ఎంఎల్ఏ ఈటల రాజేందర్ ను బీజేపీ అధిష్టానం బుజ్జగిస్తోంది. పార్టీ చేరికల కమిటి ఛైర్మన్ గా ఈటల ఒక విధంగా ఫెయిలయ్యారనే చెప్పాలి. ఈయన నాయకత్వంలో ఇతర పార్టీల్లోనుండి చెప్పుకోదగ్గనేతలెవరూ బీజేపీలో చేరలేదు. మహబూబ్ నగర్ కు చెందిన మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసులరెడ్డి పార్టీలోకి వస్తారని అనుకుంటే చివరకు వాళ్ళు కూడా రావటంలేదు. వీళ్ళిద్దరినీ ఎలాగైనా పార్టీలోకి చేర్చుకోవాలని ఈటల ఎంతప్రయత్నించినా ఉపయోగం కనబడలేదు.
ఇదే విషయాన్ని ఈటల ఈ మధ్య ఆఫ్ ది రికార్డుగా చెప్పారు. తాము ఎంత ప్రయత్నించినా వాళ్ళిద్దరు పార్టీలో చేరడానికి ఇష్టపడలేదన్నారు. బీజేపీలో చేరడానికి జూపల్లి, పొంగులేటికి ఏదో సమస్య ఉన్నట్లు ఈటల అభిప్రాయపడ్డారు. అసలు పార్టీలో తన పరిస్థితి ఏమిటో తనకే అర్ధం కావటం లేదని కూడా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలన్నీ అధిష్టానం దృష్టికి వెళ్ళాయి. దాంతో వెంటనే అధిష్టానం రంగంలోకి దిగింది. పార్టీలో చేరికల కమిటికి ఛైర్మన్ గా కంటిన్యూ అవ్వాల్సిందే అని ఈటలను గట్టిగా కోరింది.
ఇతర పార్టీల్లో నుండి నేతలను చేర్పించే విషయంలో ప్రయత్నాలను ఎట్టి పరిస్ధితుల్లోను ఆపవద్దని కోరింది. దాంతో ఇపుడు ఈటల విషయం పార్టీలో చర్చనీయాంశమైంది. కారణం ఏమిటంటే ఈటలకు పార్టీ చీఫ్ బండి సంజయ్ కు ఏమాత్రం పడటంలేదనే ప్రచారం అందరికీ తెలిసిందే. పార్టీలోకి ఎవరినైనా తీసుకురావాలంటే ముఖ్యంగా వాళ్ళకి రాబోయే ఎన్నికల్లో టికెట్ హామీ ఇవ్వాలి. ఆ హామీని ఈటల ఇవ్వలేకపోతున్నారు. పార్టీ చీఫ్ గా బండి ఉండగా సొంతంగా ఈటల టికెట్ హామీ ఇవ్వలేరు.
అంటే ప్రతి చేరిక విషయంలోను ఈటల పార్టీ చీఫ్ అనుమతి తీసుకోవాల్సిందే. అభ్యర్థుల విషయంలో ఈటల, బండి ఆలోచనలు వేర్వేరుగా ఉన్నాయట. దాంతో ఇద్దరి మధ్య సమస్యలు పెరిగిపోతున్నాయట. అందుకనే బీజేపీలో చేరడానికి ఎవరూ ముందుకు రావటంలేదు. పైగా కర్నాటకలో కాంగ్రెస్ సాధించిన ఘనవిజయం కూడా ప్రధాన కారణమైంది. కర్నాటకలో గెలుపుతో తెలంగాణాలో కాంగ్రెస్ నేతల్లో జోష్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ కారణంగా కూడా నేతలెవరూ బీజేపీ వైపు చూడటం లేదు. అనేక కారణాల వల్ల ఈటల కూడా ఎక్కడ జారిపోతారో అన్న ఉద్దేశ్యంతో అధిష్టానం బుజ్జగింపులకు దిగినట్లుంది.
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…
మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్ను అనుకోకుండా రివీల్…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి…
"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…
ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…
కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…