అంగరంగ వైభవంగా రెండు రోజుల పాటు నిర్వహించిన మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు అనేక విషయాలను ప్రస్తావించారు. వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతల దూకుడును ప్రస్తావిం చారు. రౌడీ రాజకీయం అంటూ.. విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న దోపిడీని కూడా చంద్రబాబు ప్రస్తావించారు. అయితే.. ఇంత వరకుబాగానే ఉంది. కానీ, పార్టీ నాయకులు..సీనియర్ నేతలు ఆశగా ఎదురు చూసిన మూడు విషయాలను మాత్రం చంద్రబాబు మిస్ చేశారనే వాదన వినిపిస్తోంది.
1) వారసుల విషయం: పార్టీ నుంచి ఈ సారికూడా భారీ సంఖ్యలో వారసులు పోటీ చేసేందుకు రెడీగా ఉన్నారు. వీరిలో ఇప్పటికే కొందరు తమకు టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. అయితే.. గత ఎన్నికల్లో అంటే.. 2019లో వారసులకు చాలా మందికి టికెట్లు చంద్రబాబు చేతులు కాల్చుకున్నారనే వాదన వినిపించింది. దీంతో ఈసారివారసులకు ఇస్తారా? ఇవ్వరా? అనే చర్చ సాగింది. దీనిపై మహానాడులో ఏదో ఒకటి తేల్చేస్తారని అందరూ అనుకున్నారు.కానీ..చంద్రబాబు మౌనం వహించారు.
2) అంతర్గత కుమ్ములాటలు: టీడీపీ చాలా బాగుందని పైకి చెబుతున్నప్పటికీ.. పార్టీలో అంతర్గత కుమ్ము లాటలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పరిణామాలతోనే కొందరు నాయకులు తాజాగా నిర్వహించిన మహానాడుకు హాజరు కాలేదు. ఇక, వచ్చే ఎన్నికల నాటికి ఈ పరిస్థితిని అదుపు చేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే.. ఈ విషయాన్ని కూడా పార్టీలో ప్రస్తావించలేదు.
3) హ్యాట్రిక్ పరాజయాలు: దాదాపు 50కి పైగా నియోజకవర్గాల్లోటీడీపీ హ్యాట్రిక్ పరాజయాలు పొందుతోంది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో పార్టీని ఎలా ముందుకు నడిపించాలి? ఏయే అభ్యర్థులను బరిలో దింపాలి? అనే విషయాలపైనా మహానాడులో అంతర్మథనం సాగుతుందని.. ఒక కొలిక్కి తీసుకువస్తారని అనుకున్నారు. కానీ.. అసలు ఈ లోపాలు.. కుమ్ములాటలు.. క్షేత్రస్థాయిలో తర్జనభర్జనలపై ఏమాత్రం చర్చలు లేకుండా.. మహానాడు ముగిసిపోయింది.
This post was last modified on May 29, 2023 7:05 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…