Political News

జ‌రిగేది కురుక్షేత్రం.. విశ్రాంతి వ‌ద్దు:  చంద్ర‌బాబు

రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో ప్రారంభ‌మైన మ‌హానాడులో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ప్ర‌ధానోప న్యాసం చేశారు.  వ‌చ్చే 2024 అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను ఆయ‌న కురుక్షేత్రంగా అభివ‌ర్ణించారు. వ‌చ్చేది కురుక్షే త్ర‌మ‌ని, ఆ ఎన్నిక‌ల్లో వైసీపీ కౌర‌వ సైన్యాన్ని త‌రిమి త‌రిమి కొట్టాల‌ని పిలుపునిచ్చారు. క్రీస్తు శకం మాదిరిగా ఎన్టీఆర్‌ శకం ప్రారంభమవుతుందని అన్నారు.  ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రిగినా .. టీడీపీ సిద్ధంగా ఉంద‌ని తెలిపారు. ఆదివారం ఎన్నిక‌ల తొలి మేనిఫెస్టోను ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పారు.

ప్ర‌స్తుతం రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా ఉంద‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. ఈ రాయి పేద లకు త‌గ‌ల‌కుండా టీడీపీ అడ్డు ప‌డుతుంద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌ను ముఖ్యంగా పేద‌వారిని, మ‌హిళ ల‌ను ఎలా ఆదుకోవాలో టీడీపీకి తెలుసున‌ని చెప్పారు. సంక్షేమానికి టీడీపీ జెండా.. అజెండా అని ఉద్ఘాటిం చారు. ఈసారి మహానాడుకు ఒక ప్రత్యేకత ఉందన్నారు.

ఎన్నో ‘మహానాడు’లను చూశాను. కానీ, ఇంతకుముందెప్పుడూ కనిపించని ఉత్సాహం ఇవాళ చూస్తున్నాను. ఎన్టీఆర్‌ శత జయంతిని ప్రపంచమంతా నిర్వహించుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా 100 ప్రదేశాల్లో ఏ నాయకుడికి జరగనంత గొప్పగా శతజయంతిని చేశాం. క్రీస్తు శకం మాదిరిగా ఎన్టీఆర్‌ శకం ప్రారంభమవుతుంది.. అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. ఆయన వారసత్వాన్ని భావితరాలకు అందించాల్సి ఉందని చెప్పారు.  

సంప‌ద సృష్టించి పేద‌ల‌కు పంచుతామ‌ని చెప్పారు. కానీ, జ‌గ‌న్ మ‌న‌స్త‌త్వం మాత్రం తాను ఒక్క‌డే తినాల‌నే ల‌క్ష‌ణం ఉన్నవాడ‌ని చంద్ర‌బాబు విమ‌ర్శించారు. ఈ నాలుగేళ్ల‌లో జ‌గ‌న్ చేసిన అవినీతి 2.27 ల‌క్ష‌ల కోట్లుగా ఉంద‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన జ‌గ‌న్ నుంచి దీనిని ఎలా కాపాడుకోవాల‌నే విష‌యంపై తాము దృష్టి పెట్టామ‌న్నారు. దేశంలోని అంద‌రు ముఖ్య‌మంత్రుల క‌న్నా కూడా జ‌గ‌న్ అత్యంత ధ‌న‌వంతుడ‌ని పేర్కొన్నారు.

Satya

Recent Posts

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

1 hour ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

1 hour ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

2 hours ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

4 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

4 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

4 hours ago