Political News

విమానాన్ని పేలకుండా ఆపిందేంటి?

విమానం కూలిందంటే అందులోంచి మంట‌లు రావాల్సిందే. పేలుడు లాంటిది జరిగి అందులో ఉన్న ప్ర‌యాణికుల్లో మెజారిటీ ప్రాణాలు కోల్పోవ‌డం స‌హ‌జం. కానీ కేర‌ళ‌లోని కోళికోడ్‌లో జ‌రిగిన ప్ర‌మాదంలో విమానం రెండు ముక్క‌లైంది కానీ అందులోంచి మంట‌లు రాలేదు. పొగ ఛాయ‌లు సైతం లేవు. ఇది చాలామంది నిపుణుల‌ను సైతం ఆశ్చ‌ర్య‌ప‌రిచిన విష‌యం. విమానం ల్యాండ్ అయ్యే స‌మ‌యానికి ఓ మోస్త‌రుగానే ఇంధ‌నం ఉంటుంది కాబ‌ట్టి.. అది కూలిన‌పుడు మంట‌లు చెల‌రేగ‌డం స‌హ‌జం. కానీ కోళికోడ్ ప్ర‌మాదంలో అలా జ‌ర‌గ‌క‌పోవ‌డానికి పైల‌ట్ దీప‌క్ సాథె నైపుణ్య‌మే కార‌ణం అన్న‌ది అత‌డి స‌న్నిహితుల మాట‌. దీనిపై దీప‌క్ మిత్రుడొక‌రు ఫేస్‌బుక్‌లో పోస్టు కూడా పెట్టారు.

కార్గిల్ యుద్ధంలో కూడా పాల్గొన్న అనుభ‌వ‌మున్న దీప‌క్ సాథె.. కోళికోడ్ విమానాశ్ర‌యంలో ఫ్లైట్‌ను ల్యాండ్ చేసే స‌మ‌యంలో ప్ర‌మాదం జ‌ర‌గ‌బోతోంద‌ని ఊహించాడ‌ని.. అది త‌ప్ప‌ద‌ని అర్థ‌మ‌య్యాక వెంట‌నే ల్యాండ్ చేయ‌కుండా విమానాన్ని ఇటు అటు కొంత‌సేపు తిప్పాడ‌ని.. దీంతో ఇంధ‌నం మొత్తం ఖాళీ అయిపోయింద‌ని.. ఆ త‌ర్వాత ల్యాండింగ్‌కు ప్ర‌య‌త్నించ‌గా.. విమానం అదుపు త‌ప్పి కూలిపోయి రెండు ముక్క‌లైంద‌ని.. అయితే విమానంలో ఇంధ‌నం లేక‌పోవ‌డం వ‌ల్ల మంట‌లు చెల‌రేగ‌డం, పొగ‌లు రావ‌డం లాంటివేమీ జ‌ర‌గ‌లేద‌ని.. ఇలా చేసి దీప‌క్ మెజారిటీ ప్ర‌యాణికుల‌ను కాపాడాడ‌ని ఈ పోస్టులో దీప‌క్ మిత్రుడైన ఓ ప్ర‌భుత్వ‌ ఉన్న‌తాధికారి తెలిపారు. కోళికోడ్ ప్ర‌మాదంలో దీప‌క్‌తో పాటు కో పైల‌ట్, 17 మంది ప్ర‌యాణికులు ప్రాణాలు వ‌దిలిన సంగ‌తి తెలిసిందే.

This post was last modified on August 8, 2020 9:06 pm

Share

Recent Posts

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

2 hours ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

2 hours ago

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

9 hours ago

దీపికా విషయంలో సందీప్ వంగానే కరెక్ట్

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…

10 hours ago

హృద‌య విదార‌కం… టీచ‌ర్ దెబ్బ‌కు ప్రాణం వ‌దిలిన పిల్లాడు

పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్య‌వ‌హ‌రించాలో చెప్పే ఉదంత‌మిది. విద్యార్థుల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్టాల‌ని, వారిలో భ‌యం పెంచాల‌ని…

11 hours ago

యాక్సిడెంట్ కేసులో జనసేన ఎంపీ తనయుడు

హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…

12 hours ago