ఎల్లుండి విడుదల కాబోతున్న దగ్గుబాటి అభిరాం డెబ్యూ అహింసకు అంతా రెడీగా ఉంది. సామాన్య ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు లేవు కానీ రెగ్యులర్ మూవీ లవర్స్ మాత్రం దర్శకుడు తేజ ఏదైనా మేజిక్ చేయకపోతారాని ఎదురు చూస్తున్నారు. అయితే ప్రమోషన్ల కోసం విస్తృతంగా మీడియాకు అందుబాటులో ఉన్న తేజ సినిమాలో కంటెంట్ కంటే తన కౌంటర్లతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఇటీవలి కాలంలో కాస్త వివాదాస్పద ప్రశ్నలకు హైలైట్ అవుతున్న ఓ జర్నలిస్ట్ ని ప్రెస్ మీట్ అయ్యాక బయట ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూ చేయడం ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.
గతంలో నిర్మాత కూడా అయిన సదరు మీడియా ప్రతినిధిని ఇప్పుడు సినిమాలు ఎందుకు తీయడం లేదని నేరుగా అడిగేశారు. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ టైంలోనూ నేపధ్య సంగీతం అందించిన అనూప్ రూబెన్ పేరు ఎందుకు లేదన్న ప్రశ్నకు ఆర్పి పట్నాయక్ తో పాటు ఇద్దరినీ పరిచయం చేసింది నేనే కాబట్టి నా ఇష్టం అంటూ ఇచ్చిన కౌంటర్ మాములుగా వెళ్లడం లేదు. ఇదొక్కటే కాదు మరో లేడీ యాంకర్ ముఖాముఖీ కార్యక్రమంలో ఆవిడ కాస్త ముఖస్తుతికి వెళ్ళబోతే నా సినిమాల్లో ఇన్ని గొప్ప విషయాలు ఉన్నాయని మీరు చెప్పాకే తెలిసిందని అనడం మరో కొసమెరుపు
మొత్తానికి ఏదైతేనేం తేజ వార్తల్లో నిలుస్తున్నారు. అభిరాంకి ఎలాంటి ఎంట్రీ దక్కుతుందోనని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ప్రత్యేకంగా ఫాలోయర్స్ లేరు కానీ వెంకటేష్, రానా అభిమానులే సపోర్ట్ గా నిలవాలి. ట్రైలర్ అమాంతం అంచనాలు పెంచలేకపోయినా బాక్సాఫీస్ వద్ద నేను స్టూడెంట్ సర్ తప్ప పెద్దగా పోటీలేని అవకాశాన్ని అహింస ఎలా వాడుకుంటుందో చూడాలి. సురేష్ సంస్థ నిర్మాణం కం డిస్ట్రిబ్యూషన్ కాబట్టి థియేటర్ల పరంగా ఎలాంటి సమస్య లేదు. ఎటొచ్చి వీక్ గా మొదలయ్యే ఓపెనింగ్ ని పికప్ చేసుకోవాల్సిన బాధ్యత అభిరాం కన్నా ఎక్కువ తేజ మీద ఉంది
This post was last modified on June 1, 2023 12:19 am
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…