కోర్టును తప్పుదోవ పట్టించిన కడప ఎంపీ అవినాష్ లాయర్ పై చర్యలు తీసుకోవాలని వైఎస్ సునీత తరపు లాయర్ మెమో దాఖలుచేశారు. ఇంతకీ విషయం ఏమిటంటే వివేకానందరెడ్డి మర్డర్ కేసులో అవినాష్ కీలక సూత్రదారని సీబీఐ వాదిస్తోంది. కాబట్టి ఎంపీకి బెయిల్ ఇవ్వద్దని పదేపదే కోర్టులో చెప్పింది. అయితే వివేకా మర్డర్ కేసులో ఎంపీ పాత్రకు సంబంధించిన ఆధారాలను సీబీఐ చూపలేకపోయింది.
ఇదే సమయంలో అవినాష్ తల్లికి హైదరాబాద్ లోని ఆసుపత్రిలో ఆపరేషన్ జరగాల్సుంది కాబట్టి అవినాష్ కు బెయిల్ ఇవ్వాలని లాయర్ వాదించారు. అయితే దీన్ని సీబీఐ లాయర్ వ్యతిరేకించారు. అవినాష్ తల్లికి ఆపరేషన్ అవసరమే లేదని, గుండెలో రెండు కవాటాలు పూడుకుపోవటం, స్టంట్లు వేయాలని చెప్పటం నమ్మేట్లుగా లేదన్నారు. అయితే అందుబాటులోని మెడికల్ రికార్డులను పరిశీలించిన జడ్జి ఆపరేషన్ జరగబోతున్నట్లు నమ్మి ఎంపీకి తాత్కాలిక బెయిలిచ్చారు. ఒకవేళ ఆపరేషన్ అన్నది తప్పని తేలితే అవినాష్ లాయర్ పైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇపుడా విషయంమీదే సునీత లాయర్ కోర్టులో మెమో దాఖలుచేశారు. ఎంపీ తల్లికి ఎలాంటి ఆపరేషన్ జరగలేదన్నారు. కోర్టును తప్పుదోవ పట్టించారు కాబట్టి అవినాష్ లాయర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే అవినాష్ లాయర్ వాదన వేరేరకంగా ఉంది. ఆపరేషన్ చేయాల్సిందయితే వాస్తవమే అంటున్నారు. ఇంకా ఆపరేషన్ జరగకపోవటానికి కారణం పేషంట్ బీపీ, షుగర్ కంట్రల్లో ఉండకపోవటమే అని చెప్పారు.
బీపీ, షుగర్ గనుక ఎప్పుడు కంట్రోల్ అయితే అప్పుడు వెంటనే ఆపరేషన్ మొదలవుతుందన్నారు. పేషంట్ గుండెలో రెండు రక్తనాళాలు పూడుకుపోవటంలో వెంటనే స్టంట్ వేయాల్సిన అవసరముందని కర్నూలు ఆసుపత్రులో వైద్యులు నిర్ధారించినట్లు లాయర్ చెప్పారు. అందుకు అవసరమైన రికార్డులన్నింటినీ ఇదివరకే అందించారు. మరి సునీత లాయర్ దాఖలుచేసిన మెమో మీద కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిందే.
This post was last modified on June 1, 2023 6:31 pm
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…