వడ్డించే పన్నులు కావొచ్చు.. పెరిగే ధరలు కావొచ్చు. అంతకంతకూ పెరగటమే తప్పించి తగ్గటం ఎప్పుడైనా చూశామా? అంటే.. లేదనే చెబుతాం. అందుకు భిన్నంగా ఏపీలోని జగన్ సర్కారు అనూహ్య నిర్ణయాన్ని తీసుకోనుంది.
ఏపీలో మద్యం ధరల్ని భారీగా పెంచేస్తూ ఇటీవల నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఇరుగు పొరుగున ఉన్న తెలంగాణ.. తమిళనాడు..కర్ణాటక రాష్ట్రాలతో పోలిస్తే.. ఏపీలో మద్యం ధరలు భారీగా ఉండటమే కాదు.. ముట్టుకుంటే కాలిపోయేలా ధరల్ని సెట్ చేశారు.
అలా చేయటం ద్వారా మద్యాన్ని కొనుగోలు చేసే విషయంలో ఆసక్తి తగ్గి.. తమ లక్ష్యమైన పాక్షిక మద్ యనిషేధం దిశగా ప్రజల్ని సిద్ధం చేయాలని జగన్ సర్కారు భావించింది. అందుకు భిన్నంగా.. మద్యం ధరలు భారీగా పెరిగిపోవటంతో.. ఇటీవల కాలంలో శానిటైజర్లు తాగేసి చనిపోతున్న ఉదంతాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. చేతిలో డబ్బుల్లేక.. మద్యం ధరలు భారీగా ఉండటంతో చౌకగా లభించే శానిటైజర్లను సేవిస్తూ.. ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఉదంతాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో మద్యం ధరల్ని భారీగా తగ్గించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మద్యం ధరల్ని భారీగా తగ్గించాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లుగా సమాచారం. ఇప్పటికి ఉన్న ధరల్లో 45 శాతం మేర తగ్గించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మద్యం ధరల్ని భారీగా పెంచేస్తే.. మేలు జరుగుతుందన్న దానికి భిన్నంగా వరుస దారుణాలు చోటు చేసుకోవటం.. సరిహద్దురాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం సరఫరా కావటంతో పెంచిన ధరల్ని తగ్గించాలన్న ఆలోచనకు ఏపీలోని జగన్ సర్కారు నిర్ణయించినట్లుగా తెలిసింది.
This post was last modified on August 8, 2020 10:01 am
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…