ఇపుడీ విషయంపైనే సనత్ నగర్ నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది. మంత్రి తలసాని శ్రీనివాసరావుకు మాస్ లీడర్ గా పేరుంది. క్యాడర్ బేస్డు లీడర్ గా పేరున్న తలసానికి నియోజకవర్గంలో మంచి పట్టుంది. అలాంటిది ఇపుడు ఇంత సడెన్ గా హ్యాట్రిక్ విజయంపై ఎందుకింత చర్చ జరుగుతోంది ? ఎందుకంటే హ్యాట్రిక్ కొట్టేది అనుమానంగా తయారైందట. కారణం ఏమిటంటే మద్దతుదారుల్లో చాలామంది బీఆర్ఎస్ ను వదిలి వెళ్ళిపోయారు.
ప్రధానమైన మద్దతుదారుల్లో మరికొందరు తలసానిపై మండిపోతున్నారు. కారణం ఏమిటంటే వాళ్ళల్లో ఎవరికీ ఎలాంటి పదవులు దక్కకుండా మంత్రే అడ్డుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. పైగా కేసీయార్ పై పెరిగిపోతున్న వ్యతిరేకత కూడా ఎక్కువగానే ఉందట. అనేక కారణాల వల్ల మంత్రికి హ్యాట్రిక్ విజయం డౌటే అంటున్నారు. పార్టీలో కూడా కుమ్ములాటలు బాగా పెరిగిపోయాయట. అందుకనే పార్టీలో ఉంటే ఎదుగుదల ఉండదన్న ఆలోచనతో మరికొందరు పార్టీని వదిలేశారు.
2019 పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా కొడుకును పోటీచేయిస్తే ఓడిపోయాడు. నియోజకవర్గవ్యాప్తంగా బీజేపీ చాపకిందనీరులా బలపడుతోంది. అలాగే కాంగ్రెస్ కూడా పుంజుకుంటోందని సమాచారం. అయితే ఇక్కడొక చిన్న లాజిక్ ఏమిటంటే రెండు ప్రధాన ప్రతిపక్షాలు ఎంతబలం పుంజుకుంటే అధికారపార్టీకి అంత లాభం. అంటే ప్రతిపక్షాల మధ్య ఓట్లు చీలిపోతే అధికారపార్టీ అభ్యర్ధి గెలుపుకు అంత అవకాశాలు పెరుగుతాయి. అయితే పార్టీతో పాటు అభ్యర్ధి మీదకూడా వ్యతిరేకతుంటే అప్పుడు ప్రతిపక్షాల్లో ఏదో ఒకదానికి ఓటర్లు గుండుగుత్తగా ఓట్లేసేస్తారు.
సికింద్రాబాద్ ఎంపీగా కిషన్ రెడ్డి గెలిచారు. ఈ గెలుపులో సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీకి మంచి మెజారిటి వచ్చింది. అంటే సనత్ నగర్ నియోజకవర్గంలో బీజేపీ బాగా పుంజుకుంటోందని అర్ధమవుతోంది. దీనికి మరో ఉదాహరణ ఏమిటంటే తర్వాత జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నియోజకవర్గంలోని మోండామార్కెట్, రామ్ గోపాలపేట్, అమీర్ పేట్ డివిజన్లలో బీజేపీ కార్పొరేటర్లే గెలిచారు. జరుగుతున్నది చూస్తుంటే తలసాని హ్యాట్రిక్ కొట్టేది అనుమానంగానే తయారైంది. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.
This post was last modified on June 3, 2023 11:49 am
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…