ఇపుడీ విషయంపైనే సనత్ నగర్ నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది. మంత్రి తలసాని శ్రీనివాసరావుకు మాస్ లీడర్ గా పేరుంది. క్యాడర్ బేస్డు లీడర్ గా పేరున్న తలసానికి నియోజకవర్గంలో మంచి పట్టుంది. అలాంటిది ఇపుడు ఇంత సడెన్ గా హ్యాట్రిక్ విజయంపై ఎందుకింత చర్చ జరుగుతోంది ? ఎందుకంటే హ్యాట్రిక్ కొట్టేది అనుమానంగా తయారైందట. కారణం ఏమిటంటే మద్దతుదారుల్లో చాలామంది బీఆర్ఎస్ ను వదిలి వెళ్ళిపోయారు.
ప్రధానమైన మద్దతుదారుల్లో మరికొందరు తలసానిపై మండిపోతున్నారు. కారణం ఏమిటంటే వాళ్ళల్లో ఎవరికీ ఎలాంటి పదవులు దక్కకుండా మంత్రే అడ్డుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. పైగా కేసీయార్ పై పెరిగిపోతున్న వ్యతిరేకత కూడా ఎక్కువగానే ఉందట. అనేక కారణాల వల్ల మంత్రికి హ్యాట్రిక్ విజయం డౌటే అంటున్నారు. పార్టీలో కూడా కుమ్ములాటలు బాగా పెరిగిపోయాయట. అందుకనే పార్టీలో ఉంటే ఎదుగుదల ఉండదన్న ఆలోచనతో మరికొందరు పార్టీని వదిలేశారు.
2019 పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా కొడుకును పోటీచేయిస్తే ఓడిపోయాడు. నియోజకవర్గవ్యాప్తంగా బీజేపీ చాపకిందనీరులా బలపడుతోంది. అలాగే కాంగ్రెస్ కూడా పుంజుకుంటోందని సమాచారం. అయితే ఇక్కడొక చిన్న లాజిక్ ఏమిటంటే రెండు ప్రధాన ప్రతిపక్షాలు ఎంతబలం పుంజుకుంటే అధికారపార్టీకి అంత లాభం. అంటే ప్రతిపక్షాల మధ్య ఓట్లు చీలిపోతే అధికారపార్టీ అభ్యర్ధి గెలుపుకు అంత అవకాశాలు పెరుగుతాయి. అయితే పార్టీతో పాటు అభ్యర్ధి మీదకూడా వ్యతిరేకతుంటే అప్పుడు ప్రతిపక్షాల్లో ఏదో ఒకదానికి ఓటర్లు గుండుగుత్తగా ఓట్లేసేస్తారు.
సికింద్రాబాద్ ఎంపీగా కిషన్ రెడ్డి గెలిచారు. ఈ గెలుపులో సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీకి మంచి మెజారిటి వచ్చింది. అంటే సనత్ నగర్ నియోజకవర్గంలో బీజేపీ బాగా పుంజుకుంటోందని అర్ధమవుతోంది. దీనికి మరో ఉదాహరణ ఏమిటంటే తర్వాత జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నియోజకవర్గంలోని మోండామార్కెట్, రామ్ గోపాలపేట్, అమీర్ పేట్ డివిజన్లలో బీజేపీ కార్పొరేటర్లే గెలిచారు. జరుగుతున్నది చూస్తుంటే తలసాని హ్యాట్రిక్ కొట్టేది అనుమానంగానే తయారైంది. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.
This post was last modified on June 3, 2023 11:49 am
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…
చాట్జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…
నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…
ఫౌజీ విడుదల వాయిదా గురించి అసలైన మైత్రి మూవీ మేకర్స్ ఇంకా చెప్పలేదు కానీ మిగిలిన సినిమాలు అలెర్ట్ అయిపోయి…
షాప్లో యూపీఐ పేమెంట్ చేయాలంటే ప్రస్తుతం ఫోన్లో యాప్ ఓపెన్ చేసి, కెమెరాతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం. ఇక…