రాజకీయాల్లో జరిగే కొన్ని కొన్ని ఘటనలు చాలా చిత్రంగా ఉంటాయి. ఇవి నమ్మేందుకు కూడా అతిశయంగానే అనిపిస్తాయి. కానీ, ఏం చేస్తాం.. నమ్మితీరాలి.. అంటున్నారు పరిశీలకులు. ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ అయితే.. ఇచ్చింది.
కొన్ని షరతులు విధించింది. ప్రతి శనివారం.. సీబీఐ ముందు విచారణకు హాజరు కావాలని.. ఇది కూడా కాకుండా.. ఎప్పుడు పిలిస్తే..అప్పుడు అధికారులకు అందుబాటులో ఉండాలని కూడా ఆదేశించింది. సరే..మొత్తానికి ఎంపీ అవినాష్ కోరుకున్నట్టు ముందస్తు బెయిల్ అయితే.. వచ్చేసింది. అయితే.. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..(నెటిజన్లు చెప్పుకొనేది) ఇలా బెయిల్ ఉత్తర్వులు.. రాగానే.. అలా అవినాష్రెడ్డి మాతృమూర్తిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తున్నట్టు వైద్యులు ప్రకటించారు.
దీనిపై నెటిజన్లు అనేక కామెంట్లు చేస్తున్నారు. సరే.. ఇదిలావుంటే..ఈ నెల 19న సీబీఐ విచారణకు హాజరు కావాల్సిన ఎంపీ అవినాష్రెడ్డి.. పులివెందుల నుంచి బయలు దేరారు. అయితే.. మధ్యంలో తన మాతృమూ ర్తి శ్రీలక్ష్మికి అనారోగ్యం అనితెలియడంతో ఆయన అక్కడ నుంచి వెనుదిరిగి.. కర్నూలు చేరుకున్నారు. దాదాపు 9 రోజులు కర్నూలులోని విశ్వభారతి వైద్య శాలలో శ్రీలక్ష్మికి వైద్యం అందించారు. ఇక, ఇటీవల ఆమెను హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు.
ఇక్కడ కొన్నాళ్లు ఉంచుతామని వైద్యులు చెప్పారు. అయితే.. అనూహ్యంగా బుధవారం ఉదయం ఎంపీ అవినాష్రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడం.. ఆవెంటనే నిముషాల వ్యవధిలోనే శ్రీలక్ష్మిని డిశ్చార్జ్ చేస్తున్నట్టు వైద్యులు ప్రకటించడం.. సంచలనంగా మారింది. దీంతో ఎంపీ అవినాష్రెడ్డి తన తల్లిని ప్రత్యేక వాహనంలో తీసుకుని పులివెందుల వెళ్లనున్నట్టు ఆయననుచరులు చెప్పారు.
This post was last modified on May 31, 2023 6:21 pm
ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రస్తుతం సీబీఐ విచారణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్ను కూడా నెల్లూరు…
డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…
వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…
హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…