గంటా శ్రీనివాసరావు… తెలుగు నేల రాజకీయాల్లో పరిచయం ఎంతమాత్రం అక్కర్లేని పేరే. అధికారంలో ఏ పార్టీ ఉంటే… ఆ పార్టీలోకి ఇట్టే జంప్ చేసే సత్తా కలిగిన నేతల్లో గంటా అగ్రగణ్యుడనే చెప్పాలి. ప్రస్తుతం టీడీపీలో ఉన్న గంటా… అధికార పార్టీగా ఉన్న వైసీపీలోకి జంప్ కొట్టేందుకు దాదాపుగా రంగం సిద్ధం చేసుకున్నారు.
వైసీపీలో ఓ వర్గం ఆయన రాకను అడ్డుకుంటున్నా కూడా గంటా తనదైన మార్కు వ్యూహంతో వైసీపీ అధిష్ఠానం నుంచి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ తెచ్చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తనతో పాటు తన అనుచరవర్గంతో పాటుగా టీడీపీలోని పలువురు కీలక నేతలను కూడా ఆయన తన వెంట వైసీపీలోకి తీసుకెళ్లేందుకు గంటా రంగం సిద్ధం చేసుకున్నారని, ఈ పరిణామం టీడీపీకి పెద్ద షాకివ్వబోతున్నదన్న వార్తలు కూడా ఆసక్తి రేపుతున్నాయి.
తొలుత వ్యాపారవేత్తగా సక్సెస్ సాధించిన తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టిన గంటా… ఆది నుంచి అవకాశవాద రాజకీయాలకే ప్రాధాన్యమిచ్చినట్టుగా చెప్పుకోవాలి. పార్టీ ఏదన్న విషయానికి ప్రాధాన్యం ఇవ్వకుండా అధికారంలో ఉన్న పార్టీలోనే కొనసాగేలా… తద్వారా తన పనులన్నీ సజావుగా సాగేలా చూసుకుంటారని గంటాకు ఓ ప్రత్యేకమైన పేరు ఉంది. ఆ పేరు సార్థకం చేసుకునే క్రమంలోనే గంటా ఇప్పుడు అధికార పార్టీగా మారిన వైసీపీలోకి జంప్ కొట్టేస్తున్నారట.
ఇక టీడీపీ నుంచి తానొక్కడే కాకుండా టీడీపీ టికెట్లపై మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలను కూడా గంటా తన వెంట వైసీపీలోకి తీసుకువెళుతున్నారట. ఇప్పుడీ విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది.
అయినా గంటా వెంట టీడీపీ వీడి వైసీపీలోకి జంప్ కొట్టబోతున్న వారెవరన్న విషయంపై ఆరా తీస్తే… విశాఖ నగరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గణబాబుతో పాటు మరో ఎమ్మెల్యే కూడా ఉన్నారట. అదే సమయంలో విశాఖకే చెందిన టీడీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు కూడా గంటాతో పాటు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైందట.
ఇక వీరు కాకుండా విశాఖ నగరంలో టీడీపీకి చెందిన పలువురు కీలక నేతలు, ద్వితీయ శ్రేణి నేతలు కూడా గంటాతో కలిసి వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారట. దీనికి సంబంధించి తన వెంట ఎవరెవరు వైసీపీలోకి వస్తారన్న వివరాలను ఓ జాబితా రూపంలో గంటా ఆ పార్టీ అధిష్ఠానానికి ఇప్పటికే అందజేశారట. మరి ఆ జాబితాకు వైసీపీ అధిష్ఠానం ఏమంటుందో?… గంటా ఎప్పుడు వైసీపీలోకి చేరతారో చూడాలి.
This post was last modified on August 9, 2020 2:09 pm
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…