ఇపుడీ విషయంపైనే సనత్ నగర్ నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది. మంత్రి తలసాని శ్రీనివాసరావుకు మాస్ లీడర్ గా పేరుంది. క్యాడర్ బేస్డు లీడర్ గా పేరున్న తలసానికి నియోజకవర్గంలో మంచి పట్టుంది. అలాంటిది ఇపుడు ఇంత సడెన్ గా హ్యాట్రిక్ విజయంపై ఎందుకింత చర్చ జరుగుతోంది ? ఎందుకంటే హ్యాట్రిక్ కొట్టేది అనుమానంగా తయారైందట. కారణం ఏమిటంటే మద్దతుదారుల్లో చాలామంది బీఆర్ఎస్ ను వదిలి వెళ్ళిపోయారు.
ప్రధానమైన మద్దతుదారుల్లో మరికొందరు తలసానిపై మండిపోతున్నారు. కారణం ఏమిటంటే వాళ్ళల్లో ఎవరికీ ఎలాంటి పదవులు దక్కకుండా మంత్రే అడ్డుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. పైగా కేసీయార్ పై పెరిగిపోతున్న వ్యతిరేకత కూడా ఎక్కువగానే ఉందట. అనేక కారణాల వల్ల మంత్రికి హ్యాట్రిక్ విజయం డౌటే అంటున్నారు. పార్టీలో కూడా కుమ్ములాటలు బాగా పెరిగిపోయాయట. అందుకనే పార్టీలో ఉంటే ఎదుగుదల ఉండదన్న ఆలోచనతో మరికొందరు పార్టీని వదిలేశారు.
2019 పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా కొడుకును పోటీచేయిస్తే ఓడిపోయాడు. నియోజకవర్గవ్యాప్తంగా బీజేపీ చాపకిందనీరులా బలపడుతోంది. అలాగే కాంగ్రెస్ కూడా పుంజుకుంటోందని సమాచారం. అయితే ఇక్కడొక చిన్న లాజిక్ ఏమిటంటే రెండు ప్రధాన ప్రతిపక్షాలు ఎంతబలం పుంజుకుంటే అధికారపార్టీకి అంత లాభం. అంటే ప్రతిపక్షాల మధ్య ఓట్లు చీలిపోతే అధికారపార్టీ అభ్యర్ధి గెలుపుకు అంత అవకాశాలు పెరుగుతాయి. అయితే పార్టీతో పాటు అభ్యర్ధి మీదకూడా వ్యతిరేకతుంటే అప్పుడు ప్రతిపక్షాల్లో ఏదో ఒకదానికి ఓటర్లు గుండుగుత్తగా ఓట్లేసేస్తారు.
సికింద్రాబాద్ ఎంపీగా కిషన్ రెడ్డి గెలిచారు. ఈ గెలుపులో సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీకి మంచి మెజారిటి వచ్చింది. అంటే సనత్ నగర్ నియోజకవర్గంలో బీజేపీ బాగా పుంజుకుంటోందని అర్ధమవుతోంది. దీనికి మరో ఉదాహరణ ఏమిటంటే తర్వాత జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నియోజకవర్గంలోని మోండామార్కెట్, రామ్ గోపాలపేట్, అమీర్ పేట్ డివిజన్లలో బీజేపీ కార్పొరేటర్లే గెలిచారు. జరుగుతున్నది చూస్తుంటే తలసాని హ్యాట్రిక్ కొట్టేది అనుమానంగానే తయారైంది. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.
This post was last modified on June 3, 2023 11:49 am
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…