అంత అవకాశాలు పెరుగుతాయి. అయితే పార్టీతో పాటు అభ్యర్ధి మీదకూడా వ్యతిరేకతుంటే అప్పుడు ప్రతిపక్షాల్లో ఏదో ఒకదానికి ఓటర్లు గుండుగుత్తగా ఓట్లేసేస్తారు.
సికింద్రాబాద్ ఎంపీగా కిషన్ రెడ్డి గెలిచారు. ఈ గెలుపులో సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీకి మంచి మెజారిటి వచ్చింది. అంటే సనత్ నగర్ నియోజకవర్గంలో బీజేపీ బాగా పుంజుకుంటోందని అర్ధమవుతోంది. దీనికి మరో ఉదాహరణ ఏమిటంటే తర్వాత జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నియోజకవర్గంలోని మోండామార్కెట్, రామ్ గోపాలపేట్, అమీర్ పేట్ డివిజన్లలో బీజేపీ కార్పొరేటర్లే గెలిచారు. జరుగుతున్నది చూస్తుంటే తలసాని హ్యాట్రిక్ కొట్టేది అనుమానంగానే తయారైంది. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.
This post was last modified on June 3, 2023 11:49 am
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారమే సమయం ఉంది. ఈ ఎన్నికలు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్కు, అటు ప్రతిపక్ష…
‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…
ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జగన్ ప్రబుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎన్నికల…
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…