Political News

మళ్ళీ పోటీకి రెడీ అవుతున్నారా?

ప్రస్తుతం ఎంఎల్సీగా ఉన్న కల్వకుంట్ల కవిత రాబోయే ఎన్నికల్లో మళ్ళీ పార్లమెంటుకు పోటీచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే తరచూ కవిత నిజామాబాద్ లోక్ సభ పరిధిలో ఎక్కువగా పర్యటిస్తున్నారు. ఈ కారణంగానే పార్లమెంటుకు కవిత మళ్ళీ పోటీచేయబోతున్నారనే చర్చ పార్టీతో పాటు నియోజకవర్గంలో పెరిగిపోతోంది. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కవిత మళ్ళీ ఇటువైపు తిరిగి కూడా చూడలేదు. పార్టీపరంగా ఏదైనా కార్యక్రమం లేకపోతే నేతల ఇళ్ళల్లో జరిగే కార్యక్రమాలకు హాజరవ్వటం తప్ప మాజీ ఎంపీ హోదాలో జిల్లాలో పర్యటించటం మానుకున్నారు

ఆ తర్వాత జిల్లా నుండి స్ధానికసంస్ధల కోటాలో ఎంఎల్సీగా గెలిచినా కూడా జిల్లాలో యాక్టివ్ గా కనబడలేదు. అలాంటిది చాలాకాలం తర్వాత ఈమధ్యనే యాక్టివ్ గా తిరుగుతున్నారు. పార్టీ ప్రజాప్రతినిధులతో సమావేశాలు పెడుతున్నారు. అలాగే నియోజకవర్గంలో ఉన్న కులసంఘాల నేతలతో కూడా తరచు భేటీ అవుతున్నారు. ఇదంతా చూసిన తర్వాత రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మళ్ళీ నిజామాబాద్ లో బరిలోకి దిగటం ఖాయమనే ప్రచారం బాగా పెరిగిపోతోంది.

ఇక్కడ కవితకు ఒక సమస్యుంది. అదేమిటంటే 2014లో ఎంపీగా గెలిచినపుడు నియోజకవర్గం అభివృద్ధికి ఇచ్చిన హామీలు చాలావరకు నెరవేరలేదు. కవిత అంటే మామూలు ఎంపీకాదు ముఖ్యమంత్రి కూతురన్న విషయం అందరికీ తెలుసు. కాబట్టే కవిత హామీలిచ్చారంటే కచ్చితంగా నెరవేరుస్తారనే అనుకున్నారు. అయితే దానికి భిన్నంగా వ్యవహరించారు. ఇదే సమయంలో రైతులు, రైతుసంఘాలతో బాగా గొడవలుపెట్టుకున్నారు.

దాంతో 2019 ఎన్నికల్లో అందరు కలిసి కవితను ఓడించారు. ఆ మంటుంది కాబట్టే తర్వాత నియోజకవర్గంలోకి తొంగికూడా చూడలేదు. అయితే తర్వాత ఎంఎల్సీ అయినా ఆమె పద్దతిలో ఎలాంటి మార్పరాలేదు. నియోజకవర్గం అభివృద్ధిపైన పెద్దగా దృష్టిపెట్టకుండా ఎంతసేపు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్విందును టార్గెట్ చేయటంతోనే సరిపోతోంది. ఈమధ్య తాను ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కోబట్టి మిగిలిన విషయాలను కూడా వదిలేశారు. మరీ నేపధ్యంలోనే కవిత రాబోయే ఎన్నికల్లో ఎంపీగా పోటీచేస్తే గెలుస్తారా ? అన్నది ఆసక్తిగా మారింది. 

This post was last modified on June 2, 2023 1:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

58 minutes ago

మెగా మాస్ ఈజ్ బ్యాక్

మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…

1 hour ago

ఆ ప్రచారంపై మండిపడ్డ కోమటిరెడ్డి

తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…

2 hours ago

అమరావతిపై మాట్లాడే నైతిక హక్కు ఉందా జగన్!

ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…

3 hours ago

నాగ్ ఓకే అనడమే ఆలస్యం

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…

3 hours ago

ప్రభాస్ సరదాలు ఓవర్… ఇక సమరమే!

ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…

4 hours ago