Political News

మహానాడు.. ఆ న‌లుగురు ఏమ‌య్యారు?

అత్యంత కీల‌క‌మ‌ని టీడీపీ అధినేత చెబుతూ వ‌చ్చిన మ‌హానాడు.. ముగిసింది. వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లో గెలు పే ల‌క్ష్యంగా ఆయ‌న ఈ మ‌హానాడును తీర్చిదిద్దారు. ఎన్టీఆర్ ఫ్రేమ్‌.. త‌న ఇమేజ్‌క‌ల‌గ‌లిపి వ‌చ్చే ఎన్నిక ల్లో వైసీపీని చిత్తుగా ఓడించాల‌నేది చంద్ర‌బాబు వ్యూహం. అయితే.. ఇంత ఇంపార్టెంటు అని చెబుతున్న మ‌హానాడుకు న‌లుగురు కీల‌క నాయ‌కులు.. డుమ్మా కొట్ట‌డం.. పార్టీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

వారిలో విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని, విశాఖ ఉత్త‌రం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు, మాజీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు త‌న‌యుడు కోడెల శివ‌రామ‌కృష్ణ‌, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వి, బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే సుజ‌య్ కృష్ణ రంగారావు, గుంటూరుకు చెందిన రాయ‌పాటి సాంబ‌శివ‌రావు, ఆయ‌న త‌న‌యుడు రంగారావు వంటివారి పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. వీరితోపాటు.. 2017లో వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి సైకిల్ ఎక్కిన 23 మంది ఎమ్మెల్యేల్లో .. 15 మంది వ‌ర‌కు ఇప్పుడు మ‌హానాడుకు డుమ్మా కొట్టారు.

సొంత జిల్లాకు చెందిన వంత‌ల రాజేశ్వ‌రి.. వంటి వారు కూడా రాలేదు. ఇక‌, జ‌గ‌న్‌పై నిప్పులు చెరిగిన గిడ్డి ఈశ్వ‌రి కూడా క‌నిపించ‌లేదు. అదేస‌మ‌యంలో విజ‌య‌వాడ‌కు చెందిన‌ జ‌లీల్ ఖాన్ మాత్రం కొంత హ‌డావుడి చేశారు. అయితే.. ఇక్క‌డ కూడా బుద్దా వెంక‌న్న‌, నాగుల్ మీరా వ‌ర్గం.. ఒక ర‌కంగా.. జ‌లీల్ ఖాన్ మ‌రోర‌కంగా వ్య‌వ‌హ‌రించారు. దీంతో మ‌హానాడులో ఈ కీల‌క నేత‌ల మిస్సింగుల‌పై పార్టీలోను, రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ చ‌ర్చ సాగుతోంది.

మ‌రి వారుఉద్దేశ పూర్వ‌కంగానే డుమ్మా కొట్టారా?  లేక‌.. ఏదైనా బ‌ల‌మైన కార‌ణం ఉందా? అనేది తేలాల్సి ఉంది. పైన చెప్పుకొన్న నాయ‌కుల్లో చాలా మంది.. వైసీపీకి మ‌ళ్లీ ట‌చ్‌లో ఉన్నార‌ని కొంద‌రు నాయ‌కులు వ్యాఖ్యానిస్తుండ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. అదేస‌మ‌యంలో ఇది క‌రెక్ట్ కాదు..పార్టీలో ఉన్న అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల నేప‌థ్యంలోనే ఇలా వారు దూరంగా ఉన్నార‌ని మ‌రికొంద‌రు అంటున్నారు. ఏదేమైనా ..చంద్ర‌బాబు వీరికి ఎలాంటి క్లాస్ ఇస్తారో చూడాలి.

Satya

Recent Posts

ప్రపంచమంతా ఎదురు చూస్తున్న ‘ది ఒడిస్సీ’

ప్రపంచమంతా ఒక సినిమా కోసం ఎదురు చూడటం చాలా అరుదు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది ఒడిస్సీ ఈ…

2 hours ago

బాబోయ్.. డిటర్జెంట్‌ పొడితో 2.3 కోట్ల లీటర్ల పాలు తయారు?

 మహారాష్ట్రలో భారీ పాల కల్తీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ధారాశివ్ జిల్లా భూమ్ తాలూకాలో పోలీసులు, ఆహార భద్రత-ఔషధ పరిపాలన…

7 hours ago

‘ఎన్టీఆర్ పేరుతో ప్రెస్ నోట్… సంతకం ఎక్కడ?’

ఊరు వాడ పేరుతో ఎన్టీఆర్ అభిమానులు చేప‌డుతున్న సేవా కార్య‌క్ర‌మాల వ్య‌వ‌హారం ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి…

8 hours ago

అనుకూలమైన తీర్పు కోసం జడ్జి కుర్చీపైనే చేతబడి…!

న్యాయస్థానంలో సాక్ష్యాధారాలే కీలకం. మూఢనమ్మకాలతో చట్టాన్ని ప్రభావితం చేయలేరు... అయితే అమాయకత్వమో.. మరి ఏమో కానీ తీర్పు తనకు అనుకూలంగా…

8 hours ago

త్రివిక్రమ్ కోసం బ్రేస్‌లెట్ తాకట్టు

సినీ రంగంలో గొప్ప స్థాయికి చేరుకున్న చాలామంది దర్శకులు ఒకప్పుడు అనామకులే. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అవకాశాల కోసం కాళ్లరిగేలా…

9 hours ago

ఏం పాపం చేశారని… చిన్నారులనూ చిదిమేస్తున్నారు

ఒకే రోజు ఏపీలో రెండు ఘటనలు.. ఒకటి ప్రకాశం జిల్లా సింగరాయకొండ. మరొకటి పల్నాడు జిల్లా వినుకొండ. రెండు ప్రాంతాలు…

9 hours ago