ప్రస్తుతం ఎంఎల్సీగా ఉన్న కల్వకుంట్ల కవిత రాబోయే ఎన్నికల్లో మళ్ళీ పార్లమెంటుకు పోటీచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే తరచూ కవిత నిజామాబాద్ లోక్ సభ పరిధిలో ఎక్కువగా పర్యటిస్తున్నారు. ఈ కారణంగానే పార్లమెంటుకు కవిత మళ్ళీ పోటీచేయబోతున్నారనే చర్చ పార్టీతో పాటు నియోజకవర్గంలో పెరిగిపోతోంది. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కవిత మళ్ళీ ఇటువైపు తిరిగి కూడా చూడలేదు. పార్టీపరంగా ఏదైనా కార్యక్రమం లేకపోతే నేతల ఇళ్ళల్లో జరిగే కార్యక్రమాలకు హాజరవ్వటం తప్ప మాజీ ఎంపీ హోదాలో జిల్లాలో పర్యటించటం మానుకున్నారు
ఆ తర్వాత జిల్లా నుండి స్ధానికసంస్ధల కోటాలో ఎంఎల్సీగా గెలిచినా కూడా జిల్లాలో యాక్టివ్ గా కనబడలేదు. అలాంటిది చాలాకాలం తర్వాత ఈమధ్యనే యాక్టివ్ గా తిరుగుతున్నారు. పార్టీ ప్రజాప్రతినిధులతో సమావేశాలు పెడుతున్నారు. అలాగే నియోజకవర్గంలో ఉన్న కులసంఘాల నేతలతో కూడా తరచు భేటీ అవుతున్నారు. ఇదంతా చూసిన తర్వాత రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మళ్ళీ నిజామాబాద్ లో బరిలోకి దిగటం ఖాయమనే ప్రచారం బాగా పెరిగిపోతోంది.
ఇక్కడ కవితకు ఒక సమస్యుంది. అదేమిటంటే 2014లో ఎంపీగా గెలిచినపుడు నియోజకవర్గం అభివృద్ధికి ఇచ్చిన హామీలు చాలావరకు నెరవేరలేదు. కవిత అంటే మామూలు ఎంపీకాదు ముఖ్యమంత్రి కూతురన్న విషయం అందరికీ తెలుసు. కాబట్టే కవిత హామీలిచ్చారంటే కచ్చితంగా నెరవేరుస్తారనే అనుకున్నారు. అయితే దానికి భిన్నంగా వ్యవహరించారు. ఇదే సమయంలో రైతులు, రైతుసంఘాలతో బాగా గొడవలుపెట్టుకున్నారు.
దాంతో 2019 ఎన్నికల్లో అందరు కలిసి కవితను ఓడించారు. ఆ మంటుంది కాబట్టే తర్వాత నియోజకవర్గంలోకి తొంగికూడా చూడలేదు. అయితే తర్వాత ఎంఎల్సీ అయినా ఆమె పద్దతిలో ఎలాంటి మార్పరాలేదు. నియోజకవర్గం అభివృద్ధిపైన పెద్దగా దృష్టిపెట్టకుండా ఎంతసేపు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్విందును టార్గెట్ చేయటంతోనే సరిపోతోంది. ఈమధ్య తాను ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కోబట్టి మిగిలిన విషయాలను కూడా వదిలేశారు. మరీ నేపధ్యంలోనే కవిత రాబోయే ఎన్నికల్లో ఎంపీగా పోటీచేస్తే గెలుస్తారా ? అన్నది ఆసక్తిగా మారింది.
This post was last modified on June 2, 2023 1:07 pm
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…