Political News

అదిరిపోయే కాన్సెప్టుతో మ‌రో కార్య‌క్ర‌మం.. చంద్ర‌బాబు విజ‌న్

టీడీపీ అధినేత చంద్ర‌బాబు క్ష‌ణం తీరిక లేకుండా ప‌నిచేస్తున్నారు. ఇప్ప‌టికే మినీ మేనిఫెస్టో ప్ర‌క‌టించిన ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా మ‌రో అదిరిపోయే కాన్సెప్టుతో ప్ర‌జ‌ల్లోకి రావాల‌ని నిర్ణ‌యించారు. ఈ నెల 10వ తేదీన చంద్రబాబు ఈకార్య‌క్ర‌మాన్ని ప్రారంభించనున్నా రు. అనంతరం సుమారు 150 రోజుల పాటు ఆ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిర్వహించనున్నారు.

సమావేశంలో భాగంగా ఆ కార్యక్రమాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి..? ఏయే రోజున ఏయే కార్యక్రమాలు నిర్వహించాలి..? వంటి అంశాలపై ఇప్ప‌టికే రోడ్ మ్యాప్‌రెడీ చేసుకున్నారు. అయితే.. ఈ 150 రోజుల కార్య‌క్ర‌మానికి `భ‌విష్య‌త్తుకు గ్యారెంటీ` పేరు పెట్టాల‌ని ప్రాథ‌మికంగా నిర్ణ‌యించారు. పార్టీ నాయ‌కుల‌తో క‌లిసి.. వారి  చర్చించనున్నారు. అనంత‌రం.. ఈ పేరును ఖ‌రారు చేయ‌నున్న‌ట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.  జూన్ 10న ప్రారంభ‌మ‌య్యే  ‘భవిష్యత్‌కు గ్యారెంటీస  కార్యక్రమాన్ని ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ల‌నున్నారు.

ఇప్ప‌టికే ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో.. విడుద‌ల చేసింది.  ఈ నేపథ్యంలో ఆ పేరుతోనే (‘భవిష్యత్తుకు గ్యారెంటీ’) ఈ నెల 10వ తేదీ నుంచి ప్రజల్లోకి చంద్రబాబు, ఆ పార్టీ నేతలు వెళ్లనున్నారు. గతకొన్ని నెలలక్రితం టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘బాదుడే బాదుడు, ఇదేం కర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాలు విజ‌యం సాధించాయి. వైసీపీ ప్ర‌భుత్వంపై ఓ రేంజ్‌లో ప్ర‌జ‌లు ఆలోచించేలా చేయ‌గ‌లిగారు. ప్ర‌భుత్వ ద‌మ‌న నీతిని ఎండ‌గ‌ట్టారు.

ఈ నేపథ్యంలో ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో త్వరలోనే కొత్త కార్యక్రమాన్ని చేపట్టి.. మ‌రింత‌గా ప్ర‌భుత్వ అవినీతి, అభివృద్ధి లేక‌పోవ‌డం.. వంటి విష‌యాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌ని నిర్ణ‌యించారు. దీనిలో అంద‌రూ పాల్గొనేలా.. ప్ర‌తి ఒక్క‌రి భాగ‌స్వామ్యం ఉండేలా కార్య‌క్ర‌మాన్ని తీర్చి దిద్దారు. 

This post was last modified on June 2, 2023 1:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

28 minutes ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

31 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

2 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

2 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

6 hours ago