Political News

మ‌హానాడులో వీటిని మిస్స‌య్యారా?  మిస్ చేశారా?

అంగ‌రంగ వైభ‌వంగా రెండు రోజుల పాటు నిర్వ‌హించిన మ‌హానాడులో టీడీపీ అధినేత చంద్ర‌బాబు అనేక విష‌యాల‌ను ప్ర‌స్తావించారు. వైసీపీ పాల‌న‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ నేత‌ల దూకుడును ప్ర‌స్తావిం చారు. రౌడీ రాజ‌కీయం అంటూ.. విమ‌ర్శ‌లు చేశారు. వైసీపీ ప్ర‌భుత్వంలో జ‌రుగుతున్న దోపిడీని కూడా చంద్ర‌బాబు ప్ర‌స్తావించారు. అయితే.. ఇంత వ‌ర‌కుబాగానే ఉంది. కానీ, పార్టీ నాయ‌కులు..సీనియ‌ర్ నేత‌లు ఆశ‌గా ఎదురు చూసిన మూడు విష‌యాల‌ను మాత్రం చంద్ర‌బాబు మిస్ చేశార‌నే వాద‌న వినిపిస్తోంది.

1)  వార‌సుల విష‌యం:  పార్టీ నుంచి ఈ సారికూడా భారీ సంఖ్య‌లో వార‌సులు పోటీ చేసేందుకు రెడీగా ఉన్నారు. వీరిలో ఇప్ప‌టికే కొంద‌రు త‌మ‌కు టికెట్ ఇవ్వాల్సిందేనని ప‌ట్టుబ‌డుతున్నారు. అయితే.. గ‌త ఎన్నిక‌ల్లో అంటే.. 2019లో వార‌సుల‌కు చాలా మందికి టికెట్‌లు చంద్ర‌బాబు చేతులు కాల్చుకున్నార‌నే వాద‌న వినిపించింది. దీంతో ఈసారివార‌సుల‌కు ఇస్తారా? ఇవ్వ‌రా? అనే చ‌ర్చ సాగింది. దీనిపై మ‌హానాడులో ఏదో ఒకటి తేల్చేస్తార‌ని అంద‌రూ అనుకున్నారు.కానీ..చంద్ర‌బాబు మౌనం వ‌హించారు.

2) అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు:  టీడీపీ చాలా బాగుంద‌ని పైకి చెబుతున్న‌ప్ప‌టికీ.. పార్టీలో అంత‌ర్గ‌త కుమ్ము లాట‌లు మాత్రం కొన‌సాగుతూనే ఉన్నాయి. ఈ ప‌రిణామాల‌తోనే కొంద‌రు నాయ‌కులు తాజాగా నిర్వ‌హించిన మ‌హానాడుకు హాజ‌రు కాలేదు. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఈ ప‌రిస్థితిని అదుపు చేయాల్సిన ప‌రిస్థితి ఉంది. అయితే.. ఈ విష‌యాన్ని కూడా పార్టీలో ప్ర‌స్తావించ‌లేదు.

3) హ్యాట్రిక్ ప‌రాజ‌యాలు:  దాదాపు 50కి పైగా నియోజ‌క‌వ‌ర్గాల్లోటీడీపీ హ్యాట్రిక్ ప‌రాజ‌యాలు పొందుతోంది. దీంతో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీని ఎలా ముందుకు న‌డిపించాలి?  ఏయే అభ్య‌ర్థుల‌ను బ‌రిలో దింపాలి? అనే విష‌యాల‌పైనా మ‌హానాడులో అంత‌ర్మ‌థ‌నం సాగుతుంద‌ని.. ఒక కొలిక్కి తీసుకువ‌స్తార‌ని అనుకున్నారు. కానీ.. అస‌లు ఈ లోపాలు.. కుమ్ములాట‌లు.. క్షేత్ర‌స్థాయిలో త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌ల‌పై ఏమాత్రం చ‌ర్చ‌లు లేకుండా.. మ‌హానాడు ముగిసిపోయింది.

Satya

Recent Posts

తెలుగమ్మాయి… హాలీవుడ్‌లో ఇంకాస్త హై లెవెల్

'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…

4 hours ago

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

6 hours ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

6 hours ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

8 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

11 hours ago

భాగ్యశ్రీ మాటతో… మళ్ళీ రామ్ ట్రేండింగ్

టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…

12 hours ago