రాజకీయాల్లో జరిగే కొన్ని కొన్ని ఘటనలు చాలా చిత్రంగా ఉంటాయి. ఇవి నమ్మేందుకు కూడా అతిశయంగానే అనిపిస్తాయి. కానీ, ఏం చేస్తాం.. నమ్మితీరాలి.. అంటున్నారు పరిశీలకులు. ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ అయితే.. ఇచ్చింది.
కొన్ని షరతులు విధించింది. ప్రతి శనివారం.. సీబీఐ ముందు విచారణకు హాజరు కావాలని.. ఇది కూడా కాకుండా.. ఎప్పుడు పిలిస్తే..అప్పుడు అధికారులకు అందుబాటులో ఉండాలని కూడా ఆదేశించింది. సరే..మొత్తానికి ఎంపీ అవినాష్ కోరుకున్నట్టు ముందస్తు బెయిల్ అయితే.. వచ్చేసింది. అయితే.. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..(నెటిజన్లు చెప్పుకొనేది) ఇలా బెయిల్ ఉత్తర్వులు.. రాగానే.. అలా అవినాష్రెడ్డి మాతృమూర్తిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తున్నట్టు వైద్యులు ప్రకటించారు.
దీనిపై నెటిజన్లు అనేక కామెంట్లు చేస్తున్నారు. సరే.. ఇదిలావుంటే..ఈ నెల 19న సీబీఐ విచారణకు హాజరు కావాల్సిన ఎంపీ అవినాష్రెడ్డి.. పులివెందుల నుంచి బయలు దేరారు. అయితే.. మధ్యంలో తన మాతృమూ ర్తి శ్రీలక్ష్మికి అనారోగ్యం అనితెలియడంతో ఆయన అక్కడ నుంచి వెనుదిరిగి.. కర్నూలు చేరుకున్నారు. దాదాపు 9 రోజులు కర్నూలులోని విశ్వభారతి వైద్య శాలలో శ్రీలక్ష్మికి వైద్యం అందించారు. ఇక, ఇటీవల ఆమెను హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు.
ఇక్కడ కొన్నాళ్లు ఉంచుతామని వైద్యులు చెప్పారు. అయితే.. అనూహ్యంగా బుధవారం ఉదయం ఎంపీ అవినాష్రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడం.. ఆవెంటనే నిముషాల వ్యవధిలోనే శ్రీలక్ష్మిని డిశ్చార్జ్ చేస్తున్నట్టు వైద్యులు ప్రకటించడం.. సంచలనంగా మారింది. దీంతో ఎంపీ అవినాష్రెడ్డి తన తల్లిని ప్రత్యేక వాహనంలో తీసుకుని పులివెందుల వెళ్లనున్నట్టు ఆయననుచరులు చెప్పారు.
This post was last modified on May 31, 2023 6:21 pm
సోషల్ మీడియాలో ఎప్పుడేం జరుగుతుందో.. దేనికి మురిసిపోతారో? ఏ విషయానికి ఆగ్రహానికి గురవుతారో అంచనా వేయటం అంత తేలికైన విషయం…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ప్రకటించే నంది అవార్డులకు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డులతో సమానంగా చూసేవారు.…
స్టార్ హీరో సినిమాల్లో ఐటెం సాంగ్స్ అన్నవి చాలా ఏళ్ల నుంచి కామన్గా ఉంటున్నాయి. సుకుమార్ సహా చాలామంది దర్శకులు…
గత దశాబ్ద కాలంలో తెలుగువారు ఎంతో మెచ్చిన పరభాషా కథానాయికల్లో సాయిపల్లవి ముందు వరుసలో ఉంటుంది. ఆమెను నాన్ లోకల్…
రాజకీయాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని.. దీనికి మహిళలు కూడా సిద్ధంగా ఉండాలని తాజాగా ఏపీ సీఎం, టీడీపీ…
టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత అసలు ఫ్లాపే లేని దర్శకుడు అనిల్ రావిపూడి. ఇద్దరినీ పోల్చడం సబబు కాకపోయినా ఇండస్ట్రీలో…