Political News

క‌దల‌నున్న ‘వారాహి’.. ప‌వ‌న్ ప్లాన్ ఇదే

ఏపీ రాజ‌కీయాలు మ‌రింత వేడెక్క‌నున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌స్తామ‌ని.. వైసీపీ వ్య‌తిరేక ఓటు బ్యాంకు చీల‌కుండా చూస్తామ‌ని ప‌దే ప‌దే చెబుతున్న‌ జనసేన అధినేత పవన్కల్యాణ్  వారాహి యాత్రకు ముహూర్తం సిద్ధం చేసుకున్నారు. జూన్ రెండో వారం నుంచి వారాహిని లైన్‌లో పెట్టనున్నారు. రెండో వారం నుంచి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో పవన్ వారాహి వాహ‌నంలో పర్యటించనున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు.

ఆయా జిల్లాల్లోని ప్రధాన కూడళ్లు, ఖాళీ స్థలాల్లో ఏర్పాటు చేసే సభల్లో పవన్ ప్రసంగిస్తారు. ఈ నెల 14 నుంచి పవన్ యాత్ర ప్రారంభిస్తారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. అన్నవరం దర్శనం తర్వాత పత్తిపాడు నుంచి యాత్ర మొదల వుతుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో సమస్యలపై అవగాహన కల్పించేలా యాత్ర కొనసాగుతుందని చెప్పారు. స్థానికుల నుంచి సమస్యలపై పవన్ అర్జీలు తీసుకుంటారని, సమస్యల పరిష్కారం కోసం స్థానికంగా ఆయన పర్యటిస్తారని పేర్కొన్నారు.

తూర్పుపైనే ప్ర‌త్యేక దృష్టి

తూర్పుగోదావరి జిల్లాపై ప‌వ‌న్ ప్ర‌త్యేకంగా దృష్టి పెట్ట‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఈ జిల్లాలోని మొత్తం 10 నియోజకవర్గాల్లో పవన్‌ పర్యటిస్తారని నాదెండ్ల చెప్పారు. సినిమాల పరంగా ఇచ్చిన కమిట్‌మెంట్లు పూర్తి అయితే.. ప్రజల్లోనే పవన్ ఉంటారని  పేర్కొన్నా రు. పవన్‌ సభలు, రోడ్‌ షోలకు వెళ్లినప్పుడు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్న ఉదంతాలు ఎదురవుతుండడంతో వారాహి వాహనంపైనా.. చుట్టుపక్కలా ప్రత్యేక లైటింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేసినట్లు జనసేన నేతలు తెలిపారు.

ఇక, వేలమందికి స్పష్టంగా వినిపించేలా అధునాతనమైన సౌండ్‌ సిస్టమ్‌ను వాహనంలో అంతర్భాగంగా ఉంటుంది. అలాగే, భద్రతా కారణాలరీత్యా వాహనానికి నలువైపులా సీసీటీవీ కెమెరాలు పెట్టి దాని ఫుటేజ్‌ ప్రత్యేక సర్వర్‌కు రియల్‌ టైంలో చేరేలా ఏర్పాటు చేశారు. ఇక, వాహనం లోపల పవన్‌తో పాటు మరో ఇద్దరు కూర్చునే వెసులుబాటు, వాహనం లోపలి నుంచి పైకి వెళ్లడానికి హైడ్రాలిక్‌ మెట్లు ఉంటాయి. ఈ వాహనానికి వారాహి అమ్మవారి పేరుపెట్టారు. వారాహి అన్ని దిక్కులను కాచే అమ్మవారిగా పురాణాలు చెబుతున్నాయి.  

This post was last modified on June 2, 2023 10:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

లోకేశ్ స్పీచ్.. క్లెమోర్ మైన్లు, కామెడీ పీసులు, గుండె పోట్లు

తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఘనంగా వేడుకలు జరిగాయి. టీడీపీ…

11 minutes ago

నాగవంశీకి అవసరం పడని సింపతీ కార్డ్

ఎంత మంచి సినిమా తీసినా అపోజిషన్ వల్ల ప్రతిసారి వసూళ్లు ప్రభావితం చెందుతున్నాయనే ఆందోళన నిర్మాత నాగవంశీలో పలు సందర్భాల్లో…

1 hour ago

వైసీపీలో.. చాలా మందే ఉన్నార‌ట‌.. !

వైసీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ వ్య‌వ‌హారం అంద‌రికీ తెలిసిందే. ఆయ‌నపై ఇప్ప‌టికి మూడు కేసులు న‌మో ద‌య్యాయి.…

1 hour ago

చిరు – రావిపూడి కోసం బాలీవుడ్ భామలు

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కబోయే సినిమా ఓపెనింగ్ ఉగాది రోజు జరగనుంది. విక్టరీ వెంకటేష్ ముఖ్య…

2 hours ago

ఆ ‘సంచలనం’ పుట్టి నేటికి 43 ఏళ్లు

తెలుగు దేశం పార్టీ... భారత రాజకీయాల్లో ఓ సంచలనం. తెలుగు నేల రాజకీయాల్లో ఓ మార్పు. దేశంలోని ఎన్నో రాష్ట్రాల్లో…

3 hours ago

‘ఎక్స్’ను అమ్మేసిన ఎలాన్ మస్క్.. ట్విస్టు మామూలుగా ఉండదు

వ్యాపారం అందరూ చేస్తారు. కొందరు కష్టాన్ని నమ్ముకుంటే.. మరికొందరు తెలివిని నమ్ముకుంటారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మాత్రం ఈ…

3 hours ago