విమానం కూలిందంటే అందులోంచి మంటలు రావాల్సిందే. పేలుడు లాంటిది జరిగి అందులో ఉన్న ప్రయాణికుల్లో మెజారిటీ ప్రాణాలు కోల్పోవడం సహజం. కానీ కేరళలోని కోళికోడ్లో జరిగిన ప్రమాదంలో విమానం రెండు ముక్కలైంది కానీ అందులోంచి మంటలు రాలేదు. పొగ ఛాయలు సైతం లేవు. ఇది చాలామంది నిపుణులను సైతం ఆశ్చర్యపరిచిన విషయం. విమానం ల్యాండ్ అయ్యే సమయానికి ఓ మోస్తరుగానే ఇంధనం ఉంటుంది కాబట్టి.. అది కూలినపుడు మంటలు చెలరేగడం సహజం. కానీ కోళికోడ్ ప్రమాదంలో అలా జరగకపోవడానికి పైలట్ దీపక్ సాథె నైపుణ్యమే కారణం అన్నది అతడి సన్నిహితుల మాట. దీనిపై దీపక్ మిత్రుడొకరు ఫేస్బుక్లో పోస్టు కూడా పెట్టారు.
కార్గిల్ యుద్ధంలో కూడా పాల్గొన్న అనుభవమున్న దీపక్ సాథె.. కోళికోడ్ విమానాశ్రయంలో ఫ్లైట్ను ల్యాండ్ చేసే సమయంలో ప్రమాదం జరగబోతోందని ఊహించాడని.. అది తప్పదని అర్థమయ్యాక వెంటనే ల్యాండ్ చేయకుండా విమానాన్ని ఇటు అటు కొంతసేపు తిప్పాడని.. దీంతో ఇంధనం మొత్తం ఖాళీ అయిపోయిందని.. ఆ తర్వాత ల్యాండింగ్కు ప్రయత్నించగా.. విమానం అదుపు తప్పి కూలిపోయి రెండు ముక్కలైందని.. అయితే విమానంలో ఇంధనం లేకపోవడం వల్ల మంటలు చెలరేగడం, పొగలు రావడం లాంటివేమీ జరగలేదని.. ఇలా చేసి దీపక్ మెజారిటీ ప్రయాణికులను కాపాడాడని ఈ పోస్టులో దీపక్ మిత్రుడైన ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి తెలిపారు. కోళికోడ్ ప్రమాదంలో దీపక్తో పాటు కో పైలట్, 17 మంది ప్రయాణికులు ప్రాణాలు వదిలిన సంగతి తెలిసిందే.
This post was last modified on August 8, 2020 9:06 pm
త్రివిక్రమ్ అన్నట్టు కొన్ని అద్భుతాలు ఎవరూ ఊహించరు, అవి జరిగినప్పుడు చూస్తూ ఉండిపోవాలంతే. దానికి గొప్ప ఉదాహరణగా బాలీవుడ్ 'హనుమాన్…
పాతిక రోజులకు చేరుకున్నా బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తూనే ఉన్న ఇరుముడి ఎట్టకేలకు థియేటర్ రన్ ముగింపుకి వచ్చినట్టే. నెట్…
నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…
శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయన అనుకూల…
మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…
విశాఖపట్నంలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఆశలు గల్లంతవుతున్నాయి. గతంలో ఉన్న పట్టు.. ఇప్పుడు లేకపోవడం.. గతంలో సాయిరెడ్డి వంటి…