రాజమండ్రిలో జరిగిన మహానాడు వేదికపై చాలా మంది నాయకులు మాట్లాడారు. అయితే.. కొందరు మాట్లా డిన తీరు.. వారు చేసిన వ్యాఖ్యలపై రాజకీయంగా చర్చ జరుగుతోంది. ఇలాంటి వారిలో నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సొంత పార్టీలోనే చర్చకు దారితీశాయి. ప్రధానంగా రెండు విషయాలను నారా లోకేష్ చర్చించారు. ఒకటి.. టికెట్లపై ఆశ పెట్టుకోకుండా పనిచేయాలని. రెండు వైసీపీ నుంచి ఎవరు వచ్చినా.. తీసుకునేందుకు టికెట్లు ఇచ్చేందుకు సిద్ధంగా లేమని!
ఈ రెండు విషయాలను చాలా సీరియస్గానే ఉన్నాయి. ఎందుకంటే..ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో పార్టీ జెండా మోసి, వివిధ కార్యక్రమాలకు నిధులు సైతం వెచ్చించిన నాయకులు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్నారు. వీరిలో పార్టీలో సొంతగా ఎదిగిన నాయకులు ఎక్కువ మంది ఉన్నారు. అయితే.. వీరికి మహా నాడు వేదికగా సాంత్వన వచనాలు.. అదేసమయంలో కీలక హామీలు దక్కుతాయని ఆశించారు. కానీ, నారా లోకేష్ టికెట్లపై తేల్చేశారు.
ఎవరూ టికెట్ లు ఆశించవద్దని.. తాను ఇచ్చే పరిస్థితి లేదని.. చంద్రబాబు చూసుకుంటారని అన్నారు. దీంతో కొందరు నాయకులు నిరుత్సాహంలో కూరుకుపోయారు. ఇక,రెండోది.. వైసీపీ నుంచి వచ్చే నాయ కుల విషయం. ఇటీవల కాలంలో టీడీపీ నాయకులు స్వయంగా చెబుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని.. త్వరలోనే చేరేందుకు రెడీ అవుతున్నారని.. దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు వచ్చేస్తున్నారని ప్రకటనలు గుప్పిస్తున్నారు.
ఇక, టీడీపీ అనుకూల మీడియాలోనూ వైసీపీ ఖాళీ అయిపోతోందని వార్తలు వచ్చాయి. మరి ఇలాంటి సమ యంలో అనూహ్యంగా నారా లోకేష్ చేసిన ప్రకటన సంచలనమనే చెప్పాలి. వైసీపీ నుంచి వచ్చే వారిని చేర్చుకునేది లేదని.. వచ్చినా టికెట్లు ఇచ్చేది లేదని చెప్పడం ద్వారా నారా లోకేష్ జాగ్రత్త పడ్డారా? లేక తొందర పడ్డారా? అనే చర్చ సాగుతోంది. ఎందుకంటే.. వచ్చేవారు కూడా ఇలాంటి వ్యాఖ్యలతో దూరమవుతారు. తమ దారి తాము చూసుకుంటారు. మరి ఏ వ్యూహంతో నారా లోకేష్ ఈ కామెంట్లు చేశారో చూడాలి.
This post was last modified on May 29, 2023 4:37 pm
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…