కోర్టును తప్పుదోవ పట్టించిన కడప ఎంపీ అవినాష్ లాయర్ పై చర్యలు తీసుకోవాలని వైఎస్ సునీత తరపు లాయర్ మెమో దాఖలుచేశారు. ఇంతకీ విషయం ఏమిటంటే వివేకానందరెడ్డి మర్డర్ కేసులో అవినాష్ కీలక సూత్రదారని సీబీఐ వాదిస్తోంది. కాబట్టి ఎంపీకి బెయిల్ ఇవ్వద్దని పదేపదే కోర్టులో చెప్పింది. అయితే వివేకా మర్డర్ కేసులో ఎంపీ పాత్రకు సంబంధించిన ఆధారాలను సీబీఐ చూపలేకపోయింది.
ఇదే సమయంలో అవినాష్ తల్లికి హైదరాబాద్ లోని ఆసుపత్రిలో ఆపరేషన్ జరగాల్సుంది కాబట్టి అవినాష్ కు బెయిల్ ఇవ్వాలని లాయర్ వాదించారు. అయితే దీన్ని సీబీఐ లాయర్ వ్యతిరేకించారు. అవినాష్ తల్లికి ఆపరేషన్ అవసరమే లేదని, గుండెలో రెండు కవాటాలు పూడుకుపోవటం, స్టంట్లు వేయాలని చెప్పటం నమ్మేట్లుగా లేదన్నారు. అయితే అందుబాటులోని మెడికల్ రికార్డులను పరిశీలించిన జడ్జి ఆపరేషన్ జరగబోతున్నట్లు నమ్మి ఎంపీకి తాత్కాలిక బెయిలిచ్చారు. ఒకవేళ ఆపరేషన్ అన్నది తప్పని తేలితే అవినాష్ లాయర్ పైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇపుడా విషయంమీదే సునీత లాయర్ కోర్టులో మెమో దాఖలుచేశారు. ఎంపీ తల్లికి ఎలాంటి ఆపరేషన్ జరగలేదన్నారు. కోర్టును తప్పుదోవ పట్టించారు కాబట్టి అవినాష్ లాయర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే అవినాష్ లాయర్ వాదన వేరేరకంగా ఉంది. ఆపరేషన్ చేయాల్సిందయితే వాస్తవమే అంటున్నారు. ఇంకా ఆపరేషన్ జరగకపోవటానికి కారణం పేషంట్ బీపీ, షుగర్ కంట్రల్లో ఉండకపోవటమే అని చెప్పారు.
బీపీ, షుగర్ గనుక ఎప్పుడు కంట్రోల్ అయితే అప్పుడు వెంటనే ఆపరేషన్ మొదలవుతుందన్నారు. పేషంట్ గుండెలో రెండు రక్తనాళాలు పూడుకుపోవటంలో వెంటనే స్టంట్ వేయాల్సిన అవసరముందని కర్నూలు ఆసుపత్రులో వైద్యులు నిర్ధారించినట్లు లాయర్ చెప్పారు. అందుకు అవసరమైన రికార్డులన్నింటినీ ఇదివరకే అందించారు. మరి సునీత లాయర్ దాఖలుచేసిన మెమో మీద కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిందే.
This post was last modified on June 1, 2023 6:31 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…