ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పాత్రపై కల్వకుంట్ల కవితను ఈడీ ఆడుకుంటున్నట్లే ఉంది. ఒకసారి కోర్టులో దాఖలుచేసిన చార్జిషీట్లో కవిత పేరు మాయమైపోతుంది. మొత్తం చార్జిషీట్లో కవిత పేరు ఎక్కడా కనబడదు. దాంతో చార్జిషీట్లో నుండి పేరును ఈడీ తీసేసింది కాబట్టి కవితకు పెద్ద రిలీఫ్ దొరికినట్లే అని బీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకుంటారు. అంతకుముందు వరుసగా మూడురోజులు విచారణకు రమ్మని కవితపై ఈడీ బాగా ఒత్తిడితెచ్చింది. విచారణలో ముప్పుతిప్పులు పెట్టింది.
తాజాగా అంటే మంగళవారం కోర్టులో సమర్పించిన చార్జిషీట్లో కవితపేరును ఈడీ 53 సార్లు ప్రస్తావించింది. 278 పేజీల చార్జిషీట్లో అరుణ్ పిళ్ళై, సమీర్ మహేంద్రు స్టేట్మెంట్లున్నాయి. వీళ్ళిద్దరి స్టేట్మెంట్లలో చాలాచోట్ల కవిత ప్రస్తావనను ఈడీ తెచ్చింది. సౌత్ గ్రూపులో కవిత తరపున తానే ప్రతినిధిగా వ్యవహరించినట్లు అరుణ్ పిళ్ళై అంగీకరించినట్లు ఈడీ చార్జిషీట్లో స్పష్టంగా చెప్పింది. లిక్కర్ పాలసీని తయారుచేసేముందే కవితతో ఆప్ తరపున విజయ నాయర్ చాలాసార్లు మాట్లాడినట్లు ఈడీ ఆధారాలతో సహా చెప్పింది.
లిక్కర్ పాలసీ విషయంలోనే కాకుండా తర్వాత జరుగుతున్న బిజినెస్ విషయంపైన కూడా కవిత-సమీర్ మహేంద్రు చాలాసార్లు ఫేస్ టైంలో మాట్లాడుకున్నారనే ఆధారాలను చార్జిషీట్లో చెప్పింది. ఇదే విషయంపైన హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో కవిత భర్త అనీల్ కూడా పాల్గొన్నారని కొన్ని ఆధారాలను కూడా ఈడీ కోర్టుముందుంచుంది. దాంతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తనతో పాటు కవిత తన భర్త అనీల్ ను కూడా తగిలించినట్లయ్యింది.
మొత్తానికి ఒక చార్జిషీట్లో కవిత పేరు ప్రస్తావిస్తున్న ఈడీ మరో చార్జిషీట్లో కవిత పేరును ఎందుకు ప్రస్తావించటంలేదో అర్ధంకావటంలేదు. నిజానికి కవితను ఈడీ అరెస్టుచేయటం ఖాయమని విచారణ సందర్భంగానే బాగా ప్రచారం జరిగింది. కవిత అరెస్టు ఖాయమని స్వయంగా కేసీయార్ ప్రకటించారు. దాంతో ఈడీ విచారణ అన్నప్పుడల్లా బీఆర్ఎస్ నేతలు భారీఎత్తున ఢిల్లీకి చేరుకునే వాళ్ళు. అప్పట్లో అరెస్టని అంత ప్రచారం జరిగినా ఎందుకనో అరెస్టుచేయలేదు. అలాంటిది ఇపుడు మళ్ళీ చార్జిషీట్లో కవిత ప్రస్తావన తెచ్చింది. మరీసారి ఏమవుతుందో చూడాల్సిందే.
This post was last modified on May 31, 2023 11:02 am
తెలుగు వారి నూతన సంవత్సరాది ఉగాది మరో 20 రోజుల్లో రానుంది. ఏటా వచ్చే పండుగే కదా.. ఏముంది ?…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప.. సభకు…
ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…