ఎల్లుండి విడుదల కాబోతున్న దగ్గుబాటి అభిరాం డెబ్యూ అహింసకు అంతా రెడీగా ఉంది. సామాన్య ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు లేవు కానీ రెగ్యులర్ మూవీ లవర్స్ మాత్రం దర్శకుడు తేజ ఏదైనా మేజిక్ చేయకపోతారాని ఎదురు చూస్తున్నారు. అయితే ప్రమోషన్ల కోసం విస్తృతంగా మీడియాకు అందుబాటులో ఉన్న తేజ సినిమాలో కంటెంట్ కంటే తన కౌంటర్లతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఇటీవలి కాలంలో కాస్త వివాదాస్పద ప్రశ్నలకు హైలైట్ అవుతున్న ఓ జర్నలిస్ట్ ని ప్రెస్ మీట్ అయ్యాక బయట ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూ చేయడం ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.
గతంలో నిర్మాత కూడా అయిన సదరు మీడియా ప్రతినిధిని ఇప్పుడు సినిమాలు ఎందుకు తీయడం లేదని నేరుగా అడిగేశారు. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ టైంలోనూ నేపధ్య సంగీతం అందించిన అనూప్ రూబెన్ పేరు ఎందుకు లేదన్న ప్రశ్నకు ఆర్పి పట్నాయక్ తో పాటు ఇద్దరినీ పరిచయం చేసింది నేనే కాబట్టి నా ఇష్టం అంటూ ఇచ్చిన కౌంటర్ మాములుగా వెళ్లడం లేదు. ఇదొక్కటే కాదు మరో లేడీ యాంకర్ ముఖాముఖీ కార్యక్రమంలో ఆవిడ కాస్త ముఖస్తుతికి వెళ్ళబోతే నా సినిమాల్లో ఇన్ని గొప్ప విషయాలు ఉన్నాయని మీరు చెప్పాకే తెలిసిందని అనడం మరో కొసమెరుపు
మొత్తానికి ఏదైతేనేం తేజ వార్తల్లో నిలుస్తున్నారు. అభిరాంకి ఎలాంటి ఎంట్రీ దక్కుతుందోనని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ప్రత్యేకంగా ఫాలోయర్స్ లేరు కానీ వెంకటేష్, రానా అభిమానులే సపోర్ట్ గా నిలవాలి. ట్రైలర్ అమాంతం అంచనాలు పెంచలేకపోయినా బాక్సాఫీస్ వద్ద నేను స్టూడెంట్ సర్ తప్ప పెద్దగా పోటీలేని అవకాశాన్ని అహింస ఎలా వాడుకుంటుందో చూడాలి. సురేష్ సంస్థ నిర్మాణం కం డిస్ట్రిబ్యూషన్ కాబట్టి థియేటర్ల పరంగా ఎలాంటి సమస్య లేదు. ఎటొచ్చి వీక్ గా మొదలయ్యే ఓపెనింగ్ ని పికప్ చేసుకోవాల్సిన బాధ్యత అభిరాం కన్నా ఎక్కువ తేజ మీద ఉంది
This post was last modified on June 1, 2023 12:19 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…