ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పాత్రపై కల్వకుంట్ల కవితను ఈడీ ఆడుకుంటున్నట్లే ఉంది. ఒకసారి కోర్టులో దాఖలుచేసిన చార్జిషీట్లో కవిత పేరు మాయమైపోతుంది. మొత్తం చార్జిషీట్లో కవిత పేరు ఎక్కడా కనబడదు. దాంతో చార్జిషీట్లో నుండి పేరును ఈడీ తీసేసింది కాబట్టి కవితకు పెద్ద రిలీఫ్ దొరికినట్లే అని బీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకుంటారు. అంతకుముందు వరుసగా మూడురోజులు విచారణకు రమ్మని కవితపై ఈడీ బాగా ఒత్తిడితెచ్చింది. విచారణలో ముప్పుతిప్పులు పెట్టింది.
తాజాగా అంటే మంగళవారం కోర్టులో సమర్పించిన చార్జిషీట్లో కవితపేరును ఈడీ 53 సార్లు ప్రస్తావించింది. 278 పేజీల చార్జిషీట్లో అరుణ్ పిళ్ళై, సమీర్ మహేంద్రు స్టేట్మెంట్లున్నాయి. వీళ్ళిద్దరి స్టేట్మెంట్లలో చాలాచోట్ల కవిత ప్రస్తావనను ఈడీ తెచ్చింది. సౌత్ గ్రూపులో కవిత తరపున తానే ప్రతినిధిగా వ్యవహరించినట్లు అరుణ్ పిళ్ళై అంగీకరించినట్లు ఈడీ చార్జిషీట్లో స్పష్టంగా చెప్పింది. లిక్కర్ పాలసీని తయారుచేసేముందే కవితతో ఆప్ తరపున విజయ నాయర్ చాలాసార్లు మాట్లాడినట్లు ఈడీ ఆధారాలతో సహా చెప్పింది.
లిక్కర్ పాలసీ విషయంలోనే కాకుండా తర్వాత జరుగుతున్న బిజినెస్ విషయంపైన కూడా కవిత-సమీర్ మహేంద్రు చాలాసార్లు ఫేస్ టైంలో మాట్లాడుకున్నారనే ఆధారాలను చార్జిషీట్లో చెప్పింది. ఇదే విషయంపైన హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో కవిత భర్త అనీల్ కూడా పాల్గొన్నారని కొన్ని ఆధారాలను కూడా ఈడీ కోర్టుముందుంచుంది. దాంతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తనతో పాటు కవిత తన భర్త అనీల్ ను కూడా తగిలించినట్లయ్యింది.
మొత్తానికి ఒక చార్జిషీట్లో కవిత పేరు ప్రస్తావిస్తున్న ఈడీ మరో చార్జిషీట్లో కవిత పేరును ఎందుకు ప్రస్తావించటంలేదో అర్ధంకావటంలేదు. నిజానికి కవితను ఈడీ అరెస్టుచేయటం ఖాయమని విచారణ సందర్భంగానే బాగా ప్రచారం జరిగింది. కవిత అరెస్టు ఖాయమని స్వయంగా కేసీయార్ ప్రకటించారు. దాంతో ఈడీ విచారణ అన్నప్పుడల్లా బీఆర్ఎస్ నేతలు భారీఎత్తున ఢిల్లీకి చేరుకునే వాళ్ళు. అప్పట్లో అరెస్టని అంత ప్రచారం జరిగినా ఎందుకనో అరెస్టుచేయలేదు. అలాంటిది ఇపుడు మళ్ళీ చార్జిషీట్లో కవిత ప్రస్తావన తెచ్చింది. మరీసారి ఏమవుతుందో చూడాల్సిందే.
This post was last modified on May 31, 2023 11:02 am
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…