Political News

అవినాష్ లాయర్ పై చర్యలు తీసుకోవాలట

కోర్టును తప్పుదోవ పట్టించిన కడప ఎంపీ అవినాష్ లాయర్ పై చర్యలు తీసుకోవాలని వైఎస్ సునీత తరపు లాయర్ మెమో దాఖలుచేశారు. ఇంతకీ విషయం ఏమిటంటే వివేకానందరెడ్డి మర్డర్ కేసులో అవినాష్ కీలక సూత్రదారని సీబీఐ వాదిస్తోంది. కాబట్టి ఎంపీకి బెయిల్ ఇవ్వద్దని పదేపదే కోర్టులో చెప్పింది. అయితే వివేకా మర్డర్ కేసులో ఎంపీ పాత్రకు సంబంధించిన ఆధారాలను సీబీఐ చూపలేకపోయింది.

ఇదే సమయంలో అవినాష్ తల్లికి హైదరాబాద్ లోని ఆసుపత్రిలో ఆపరేషన్ జరగాల్సుంది కాబట్టి అవినాష్ కు బెయిల్ ఇవ్వాలని లాయర్ వాదించారు. అయితే దీన్ని సీబీఐ లాయర్ వ్యతిరేకించారు. అవినాష్ తల్లికి ఆపరేషన్ అవసరమే లేదని, గుండెలో రెండు కవాటాలు పూడుకుపోవటం, స్టంట్లు వేయాలని చెప్పటం నమ్మేట్లుగా లేదన్నారు. అయితే అందుబాటులోని మెడికల్ రికార్డులను పరిశీలించిన జడ్జి ఆపరేషన్ జరగబోతున్నట్లు నమ్మి ఎంపీకి తాత్కాలిక బెయిలిచ్చారు. ఒకవేళ ఆపరేషన్ అన్నది తప్పని తేలితే అవినాష్ లాయర్ పైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇపుడా విషయంమీదే సునీత లాయర్ కోర్టులో మెమో దాఖలుచేశారు. ఎంపీ తల్లికి ఎలాంటి ఆపరేషన్ జరగలేదన్నారు. కోర్టును తప్పుదోవ పట్టించారు కాబట్టి అవినాష్ లాయర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే అవినాష్ లాయర్ వాదన వేరేరకంగా ఉంది. ఆపరేషన్ చేయాల్సిందయితే వాస్తవమే అంటున్నారు. ఇంకా ఆపరేషన్ జరగకపోవటానికి కారణం పేషంట్ బీపీ, షుగర్ కంట్రల్లో ఉండకపోవటమే అని చెప్పారు.

బీపీ, షుగర్ గనుక ఎప్పుడు కంట్రోల్ అయితే అప్పుడు వెంటనే ఆపరేషన్ మొదలవుతుందన్నారు. పేషంట్ గుండెలో రెండు రక్తనాళాలు పూడుకుపోవటంలో వెంటనే స్టంట్ వేయాల్సిన అవసరముందని కర్నూలు ఆసుపత్రులో వైద్యులు నిర్ధారించినట్లు లాయర్ చెప్పారు. అందుకు అవసరమైన రికార్డులన్నింటినీ ఇదివరకే  అందించారు.  మరి సునీత లాయర్ దాఖలుచేసిన మెమో మీద కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిందే. 

This post was last modified on June 1, 2023 6:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇలాగైతే కష్టమంటున్న కేసీఆర్

తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది. 2023లో జరిగిన మూడో ఎన్నికలో ఆ…

10 minutes ago

‘కరూర్’ మృతుడి తల్లి పాదాలు తాకిన విజయ్

తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాజకీయ తెరంగేట్రం ఆదిలోనే కష్టనష్టాలను చవిచూసింది. ఎన్నికలకు కాస్తంత ముందుగా కరూర్ లో…

48 minutes ago

రామ్ టార్గెట్ ఆరు నెలలు

ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…

2 hours ago

పీఎం పొదుపు మంత్రం… మహానాడుపై ఎఫెక్ట్?

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్‌ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు…

2 hours ago

ఇక పెట్రోల్ బాదుడేనా?

అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…

2 hours ago

జూనియర్ రమేష్ బాబు సౌండ్ పెంచాలి

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…

4 hours ago