Political News

జ‌రిగేది కురుక్షేత్రం.. విశ్రాంతి వ‌ద్దు:  చంద్ర‌బాబు

రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో ప్రారంభ‌మైన మ‌హానాడులో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ప్ర‌ధానోప న్యాసం చేశారు.  వ‌చ్చే 2024 అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను ఆయ‌న కురుక్షేత్రంగా అభివ‌ర్ణించారు. వ‌చ్చేది కురుక్షే త్ర‌మ‌ని, ఆ ఎన్నిక‌ల్లో వైసీపీ కౌర‌వ సైన్యాన్ని త‌రిమి త‌రిమి కొట్టాల‌ని పిలుపునిచ్చారు. క్రీస్తు శకం మాదిరిగా ఎన్టీఆర్‌ శకం ప్రారంభమవుతుందని అన్నారు.  ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రిగినా .. టీడీపీ సిద్ధంగా ఉంద‌ని తెలిపారు. ఆదివారం ఎన్నిక‌ల తొలి మేనిఫెస్టోను ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పారు.

ప్ర‌స్తుతం రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా ఉంద‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. ఈ రాయి పేద లకు త‌గ‌ల‌కుండా టీడీపీ అడ్డు ప‌డుతుంద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌ను ముఖ్యంగా పేద‌వారిని, మ‌హిళ ల‌ను ఎలా ఆదుకోవాలో టీడీపీకి తెలుసున‌ని చెప్పారు. సంక్షేమానికి టీడీపీ జెండా.. అజెండా అని ఉద్ఘాటిం చారు. ఈసారి మహానాడుకు ఒక ప్రత్యేకత ఉందన్నారు.

ఎన్నో ‘మహానాడు’లను చూశాను. కానీ, ఇంతకుముందెప్పుడూ కనిపించని ఉత్సాహం ఇవాళ చూస్తున్నాను. ఎన్టీఆర్‌ శత జయంతిని ప్రపంచమంతా నిర్వహించుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా 100 ప్రదేశాల్లో ఏ నాయకుడికి జరగనంత గొప్పగా శతజయంతిని చేశాం. క్రీస్తు శకం మాదిరిగా ఎన్టీఆర్‌ శకం ప్రారంభమవుతుంది.. అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. ఆయన వారసత్వాన్ని భావితరాలకు అందించాల్సి ఉందని చెప్పారు.  

సంప‌ద సృష్టించి పేద‌ల‌కు పంచుతామ‌ని చెప్పారు. కానీ, జ‌గ‌న్ మ‌న‌స్త‌త్వం మాత్రం తాను ఒక్క‌డే తినాల‌నే ల‌క్ష‌ణం ఉన్నవాడ‌ని చంద్ర‌బాబు విమ‌ర్శించారు. ఈ నాలుగేళ్ల‌లో జ‌గ‌న్ చేసిన అవినీతి 2.27 ల‌క్ష‌ల కోట్లుగా ఉంద‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన జ‌గ‌న్ నుంచి దీనిని ఎలా కాపాడుకోవాల‌నే విష‌యంపై తాము దృష్టి పెట్టామ‌న్నారు. దేశంలోని అంద‌రు ముఖ్య‌మంత్రుల క‌న్నా కూడా జ‌గ‌న్ అత్యంత ధ‌న‌వంతుడ‌ని పేర్కొన్నారు.

This post was last modified on May 27, 2023 4:47 pm

Share

Recent Posts

ఎల్లమ్మ… దేవి vs ప్రసాద్

‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…

2 hours ago

సాయి రెడ్డి ‘యూపీ’ ఎజెండా ‘ఏపీ’లో పనిచేస్తుందా…?

వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

4 hours ago

బెత్లేహెమ్ కుటుంబం కనెక్ట్ అవుతుందా

మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…

5 hours ago

మ‌ళ్లీ కౌంటింగ్ చేపట్టాలి: ఓట‌మిపై కోర్టుకు స్టాలిన్‌

త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌.. మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ ఏడాది మార్చిలో జ‌రిగిన అసెంబ్లీ…

5 hours ago

అల్లరోడి వింటేజ్ కామెడీకి పెద్ద పరీక్ష

చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక.…

6 hours ago

రవితేజ అసలు భూమి మీద ఆగట్లేదుగా…

‘ఇరుముడి’ సక్సెస్ మీట్‌లో రవితేజ ఎంట్రీ చూసిన వాళ్లకు ఒక విషయం వెంటనే అర్థమైపోతుంది. నార్మల్ గా ఎప్పుడూ నవ్వుతూ,…

8 hours ago