Political News

మోడీ ఇమేజ్ ను తమ ఖాతాలో వేసుకుంటున్న 11 రాష్ట్రాలు

రాజకీయాన్ని చదరంగంగా పోల్చేవారెందరో. ఇక్కడ ఎవరికి ఎవరి మీదా ప్రత్యేకమైన అభిమానాలు.. ప్రేమలు ఉండవు. అలా ఉన్నట్లు కనిపిస్తే.. అదంతా మాయనే. ఒకవిధంగా చెబితే.. అదే అసలుసిసలు రాజకీయంగా చెప్పాలి. రాజకీయాల్లో ఒకరి క్రెడిట్ ను మరొకరు తమ ఖాతాలో వేసుకోవటం మామూలే. కేంద్రం అమలు చేసే పథకాల్ని తమ ఖాతాలో వేసుకోవటం.. తరచూరాష్ట్రాలు చేసేవే. తాజాగా ఆ విషయం మీదన కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ కు కోపం వచ్చింది.

ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా చౌకధరలకే దేశంలోని పేదలకు అందించే బియ్యం.. గోధుమలకు సంబంధించి కేంద్రానికి రావాల్సిన పేరు రాకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. లబ్థిదారులకు రేషన్ సరుకులు ఇవ్వటంలో కేంద్రానిదే కీలక పాత్ర అని.. అందుకు అయ్యే ఖర్చులో 90 శాతం కేంద్రమే భరిస్తుందని ఆయన పేర్కొంటున్నారు. దేశం మొత్తమ్మీదా పది వేల కోట్లు కూడా ఖర్చుపెట్టని రాష్ట్రాలు.. తామే రేషన్ మొత్తాన్ని ఇస్తున్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నాయని ఆరోపిస్తున్నారు.

రేషన్ షాపుల ద్వారా ఇచ్చే బియ్యాన్నికేంద్రం కిలో రూ.2చొప్పున.. గోధుమలు రూ.3 చొప్పున అందజేస్తున్నారు. వీటిని ఆయా రాష్ట్రాలు తమకు తోచినట్లుగా కొందరు ఉచితంగా అందిస్తుంటే.. మరికొందరు నామమాత్రంగా వసూలు చేస్తున్న పరిస్థితి. రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. నెలసరిగా ఇచ్చే బియ్యాన్ని కేజీ రూపాయి చొప్పున వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే.. ఈ పథకానికి సంబంధించి సింహభాగం కేంద్రమే నిధుల్ని జారీ చేస్తుందని రాంవిలాస్ చెబుతున్నారు. కానీ.. కేంద్రానికి ఇవ్వాల్సిన క్రెడిట్ మాత్రం రాష్ట్రాలు ఇవ్వట్లేదంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా ఈ తరహా రాష్ట్రాలు పదకొండు ఉన్నాయని చెప్పిన ఆయన.. అందులో రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయని చెబుతున్నారు.

కేంద్రానికి రావాల్సిన పేరును రాష్ట్రాలు తమ ఖాతాలోకి మళ్లించుకోవటంపైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహాలో వ్యవహరించే రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలే ఉన్నట్లు వెల్లడించారు.

కేంద్రానికి వచ్చే పేరును తమ ఖాతాలో వేసుకునే పదకొండు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణ.. ఆంధ్రప్రదేశ్.. ఛత్తీస్ గఢ్.. జార్ఖండ్.. మధ్యప్రదేశ్.. ఒడిశా.. పశ్చిమబెంగాల్.. కేరళ.. తమిళనాడు.. కర్ణాటక.. త్రిపురలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. కేంద్రమంత్రి అసహనం నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు ఎలా స్పందిస్తాయో?

This post was last modified on August 12, 2020 6:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

2 hours ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

4 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

4 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

5 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

6 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

7 hours ago