రాజమండ్రిలో జరిగిన మహానాడు వేదికపై చాలా మంది నాయకులు మాట్లాడారు. అయితే.. కొందరు మాట్లా డిన తీరు.. వారు చేసిన వ్యాఖ్యలపై రాజకీయంగా చర్చ జరుగుతోంది. ఇలాంటి వారిలో నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సొంత పార్టీలోనే చర్చకు దారితీశాయి. ప్రధానంగా రెండు విషయాలను నారా లోకేష్ చర్చించారు. ఒకటి.. టికెట్లపై ఆశ పెట్టుకోకుండా పనిచేయాలని. రెండు వైసీపీ నుంచి ఎవరు వచ్చినా.. తీసుకునేందుకు టికెట్లు ఇచ్చేందుకు సిద్ధంగా లేమని!
ఈ రెండు విషయాలను చాలా సీరియస్గానే ఉన్నాయి. ఎందుకంటే..ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో పార్టీ జెండా మోసి, వివిధ కార్యక్రమాలకు నిధులు సైతం వెచ్చించిన నాయకులు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్నారు. వీరిలో పార్టీలో సొంతగా ఎదిగిన నాయకులు ఎక్కువ మంది ఉన్నారు. అయితే.. వీరికి మహా నాడు వేదికగా సాంత్వన వచనాలు.. అదేసమయంలో కీలక హామీలు దక్కుతాయని ఆశించారు. కానీ, నారా లోకేష్ టికెట్లపై తేల్చేశారు.
ఎవరూ టికెట్ లు ఆశించవద్దని.. తాను ఇచ్చే పరిస్థితి లేదని.. చంద్రబాబు చూసుకుంటారని అన్నారు. దీంతో కొందరు నాయకులు నిరుత్సాహంలో కూరుకుపోయారు. ఇక,రెండోది.. వైసీపీ నుంచి వచ్చే నాయ కుల విషయం. ఇటీవల కాలంలో టీడీపీ నాయకులు స్వయంగా చెబుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని.. త్వరలోనే చేరేందుకు రెడీ అవుతున్నారని.. దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు వచ్చేస్తున్నారని ప్రకటనలు గుప్పిస్తున్నారు.
ఇక, టీడీపీ అనుకూల మీడియాలోనూ వైసీపీ ఖాళీ అయిపోతోందని వార్తలు వచ్చాయి. మరి ఇలాంటి సమ యంలో అనూహ్యంగా నారా లోకేష్ చేసిన ప్రకటన సంచలనమనే చెప్పాలి. వైసీపీ నుంచి వచ్చే వారిని చేర్చుకునేది లేదని.. వచ్చినా టికెట్లు ఇచ్చేది లేదని చెప్పడం ద్వారా నారా లోకేష్ జాగ్రత్త పడ్డారా? లేక తొందర పడ్డారా? అనే చర్చ సాగుతోంది. ఎందుకంటే.. వచ్చేవారు కూడా ఇలాంటి వ్యాఖ్యలతో దూరమవుతారు. తమ దారి తాము చూసుకుంటారు. మరి ఏ వ్యూహంతో నారా లోకేష్ ఈ కామెంట్లు చేశారో చూడాలి.
This post was last modified on May 29, 2023 4:37 pm
చిన్న సినిమా వెనుక అగ్ర నిర్మాతలు, హీరోలు ఉండటం వాటికి చాలా పెద్ద బలమవుతుంది. బలగంలో ఎంత గొప్ప కంటెంట్…
తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…