Political News

జ‌గ‌న్ ఇచ్చిన `10 ల‌క్ష‌ల  ప‌ట్టా` వెనుక చంద్ర‌బాబు ధైర్య‌మేనా?!

రెండు రోజుల కింద‌ట వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ అమ‌రావ‌తిలోని ఆర్ – 5 జోన్‌లో పేద‌ల‌కు ప‌ట్టాలు పంచారు. దాదాపు 1,486 ఎక‌రాల్లో నిర్మించిన 25 లే అవుట్ల‌లో ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల్లోని ల‌బ్ధిదారులైన పేద‌ల‌కు సీఎం జ‌గ‌న్ స్వ‌యంగా ప‌ట్టాలు అందించారు. అయితే..దీనిపై కోర్టు గ‌తంలోనే ఆంక్ష‌లు విధించింది. అమ‌రావ‌తి రాజ‌ధాని విష‌యంలో కోర్టులు ఇచ్చే తుది తీర్పున‌కు లోబ‌డి ఈ ప‌ట్టాలు చెల్లుబాటు అవుతాయ‌ని తెలిపింది. మ‌రోవైపు.. అమ‌రావ‌తి కోసం భూములు ఇచ్చిన రైతులు.. ఇలా తాము రాజ‌ధాని భూములు ఇస్తే.. ప‌ట్టాలు పంచేయ‌డం ఏంట‌ని ఆందోళ‌న‌లు చేప‌ట్టారు.

అయిన‌ప్ప‌టికీ.. సీఎం జ‌గ‌న్ అనుకున్న‌ది చేశారు. పేద‌ల‌కు ఎన్నిక‌ల స‌మయంలో తాము ఇచ్చిన హామీల‌మేర‌కు ఈ ప‌ట్టాలు పంచుతున్నామ‌ని చెప్పారు. అంతేకాదు.. ప‌ట్టాల పంపిణీ స‌మ‌యంలో ఆయ‌న ప్ర‌సంగిస్తూ.. ప్ర‌తి పేద కుటుంబానికి రూ.10 ల‌క్ష‌ల స్థిరాస్తిని తాము ఇస్తున్నామ‌ని.. ఇది ప‌ట్టాకాదు.. పేద‌ల ఆత్మ‌గౌర‌వ‌మ‌ని. గ‌తంలో చంద్ర‌బాబు ఎవ‌రికైనా సెంటు భూమి ఇచ్చారా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇక్క‌డ క‌ట్ చేస్తే.. సీఎం జ‌గ‌న్ వ్యాఖ్య‌లపై మేధావులు త‌మ మెద‌ళ్ల‌కు ప‌దునుపెట్టారు. గ‌తంలో ఈ భూముల‌కు ఉన్న విలువ ఎంత‌?  ఇప్పుడు సీఎం జ‌గ‌న్ రూ.10 ల‌క్ష‌లు అని చెబుతున్న దానికి అంత రేటు ఎందు కు.. ఎలా వ‌చ్చింది? అనే ప్ర‌శ్న‌ల‌ను తెర‌మీదికి తెచ్చారు.

వాస్త‌వానికి అమ‌రావ‌తి రాజ‌ధాని అనే పేరును క‌నుక ప‌క్క‌న పెడితే.. ఇప్పుడు జ‌గ‌న్ ఇచ్చిన భూములు ఎక్క‌డున్నాయంటే.. పిచ్చుక‌లలంక‌, న‌వులూరు, రాపూరు.. త‌దిత‌ర చిన్న చిన్న గ్రామాల్లో ఉన్నాయి. గ‌తంలో ఈ భూముల‌కు ఉన్న విలువ శూన్యం. కానీ, టీడీపీ అధినేత‌గా చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. అమ‌రావ‌తిని ప్ర‌క‌టించిన త‌ర్వాత‌.. ఇక్క‌డ అనేక సంస్థ‌లు, కార్యాల‌యాలు.. స‌చివాల‌యం, హైకోర్టు వంటివి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఇక్క‌డి భూముల‌కు ధ‌ర‌లు పెరిగాయి. ఇప్పుడు సెంటు ప్ర‌భుత్వం చెబుతున్న‌ట్టు రూ.8.50 ల‌క్ష‌ల‌కు చేరింది.

మిగిలిన నిర్మాణ ఖ‌ర్చుతో క‌లుపుకొంటే ప‌ది ల‌క్ష‌ల‌కు చేరింది. అంటే.. ఒక‌రకంగా.. ఇక్క‌డ పేద‌ల‌కు అందుతున్న‌రూ.10 ల‌క్ష‌ల రూపాయ‌ల సెంటు భూమి వెనుక కూడా చంద్ర‌బాబు క‌ష్టం.. ఆయ‌న దూర‌దృష్టి ఉన్నాయ‌నేక‌దా! అంటున్నారు మేధావులు. పైగా.. భ‌విష్య‌త్తులో ఇవి మ‌రిన్ని ల‌క్ష‌ల‌కు చేరుకుంటాయ‌ని కూడా సీఎం జ‌గ‌న్ చెబుతున్నారు. దీనిని కూడా ప్ర‌స్తావిస్తూ.. చంద్ర‌బాబు అధికారంలోకి వ‌స్తే త‌ప్ప‌.. ఇక్క‌డ ధ‌ర‌ల‌కు రెక్క‌లు రావ‌ని.. ఎందుకంటే.. అమ‌రావ‌తిని జ‌గ‌న్ వ‌దిలేశారు కాబ‌ట్టి.. ఇక్క‌డ ధ‌ర‌లు పెరిగే అవ‌కాశం లేద‌ని.. సెంటు భూమి రూ.25 ల‌క్ష‌ల‌కు చేరాలంటే.. ఖ‌చ్చితంగా చంద్ర‌బాబు వ‌స్తేనే అమ‌రావ‌తిని ప‌ట్టాలెక్కిస్తేనే సాధ్య‌మ‌వుతుంద‌ని అంటున్నారు. మొత్తంగా.. జ‌గ‌న్ ప‌ట్టాలిచ్చి.. త‌న పేరును ప్ర‌చారం చేసుకుంటున్నా.. దండ‌లో దారం మాదిరిగా చంద్ర‌బాబు కృషిని మేధావులు గుర్తు చేస్తున్నారు.

This post was last modified on May 28, 2023 9:52 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

31 minutes ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

39 minutes ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

3 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

3 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

5 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

5 hours ago