కోర్టును తప్పుదోవ పట్టించిన కడప ఎంపీ అవినాష్ లాయర్ పై చర్యలు తీసుకోవాలని వైఎస్ సునీత తరపు లాయర్ మెమో దాఖలుచేశారు. ఇంతకీ విషయం ఏమిటంటే వివేకానందరెడ్డి మర్డర్ కేసులో అవినాష్ కీలక సూత్రదారని సీబీఐ వాదిస్తోంది. కాబట్టి ఎంపీకి బెయిల్ ఇవ్వద్దని పదేపదే కోర్టులో చెప్పింది. అయితే వివేకా మర్డర్ కేసులో ఎంపీ పాత్రకు సంబంధించిన ఆధారాలను సీబీఐ చూపలేకపోయింది.
ఇదే సమయంలో అవినాష్ తల్లికి హైదరాబాద్ లోని ఆసుపత్రిలో ఆపరేషన్ జరగాల్సుంది కాబట్టి అవినాష్ కు బెయిల్ ఇవ్వాలని లాయర్ వాదించారు. అయితే దీన్ని సీబీఐ లాయర్ వ్యతిరేకించారు. అవినాష్ తల్లికి ఆపరేషన్ అవసరమే లేదని, గుండెలో రెండు కవాటాలు పూడుకుపోవటం, స్టంట్లు వేయాలని చెప్పటం నమ్మేట్లుగా లేదన్నారు. అయితే అందుబాటులోని మెడికల్ రికార్డులను పరిశీలించిన జడ్జి ఆపరేషన్ జరగబోతున్నట్లు నమ్మి ఎంపీకి తాత్కాలిక బెయిలిచ్చారు. ఒకవేళ ఆపరేషన్ అన్నది తప్పని తేలితే అవినాష్ లాయర్ పైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇపుడా విషయంమీదే సునీత లాయర్ కోర్టులో మెమో దాఖలుచేశారు. ఎంపీ తల్లికి ఎలాంటి ఆపరేషన్ జరగలేదన్నారు. కోర్టును తప్పుదోవ పట్టించారు కాబట్టి అవినాష్ లాయర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే అవినాష్ లాయర్ వాదన వేరేరకంగా ఉంది. ఆపరేషన్ చేయాల్సిందయితే వాస్తవమే అంటున్నారు. ఇంకా ఆపరేషన్ జరగకపోవటానికి కారణం పేషంట్ బీపీ, షుగర్ కంట్రల్లో ఉండకపోవటమే అని చెప్పారు.
బీపీ, షుగర్ గనుక ఎప్పుడు కంట్రోల్ అయితే అప్పుడు వెంటనే ఆపరేషన్ మొదలవుతుందన్నారు. పేషంట్ గుండెలో రెండు రక్తనాళాలు పూడుకుపోవటంలో వెంటనే స్టంట్ వేయాల్సిన అవసరముందని కర్నూలు ఆసుపత్రులో వైద్యులు నిర్ధారించినట్లు లాయర్ చెప్పారు. అందుకు అవసరమైన రికార్డులన్నింటినీ ఇదివరకే అందించారు. మరి సునీత లాయర్ దాఖలుచేసిన మెమో మీద కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిందే.
This post was last modified on June 1, 2023 6:31 pm
మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…
టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…
‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…
ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాక డిజాస్టర్లుగా నిలిచిపోయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ టైంలో అద్భుతాలు చేయడం చూస్తూనే…