Political News

మళ్ళీ పోటీకి రెడీ అవుతున్నారా?

ప్రస్తుతం ఎంఎల్సీగా ఉన్న కల్వకుంట్ల కవిత రాబోయే ఎన్నికల్లో మళ్ళీ పార్లమెంటుకు పోటీచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే తరచూ కవిత నిజామాబాద్ లోక్ సభ పరిధిలో ఎక్కువగా పర్యటిస్తున్నారు. ఈ కారణంగానే పార్లమెంటుకు కవిత మళ్ళీ పోటీచేయబోతున్నారనే చర్చ పార్టీతో పాటు నియోజకవర్గంలో పెరిగిపోతోంది. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కవిత మళ్ళీ ఇటువైపు తిరిగి కూడా చూడలేదు. పార్టీపరంగా ఏదైనా కార్యక్రమం లేకపోతే నేతల ఇళ్ళల్లో జరిగే కార్యక్రమాలకు హాజరవ్వటం తప్ప మాజీ ఎంపీ హోదాలో జిల్లాలో పర్యటించటం మానుకున్నారు

ఆ తర్వాత జిల్లా నుండి స్ధానికసంస్ధల కోటాలో ఎంఎల్సీగా గెలిచినా కూడా జిల్లాలో యాక్టివ్ గా కనబడలేదు. అలాంటిది చాలాకాలం తర్వాత ఈమధ్యనే యాక్టివ్ గా తిరుగుతున్నారు. పార్టీ ప్రజాప్రతినిధులతో సమావేశాలు పెడుతున్నారు. అలాగే నియోజకవర్గంలో ఉన్న కులసంఘాల నేతలతో కూడా తరచు భేటీ అవుతున్నారు. ఇదంతా చూసిన తర్వాత రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మళ్ళీ నిజామాబాద్ లో బరిలోకి దిగటం ఖాయమనే ప్రచారం బాగా పెరిగిపోతోంది.

ఇక్కడ కవితకు ఒక సమస్యుంది. అదేమిటంటే 2014లో ఎంపీగా గెలిచినపుడు నియోజకవర్గం అభివృద్ధికి ఇచ్చిన హామీలు చాలావరకు నెరవేరలేదు. కవిత అంటే మామూలు ఎంపీకాదు ముఖ్యమంత్రి కూతురన్న విషయం అందరికీ తెలుసు. కాబట్టే కవిత హామీలిచ్చారంటే కచ్చితంగా నెరవేరుస్తారనే అనుకున్నారు. అయితే దానికి భిన్నంగా వ్యవహరించారు. ఇదే సమయంలో రైతులు, రైతుసంఘాలతో బాగా గొడవలుపెట్టుకున్నారు.

దాంతో 2019 ఎన్నికల్లో అందరు కలిసి కవితను ఓడించారు. ఆ మంటుంది కాబట్టే తర్వాత నియోజకవర్గంలోకి తొంగికూడా చూడలేదు. అయితే తర్వాత ఎంఎల్సీ అయినా ఆమె పద్దతిలో ఎలాంటి మార్పరాలేదు. నియోజకవర్గం అభివృద్ధిపైన పెద్దగా దృష్టిపెట్టకుండా ఎంతసేపు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్విందును టార్గెట్ చేయటంతోనే సరిపోతోంది. ఈమధ్య తాను ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కోబట్టి మిగిలిన విషయాలను కూడా వదిలేశారు. మరీ నేపధ్యంలోనే కవిత రాబోయే ఎన్నికల్లో ఎంపీగా పోటీచేస్తే గెలుస్తారా ? అన్నది ఆసక్తిగా మారింది. 

This post was last modified on June 2, 2023 1:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

10 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

5 hours ago