విమానం కూలిందంటే అందులోంచి మంటలు రావాల్సిందే. పేలుడు లాంటిది జరిగి అందులో ఉన్న ప్రయాణికుల్లో మెజారిటీ ప్రాణాలు కోల్పోవడం సహజం. కానీ కేరళలోని కోళికోడ్లో జరిగిన ప్రమాదంలో విమానం రెండు ముక్కలైంది కానీ అందులోంచి మంటలు రాలేదు. పొగ ఛాయలు సైతం లేవు. ఇది చాలామంది నిపుణులను సైతం ఆశ్చర్యపరిచిన విషయం. విమానం ల్యాండ్ అయ్యే సమయానికి ఓ మోస్తరుగానే ఇంధనం ఉంటుంది కాబట్టి.. అది కూలినపుడు మంటలు చెలరేగడం సహజం. కానీ కోళికోడ్ ప్రమాదంలో అలా జరగకపోవడానికి పైలట్ దీపక్ సాథె నైపుణ్యమే కారణం అన్నది అతడి సన్నిహితుల మాట. దీనిపై దీపక్ మిత్రుడొకరు ఫేస్బుక్లో పోస్టు కూడా పెట్టారు.
కార్గిల్ యుద్ధంలో కూడా పాల్గొన్న అనుభవమున్న దీపక్ సాథె.. కోళికోడ్ విమానాశ్రయంలో ఫ్లైట్ను ల్యాండ్ చేసే సమయంలో ప్రమాదం జరగబోతోందని ఊహించాడని.. అది తప్పదని అర్థమయ్యాక వెంటనే ల్యాండ్ చేయకుండా విమానాన్ని ఇటు అటు కొంతసేపు తిప్పాడని.. దీంతో ఇంధనం మొత్తం ఖాళీ అయిపోయిందని.. ఆ తర్వాత ల్యాండింగ్కు ప్రయత్నించగా.. విమానం అదుపు తప్పి కూలిపోయి రెండు ముక్కలైందని.. అయితే విమానంలో ఇంధనం లేకపోవడం వల్ల మంటలు చెలరేగడం, పొగలు రావడం లాంటివేమీ జరగలేదని.. ఇలా చేసి దీపక్ మెజారిటీ ప్రయాణికులను కాపాడాడని ఈ పోస్టులో దీపక్ మిత్రుడైన ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి తెలిపారు. కోళికోడ్ ప్రమాదంలో దీపక్తో పాటు కో పైలట్, 17 మంది ప్రయాణికులు ప్రాణాలు వదిలిన సంగతి తెలిసిందే.
This post was last modified on August 8, 2020 9:06 pm
తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో కల్తీ నెయ్యి వ్యవహారం మరింత కాక రేపుతోంది. గత 2024 సెప్టెంబరు నుంచి ఇప్పటి…
గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు దర్శనం లేక డీలాపడిన అభిమానులకు ఊరట కలిగించేలా వారణాసి ఇంటర్వ్యూలు విడుదలయ్యాయి. మహేష్…
ప్రపంచంలోనే అతి పెద్ద సినిమా మార్కెట్ ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. ఐతే భారీ చిత్రాల వీక్షణలో అద్భుతమైన అనుభూతిని…
బుల్లితెర నటుడు ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ తన ప్రతి ప్రెస్ మీట్ లో ఏదో ఒక వైరల్ కంటెంట్ ఇవ్వడం…
జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబును ముద్రగడ పద్మనాభం పరామర్శించడం, జనసేన పార్టీలో ఉన్నా ఆయన కుమార్తె ఈ…
డైరెక్టర్ కమ్ హీరోగా సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తూ యూత్ ఫుల్ హీరోగా సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు ప్రదీప్ రంగనాథ్.…