Political News

జ‌రిగేది కురుక్షేత్రం.. విశ్రాంతి వ‌ద్దు:  చంద్ర‌బాబు

రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో ప్రారంభ‌మైన మ‌హానాడులో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ప్ర‌ధానోప న్యాసం చేశారు.  వ‌చ్చే 2024 అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను ఆయ‌న కురుక్షేత్రంగా అభివ‌ర్ణించారు. వ‌చ్చేది కురుక్షే త్ర‌మ‌ని, ఆ ఎన్నిక‌ల్లో వైసీపీ కౌర‌వ సైన్యాన్ని త‌రిమి త‌రిమి కొట్టాల‌ని పిలుపునిచ్చారు. క్రీస్తు శకం మాదిరిగా ఎన్టీఆర్‌ శకం ప్రారంభమవుతుందని అన్నారు.  ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రిగినా .. టీడీపీ సిద్ధంగా ఉంద‌ని తెలిపారు. ఆదివారం ఎన్నిక‌ల తొలి మేనిఫెస్టోను ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పారు.

ప్ర‌స్తుతం రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా ఉంద‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. ఈ రాయి పేద లకు త‌గ‌ల‌కుండా టీడీపీ అడ్డు ప‌డుతుంద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌ను ముఖ్యంగా పేద‌వారిని, మ‌హిళ ల‌ను ఎలా ఆదుకోవాలో టీడీపీకి తెలుసున‌ని చెప్పారు. సంక్షేమానికి టీడీపీ జెండా.. అజెండా అని ఉద్ఘాటిం చారు. ఈసారి మహానాడుకు ఒక ప్రత్యేకత ఉందన్నారు.

ఎన్నో ‘మహానాడు’లను చూశాను. కానీ, ఇంతకుముందెప్పుడూ కనిపించని ఉత్సాహం ఇవాళ చూస్తున్నాను. ఎన్టీఆర్‌ శత జయంతిని ప్రపంచమంతా నిర్వహించుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా 100 ప్రదేశాల్లో ఏ నాయకుడికి జరగనంత గొప్పగా శతజయంతిని చేశాం. క్రీస్తు శకం మాదిరిగా ఎన్టీఆర్‌ శకం ప్రారంభమవుతుంది.. అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. ఆయన వారసత్వాన్ని భావితరాలకు అందించాల్సి ఉందని చెప్పారు.  

సంప‌ద సృష్టించి పేద‌ల‌కు పంచుతామ‌ని చెప్పారు. కానీ, జ‌గ‌న్ మ‌న‌స్త‌త్వం మాత్రం తాను ఒక్క‌డే తినాల‌నే ల‌క్ష‌ణం ఉన్నవాడ‌ని చంద్ర‌బాబు విమ‌ర్శించారు. ఈ నాలుగేళ్ల‌లో జ‌గ‌న్ చేసిన అవినీతి 2.27 ల‌క్ష‌ల కోట్లుగా ఉంద‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన జ‌గ‌న్ నుంచి దీనిని ఎలా కాపాడుకోవాల‌నే విష‌యంపై తాము దృష్టి పెట్టామ‌న్నారు. దేశంలోని అంద‌రు ముఖ్య‌మంత్రుల క‌న్నా కూడా జ‌గ‌న్ అత్యంత ధ‌న‌వంతుడ‌ని పేర్కొన్నారు.

This post was last modified on May 27, 2023 4:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

2 hours ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

5 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

6 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

6 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

8 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

8 hours ago