Political News

మళ్ళీ పోటీకి రెడీ అవుతున్నారా?

ప్రస్తుతం ఎంఎల్సీగా ఉన్న కల్వకుంట్ల కవిత రాబోయే ఎన్నికల్లో మళ్ళీ పార్లమెంటుకు పోటీచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే తరచూ కవిత నిజామాబాద్ లోక్ సభ పరిధిలో ఎక్కువగా పర్యటిస్తున్నారు. ఈ కారణంగానే పార్లమెంటుకు కవిత మళ్ళీ పోటీచేయబోతున్నారనే చర్చ పార్టీతో పాటు నియోజకవర్గంలో పెరిగిపోతోంది. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కవిత మళ్ళీ ఇటువైపు తిరిగి కూడా చూడలేదు. పార్టీపరంగా ఏదైనా కార్యక్రమం లేకపోతే నేతల ఇళ్ళల్లో జరిగే కార్యక్రమాలకు హాజరవ్వటం తప్ప మాజీ ఎంపీ హోదాలో జిల్లాలో పర్యటించటం మానుకున్నారు

ఆ తర్వాత జిల్లా నుండి స్ధానికసంస్ధల కోటాలో ఎంఎల్సీగా గెలిచినా కూడా జిల్లాలో యాక్టివ్ గా కనబడలేదు. అలాంటిది చాలాకాలం తర్వాత ఈమధ్యనే యాక్టివ్ గా తిరుగుతున్నారు. పార్టీ ప్రజాప్రతినిధులతో సమావేశాలు పెడుతున్నారు. అలాగే నియోజకవర్గంలో ఉన్న కులసంఘాల నేతలతో కూడా తరచు భేటీ అవుతున్నారు. ఇదంతా చూసిన తర్వాత రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మళ్ళీ నిజామాబాద్ లో బరిలోకి దిగటం ఖాయమనే ప్రచారం బాగా పెరిగిపోతోంది.

ఇక్కడ కవితకు ఒక సమస్యుంది. అదేమిటంటే 2014లో ఎంపీగా గెలిచినపుడు నియోజకవర్గం అభివృద్ధికి ఇచ్చిన హామీలు చాలావరకు నెరవేరలేదు. కవిత అంటే మామూలు ఎంపీకాదు ముఖ్యమంత్రి కూతురన్న విషయం అందరికీ తెలుసు. కాబట్టే కవిత హామీలిచ్చారంటే కచ్చితంగా నెరవేరుస్తారనే అనుకున్నారు. అయితే దానికి భిన్నంగా వ్యవహరించారు. ఇదే సమయంలో రైతులు, రైతుసంఘాలతో బాగా గొడవలుపెట్టుకున్నారు.

దాంతో 2019 ఎన్నికల్లో అందరు కలిసి కవితను ఓడించారు. ఆ మంటుంది కాబట్టే తర్వాత నియోజకవర్గంలోకి తొంగికూడా చూడలేదు. అయితే తర్వాత ఎంఎల్సీ అయినా ఆమె పద్దతిలో ఎలాంటి మార్పరాలేదు. నియోజకవర్గం అభివృద్ధిపైన పెద్దగా దృష్టిపెట్టకుండా ఎంతసేపు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్విందును టార్గెట్ చేయటంతోనే సరిపోతోంది. ఈమధ్య తాను ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కోబట్టి మిగిలిన విషయాలను కూడా వదిలేశారు. మరీ నేపధ్యంలోనే కవిత రాబోయే ఎన్నికల్లో ఎంపీగా పోటీచేస్తే గెలుస్తారా ? అన్నది ఆసక్తిగా మారింది. 

This post was last modified on June 2, 2023 1:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సాయిపల్లవి బరిలో ఉంటే అవార్డ్ ఇవ్వాల్సిందే

హీరోల కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. హీరోయిన్ల గ్లామర్ కోసం కూడా కొంతమంది సినిమాలకు వస్తారు. కానీ…

33 minutes ago

‘పవన్ హఠావో’ రచయిత మృతి కేసు మిస్టరీ వీడింది

“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ…

57 minutes ago

విన్యాసం మీదే బాక్సాఫీస్ ఆశలు

గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో…

58 minutes ago

ఇటు వివాదం… అటు ముహూర్తం

జై హనుమాన్.. ఈ సినిమా కోసం రెండేళ్ల కిందట్నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతికి…

1 hour ago

కమల్ హీరో… రజినీ విలన్?

సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్‌ల కలయికలో 46 ఏళ్ల తర్వాత సినిమా రాబోతుండడం వాళ్లిద్దరి అభిమానులనే…

2 hours ago

ప్రేమ పెళ్ళి.. తల్లిదండ్రులకు సమాచారం తప్పనిసరి

వివాహ నమోదు నిబంధనల్లో మార్పులు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. పెళ్లి నమోదు చేసుకునే జంటలు…

3 hours ago