ఏపీలో 2024లో వచ్చే ఎన్నికలు తెలుగు దేశం పార్టీకి అత్యంత కీలకమనే విషయం తెలిసిందే. దీంతో పార్టీ అనేక రూపాల్లో పోరా టం చేస్తోంది. అయితే.. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో పనిచేస్తున్నా.. తమకు గుర్తింపులేదనే వారు ఉన్నారు. అదేసమయంలో ఇంచార్జ్లుగా ఉన్నవారు పనిచేయకపోయినా.. తమకే టికెట్లు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నవారు కూడా ఉన్నారు. మరోవైపు.. గత ఎన్నికల వరకు పార్టీలో ఉండి తర్వాత ఇతర పార్టీల గూటికి చేరిపోయినవారు.. మళ్లీ ఎన్నికల సమయానికి వచ్చేయాలనే ఆలోచనతో ఉన్నారు.
ఇవన్నీ ఇలా ఉంటే.. యువతకు ప్రాధాన్యం ఉంటుందా? టికెట్లు ఎప్పుడు ప్రకటిస్తారు? అనే ప్రశ్నలూ టీడీపీలో తరచుగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు ఈ ప్రశ్నలకు.. పార్టీలో తమ్ముళ్ల సందేహాలకు నారా లోకేష్ కుండబద్దలు కొట్టినట్టు సమాధానం చెప్పారు. అంశాల వారీగా ఆయన వెల్లడించిన విషయాలు.. పార్టీలోని ప్రతి ఒక్కరికీ వర్తిస్తాయని కూడా చెప్పారు. మరి అవేంటో తెలుసుకుంటే.. టీడీపీలో తమ్ముళ్ల పరిస్థితి ఏంటనేది తెలుస్తుంది.
నారా లోకేష్ ఏమన్నారంటే..
1) చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం ఇష్టం లేకపోతే వాళ్లకి గుర్తింపు లేదు.. ఇందులో నాకు కూడా మినహాయింపు లేదు.(ఇది ఓ ఎంపీ గురించి వ్యాఖ్యానించినట్టు పార్టీలో చర్చ సాగుతోంది) ఇంఛార్జ్లను నియమించినా పనిచేయని వారికి టిక్కెట్లు రావు. పార్టీ తరఫున స్వచ్ఛంద సేవ చేస్తామంటే ఎవరినైనా ప్రోత్సహిస్తాం.
2) నేను పని చేయను, ఇతరులూ చేయకూడదు అనే తత్వం సరికాదు. పని చేసేవారిని ఇన్ఛార్జ్లు ప్రోత్సహిస్తే సమష్టి కృషి అక్కడ ప్రతిబింబిస్తుంది. సేవా కార్యక్రమాలు చేసే వారు ఇన్ఛార్జ్కి సమాచారం ఇచ్చి వారి ఫోటో కూడా పెట్టి చేస్తే ఇబ్బంది లేదు, ఇన్ఛార్జ్ పెత్తనం చేస్తానంటే కుదరదు.
3) టిక్కెట్లు అనేవి నాయకుల సామర్ధ్యం బట్టి పార్టీ నిర్ణయిస్తుంది. ఇందులో లోకేశ్ అయినా.. వేరొకరైనా ఒక్కటే. సంక్షేమం అందుకుంటున్న నిరుపేదల కుటుంబాలు, తమ బిడ్డలకు ఉద్యోగ – ఉపాధి అవకాశాలు లభించాలంటే తెలుగుదేశం రావాలనే కోరుకుంటున్నారు.
4) టీడీపీలో సముచిత స్థానం, గౌరవం పొంది.. స్వార్థంతో పార్టీ వీడిన కొందరు ఇప్పుడు వస్తామన్నా పార్టీకి అవసరం లేదు. వారి స్థానంలో కొత్త తరం నాయకుల్ని తయారు చేసుకుంటాం.
5) రాయలసీమలో పాదయాత్ర పూర్తయ్యే నాటికి ఆ ప్రాంత అభివృద్ధికి రూట్ మ్యాప్ ప్రకటిస్తాం. తాగు, సాగునీటి వనరులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలపై రూట్ మ్యాప్ ప్రకటిస్తాం. యువగళం పాదయాత్రకు ఒక లక్ష్యం ఉంది. ఇది టైంపాస్ వ్యవహారం కాదు.
This post was last modified on May 28, 2023 12:26 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…