ఏపీలో ఏం జరిగినా బెట్టింగు రాయళ్లు రంగంలోకి దిగుతున్నారు. కోడి పందేల నుంచి క్రికెట్ వరకు దేనినీ వారు వదిలి పెట్టడం లేదు. ఇలానే.. ఇప్పుడు సంచలనంగా మారిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ.. సీఎం జగన్కు తమ్ముడు వైఎస్ అవినాష్రెడ్డి వ్యవహారం కూడా .. బెట్టింగులకు దారి తీసింది. ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారా? చేయరా? అనేది తీవ్ర ఉత్కంఠకు దారితీసింది.
ఒకవైపు న్యాయస్థానాల్లో ముందస్తు బెయిల్ కోసం అవినాష్రెడ్డి పిటిషన్ చేయడం.. మరోవైపు సుప్రీం కోర్టు ఆయన అరెస్టును నిలువరించలేమని చెప్పడం.. సీబీఐ చేస్తున్న విచారణకు కితాబు లివ్వడం వంటి పరిణామాలు.. మరింతగా వేడి పెంచాయి. ఈ నేపథ్యంలో అవినాష్ అరెస్టుపై రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా.. పొరుగు రాష్ట్రాల్లోనూ.. ఆసక్తిని రేపుతోంది.ఈ క్రమంలో కొందరు ఆయన అరెస్టు అవుతారని… మరి కొందరు అవినాష్ అరెస్టు కారంటూ బెట్టింగులు వేస్తున్నట్టు సమాచారం.
కడప జిల్లా పులివెందులలో కూడా బెట్టింగులు జరుగుతున్నాయని సమాచారం. ఈ క్రమంలో డబ్బులు కూడా చేతులు మారే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఎంపీ అవినాష్ తండ్రి భాస్కరరెడ్డిని, ఆయనకు ముందు గజ్జల ఉదయ్ కుమార్రెడ్డిని సీబీఐ అరెస్టు చేసిన దరిమిలా.. ఇప్పుడు అవినాష్ వ్యవహారం చుట్టూనే కీలకచర్చ సాగుతుండడం గమనార్హం.
ఇక, సీబీఐ ఇప్పటికే నాలుగు సార్లు.. పలు దఫాలుగా అవినాష్రెడ్డిని విచారించింది. ఇటీవల రోజు వారీ విచారణ చేపడుతోంది. పైగా సాక్షి నుంచి నిందితుడు అని కూడా అవినాష్ను మార్చింది. ఈ క్రమంలో రోజు రోజుకు ఉచ్చు బిగుస్తోంది. దీంతో అవినాష్రెడ్డి అరెస్టు తప్పదనే చర్చ నడుస్తుండగా.. సీబీఐ మాత్రం చాలా ఆచి తూచి వ్యవహరిస్తుండడం గమనార్హం. మరి ఏం జరుగుతుందో తెలియదు కానీ.. బెట్టింగురాయుళ్లు మాత్రం అదిగో అరెస్టు.. ఇదిగో అరెస్టు అంటూ.. పందేలు కడుతుండడం గమనార్హం. కర్నూలులో గత నాలుగు రోజులుగా తీవ్ర ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పందేలకు మరింత డిమాండ్ పెరిగింది.
This post was last modified on May 27, 2023 10:05 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…