ఉమ్మడి గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి టికెట్ను ఆశించిన టీడీపీ యువ నాయకుడు, డాక్టర్ కోడెల శివరామకృష్ణ(ఈయన మాజీ స్పీకర్ దివంగత కోడెల శివప్రసాద్ తనయుడు)ను చంద్రబాబు బుజ్జగిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేయాలని శివరామకృష్ణ నిర్ణయించుకున్నారు. అయితే.. అనూహ్యంగా ఆయనను తప్పిస్తూ..చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈయన స్థానంలో మాజీ మంత్రి, ఇటీవల పార్టీలోకి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణకు టికెట్ దాదాపు ఖరారైంది. దీంతో కోడెల శివరామకృష్ణ.. పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో టీడీపీ అదినేత చంద్రబాబు కోడెలను బుజ్జగించే చర్యలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సత్తెనపల్లిలో కోడెల శివరాంతో టీడీపీ త్రిసభ్య బృందం చర్చలు జరిపింది. కన్నా లక్ష్మీనారాయణకు నియోజకవర్గ ఇంచార్జి ఇవ్వటంపై కోడెల శివరాం అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశం అనంతరం మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, గుంటూరు టీడీపీ జిల్లా అధ్యక్షుడు , మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మీడియాతో మాట్లాడుతూ.. కోడెల కుటుంబానికి న్యాయం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని తెలిపారు.
సామాజిక సమీకరణల దృష్ట్యా కన్నా లక్ష్మీనారాయణను సత్తెనపల్లి నియోజకవర్గ పార్టీ ఇన్చార్జిగా నియమించారని స్పష్టం చేశారు. శివరాంతో పాటు కోడెల అభిమానులకు కొంత బాధ ఉంటుందని… దాన్ని తీర్చేందుకు పార్టీ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కోడెల శివరాంను చంద్రబాబు త్వరలో పిలిపించుకుని మాట్లాడతారని జీవీ ఆంజనేయులు చెప్పారు. పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. శివరాంతో మాట్లాడి వెళ్లబోతున్న త్రిసభ్య బృందాన్ని శివరాం అనుచరులు కాసేపు అడ్డుకున్నారు. కార్ల ముందు బైఠాయించి.. శివరాంని అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిరసన తెలియజేస్తున్న శివరాం అనుచరులకు నచ్చజెప్పి నేతలు వెళ్లిపోయారు.
టీడీపీ సత్తెనపల్లి నియోజకవర్గం ఇన్చార్జిగా కన్నా లక్ష్మీ నారాయణను పార్టీ అధిష్టానం నియమించింది. ఇక్కడున్న పరిస్థితులను బేరీజు వేసుకుని, సమీకరణాలను పోల్చుకుని, సత్తెనపల్లిలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యాన చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. కోడెల శివ ప్రసాద్ తనయుడు శివరాం, పార్టీ నేతలు, కార్యకర్తలు, శివరాం అనుయాయులు ఈ నిర్ణయంపై నిప్పులు చెరుగుతున్నారు. అయితే.. చంద్రబాబు వర్తమానం ప్రకారం.. “శివరాంకి కచ్చితంగా భవిష్యత్ ఉంటుంది. శివ ప్రసాద్ కి మంచి అవకాశాలు ఉంటాయి. అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ అభ్యర్థి, పార్టీ బలోపేతానికి శివరాం కృషి చేయాలి” అని పేర్కొన్నారు.
This post was last modified on June 2, 2023 11:01 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…