ఏపీలో ఏం జరిగినా బెట్టింగు రాయళ్లు రంగంలోకి దిగుతున్నారు. కోడి పందేల నుంచి క్రికెట్ వరకు దేనినీ వారు వదిలి పెట్టడం లేదు. ఇలానే.. ఇప్పుడు సంచలనంగా మారిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ.. సీఎం జగన్కు తమ్ముడు వైఎస్ అవినాష్రెడ్డి వ్యవహారం కూడా .. బెట్టింగులకు దారి తీసింది. ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారా? చేయరా? అనేది తీవ్ర ఉత్కంఠకు దారితీసింది.
ఒకవైపు న్యాయస్థానాల్లో ముందస్తు బెయిల్ కోసం అవినాష్రెడ్డి పిటిషన్ చేయడం.. మరోవైపు సుప్రీం కోర్టు ఆయన అరెస్టును నిలువరించలేమని చెప్పడం.. సీబీఐ చేస్తున్న విచారణకు కితాబు లివ్వడం వంటి పరిణామాలు.. మరింతగా వేడి పెంచాయి. ఈ నేపథ్యంలో అవినాష్ అరెస్టుపై రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా.. పొరుగు రాష్ట్రాల్లోనూ.. ఆసక్తిని రేపుతోంది.ఈ క్రమంలో కొందరు ఆయన అరెస్టు అవుతారని… మరి కొందరు అవినాష్ అరెస్టు కారంటూ బెట్టింగులు వేస్తున్నట్టు సమాచారం.
కడప జిల్లా పులివెందులలో కూడా బెట్టింగులు జరుగుతున్నాయని సమాచారం. ఈ క్రమంలో డబ్బులు కూడా చేతులు మారే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఎంపీ అవినాష్ తండ్రి భాస్కరరెడ్డిని, ఆయనకు ముందు గజ్జల ఉదయ్ కుమార్రెడ్డిని సీబీఐ అరెస్టు చేసిన దరిమిలా.. ఇప్పుడు అవినాష్ వ్యవహారం చుట్టూనే కీలకచర్చ సాగుతుండడం గమనార్హం.
ఇక, సీబీఐ ఇప్పటికే నాలుగు సార్లు.. పలు దఫాలుగా అవినాష్రెడ్డిని విచారించింది. ఇటీవల రోజు వారీ విచారణ చేపడుతోంది. పైగా సాక్షి నుంచి నిందితుడు అని కూడా అవినాష్ను మార్చింది. ఈ క్రమంలో రోజు రోజుకు ఉచ్చు బిగుస్తోంది. దీంతో అవినాష్రెడ్డి అరెస్టు తప్పదనే చర్చ నడుస్తుండగా.. సీబీఐ మాత్రం చాలా ఆచి తూచి వ్యవహరిస్తుండడం గమనార్హం. మరి ఏం జరుగుతుందో తెలియదు కానీ.. బెట్టింగురాయుళ్లు మాత్రం అదిగో అరెస్టు.. ఇదిగో అరెస్టు అంటూ.. పందేలు కడుతుండడం గమనార్హం. కర్నూలులో గత నాలుగు రోజులుగా తీవ్ర ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పందేలకు మరింత డిమాండ్ పెరిగింది.
This post was last modified on May 27, 2023 10:05 am
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…