Political News

టీడీపీని మీరే గెలిపించుకోవాల: బాల‌య్య

ఏపీలో సీఎం జగన్ పాలనపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాలనపై విమర్శనాస్త్రాలు సంధించారు. టీడీపీ మహానాడు, ఎన్టీఆర్ శతజయంతి వేడుకల సందర్భంగా రాజమహేంద్రవరాన్ని పసుపుమయం చేసిన పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. అనంత‌రం బాలకృష్ణ ఉద్వేగ భ‌రితంగా ప్రసంగిస్తూ.. ప్రజల వద్దకు పాలన తెచ్చిన ఘనత దివంగత ఎన్టీఆర్‌దేనని అన్నారు. ఆనాడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో బీసీలకు, మహిళలకు, తెలుగు భాషకు వన్నె తెచ్చారని గుర్తు చేశారు.

‘ఆనాడు ఇదే రాజమహేంద్రవరంలో తెలుగువారికి మొదటి కావ్యాన్ని అందించాలని నన్నయ ఆంధ్రభారత సంహిత రచనకు ఆద్యుడయ్యాడు. అటువంటి ప్రశస్తమైన ప్రాంగణంలో మహానాడు, ఎన్టీఆర్ శతజయంతిని జరుపుకోవటం ఎంతో సంతోషంగా ఉంది. ఎటు చూసినా పసుపు మయం చేసిన‌ కార్యకర్తలకు ధన్యవాదాలు. ప్రజల వద్దకు పాలన తెచ్చిన ఘనత ఎన్టీఆర్‌దే. చంద్రబాబు విజన్‌.. ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శమైంది. వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి. బాదుడే బాదుడు పేరుతో అన్ని వస్తువుల ధరలు పెంచారు. 3 రాజధానుల పేరుతో కాలం వెళ్లదీస్తున్నారు. జగన్ పాలనలో కొత్త పరిశ్రమలు రావడం లేదు. తెలుగువారి కలల రాజధాని అమరావతిని పక్కనపెట్టారు.” అని బాల‌య్య నిప్పులు చెరిగారు.

ఎన్టీఆర్‌.. ప్రజల గుండెల్లో శాశ్వతమైన స్థానాన్ని సంపాదించారని బాల‌కృష్ణ పేర్కొన్నారు. పాలనా పరంగా ఆయన ఎన్నో సాహసోపేతమైన పథకాలు ప్రవేశపెట్టారన్నారు. సినిమా పరంగా నటనలో ఎన్నో ప్రయోగాలు చేసిన ఘనత కూడా ఎన్టీఆర్ దేనని వివరించారు. తాను ఒక తెలుగువాడినని గర్వంగా చెప్పుకునేందుకు ధైర్యం ఇచ్చింది కూడా ఎన్టీఆరేనని బాలకృష్ణ గుర్తు చేశారు. ఎన్టీఆర్‌.. ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించి.. ఎందరికో రాజకీయ భిక్ష పెట్టారన్నారు.

ఎన్టీఆర్ గురించి ఎన్నిసార్లు మాట్లాడినా, ఎంత చెప్పిన తనివి తీరదని ఆయన వెల్లడించారు. చివరగా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నిజాయితీతో, క్రమశిక్షణతో తెలుగుదేశం పార్టీ ఎన్నో ఏళ్లుగా ముందుకు సాగుతుందని బాలకృష్ణ వెల్లడించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్య‌త ప్ర‌తి ఒక్క‌రిపైనా ఉంద‌ని.. చెప్పారు. దుష్ట సంహారానికి పురాణాల రోజుల్లో ఆయుధాలు దేవుడు దిగివ‌చ్చేవాడు. కానీ, ఇప్పుడు ఓటు అనే ఆయుధంతో మీరు విరుచుకుప‌డాలి. దుష్ట‌పాల‌న నుంచి మిమ్మ‌ల్ని మీరు ర‌క్షించుకోవాలంటే టీడీపీకి ఓటు వేయాలి.. అని బాల‌య్య పిలుపునిచ్చారు.

This post was last modified on May 29, 2023 11:40 am

Share
Show comments
Published by
Tharun

Recent Posts

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

9 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

10 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

11 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

12 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

12 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

14 hours ago