ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ కోసం తపిస్తున్న యువ నేతలు.. వైసీపీ కంటే కూడా.. టీడీపీలో ఎక్కువగా కనిపిస్తున్నారు. వీరిలో వారసులే ఎక్కువగా ఉన్నారు. గత ఎన్నికల్లో గుండుగుత్తగా చంద్రబాబు వారసులకు టికెట్లు ప్రకటించారు. అయితే.. అనుకున్న విధంగా వారసులు గట్టెక్క లేక పోయారు. ఒక్క ఆదిరెడ్డి భవానీ తప్ప.. మిగిలిన వారసులు అంతా ఓటమి బాటపట్టారు. ఇప్పటికే వీరంతా 30+లలోకి వెళ్లిపోయారు. కనీసం ఇప్పుడైనా గెలుపు గుర్రం ఎక్కితే తప్ప.. 30 ఏళ్లలోనే ఎమ్మెల్యే అయ్యారనే పేరు వస్తుంది.
లేకపోతే.. మరో ఐదేళ్లు ఆగిపోవాలి. దీంతో యువ నేతలు.. ఇప్పుడుచంద్రబాబు కోసం.. ఆయన అనుగ్ర హం కోసం తపిస్తున్నారు. అయితే..వైసీపీ ఈసారి.. సీనియర్లకే టికెట్లు ఇస్తుండడంతో గత ఎన్నికలలో చేసిన ప్రయోగాలు వికటించిన దరిమిలా.. చంద్రబాబు వారసులకు టికెట్లు ఇచ్చే విషయంపై అంతర్మ థనంలో పడ్డారనేది వాస్తవం. కానీ, వారసుల విషయం మాత్రం తరచుగా ఆయన చెవిలో పడుతూనే ఉంది. తాజాగా మహానాడులో మరోసారి యువరక్తం ప్రస్తావన వచ్చింది. దీంతో ఆయన 40 శాతం టికెట్లు వారికే ఇస్తామని ప్రకటించారు. కానీ, నిర్ణీత లెక్కలు మాత్రం వెల్లడించలేదు.
తాజాగా పరిటాల సునీత మరోసారి చంద్రబాబును మహానాడులో కలవడం.. ప్రాధాన్యం సంతరించుకుంది. అదేవిధంగా జేసీ బ్రదర్స్ కూడా.. వచ్చే ఎన్నికల్లో తమ వారసులనే మరోసారి నిలబెడతామని.. చంద్రబాబుకు తేల్చి చెప్పారు. అదేవిధంగా రాజాం నుంచి గ్రీష్మ.. శ్రీకాకుళం లోని పలాస వంటి నియోజకవర్గాలపైనా.. సందిగ్ధత నెలకొంది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో వీరి గ్రాఫ్ ఎలా ఉందనేది ఇప్పుడు మరోసారిచంద్రబాబు పరిశీలనకు తీసుకున్నారు.
యువ నేతలజోరుతో సంబంధం లేకుండా.. ప్రజలు ఏమనుకుంటున్నారు? అనేది ఇప్పుడు చంద్రబాబు ప్రధానంగా దృష్టి పెడుతున్న విషయం. చాలా నియోజకవర్గాల్లో వైసీపీ సీనియర్లను నిలబెడుతున్న విషయం తెలిసిందే. వారసులను కాదని.. సీనియర్లకే ప్రాధాన్యం ఇస్తోంది.దీనిని ప్రధానంగా దృష్టిలో పెట్టుకున్న చంద్రబాబు.. వారసుల ఆశలు ఫలించేలా నిర్ణయం తీసుకుంటారా? లేక.. ఏం చేస్తారు? అనేది ఆసక్తిగా మారింది. వారసులు మాత్రం ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్నారనేది వాస్తవం. మరి ఏం చేస్తారో చూడాలి. మహానాడు తర్వాత పరిణామాలు మారే అవకాశం ఉందని అంటున్నారు.
This post was last modified on May 29, 2023 1:24 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…