Political News

అందరికీ షాకిచ్చిన సుప్రీంకోర్టు!

కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించాలన్న వాదనను విపక్షాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే అంశంపై ఆదేశాలు జారీ చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై దాఖలైన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు కొట్టేసింది.

తమ ముందుకు వచ్చిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు సుప్రీంకోర్టు నో చెప్పింది. జస్టిస్ జేకే మహేశ్వరి.. జస్లిస్ పీఎస్ నరసింహాలతో కూడిన ధర్మాసనం ఈ రోజు (శుక్రవారం) పరిశీలించింది. ఈ సందర్భంగా సుప్రీం బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేయటం వెనుకున్న ఉద్దేశం తమకు తెలుసని.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద దీని విచారణకు తాము నో చెబుతున్నట్లుగా పిటిషన్ దారు న్యాయవాది జయ సుకిన్ కు సుప్రీం బెంచ్ చెప్పింది.

కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనాన్ని ఆదివారం ప్రారంభించనున్న వేళ.. ఆ కార్యక్రమానికి రాష్ట్రపతిని ఆహ్వానించకపోవటం ద్వారా లోక్ సభ సెక్రటేరియట్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని పిటిషన్ దారు తన పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే.. ఈ వాదనను సుప్రీం పరిగణలోకి తీసుకోలేదు.

ఈ పరిణామం నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారం ఆదివారం కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభిస్తారు. అయితే.. ఈ కార్యక్రమానికి తాము హాజరు కామని 19ప్రతిపక్ష పార్టీలు నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఈ వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన వైఖరిని ఇప్పటివరకు వెల్లడించలేదు. ఇక.. ఏపీ ముఖ్యమంత్రి మాత్రం ఈ కార్యక్రమానికి హాజరు కానున్న విషయాన్ని వెల్లడించింది. మిగిలిన వారు హాజరు కావాలని పేర్కొనటం గమనార్హం.

This post was last modified on May 27, 2023 7:22 am

Share
Show comments
Published by
Tharun

Recent Posts

జగన్ ఫొటో వేయకపోతే ఇంత డ్యామేజ్ జరిగేదా?

ఫొటోల పిచ్చి అనండి.. ప్ర‌చార పిచ్చి అనండి.. ఏదేమైనా ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం చేజేతులా చేసుకున్న వ్య‌వ‌హారం ఇప్పుడు పీక‌ల…

54 mins ago

స్వయంభు కాచుకోవాల్సిన మూడు సవాళ్లు

నిఖిల్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న స్వయంభు షూటింగ్ వేగమందుకుంది. సుమరు ఎనిమిది కోట్ల బడ్జెట్…

1 hour ago

పీవీ రమేష్ ట్వీట్ తో భారీ డ్యామేజ్ ?!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల ప్ర‌చారం వాడి వేడిగా సాగుతున్న స‌మ‌యంలో గ‌త ఏడాది జ‌గ‌న్ స‌ర్కారు ప్ర‌వేశ‌పెట్టిన‌ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్…

3 hours ago

పెద్దిరెడ్డికి బుల్లెట్ దిగుద్ది: చంద్ర‌బాబు మాస్ వార్నింగ్‌

టీడీపీ అధినేత చంద్ర‌బాబు వైసీపీ కీల‌క నాయ‌కుడు, మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఆయ‌న బ‌రిలో ఉన్న…

5 hours ago

కూటమికి సంఘీభావం తెలుపుతూ జర్మనీలో ప్రవాసాంధ్రుల ర్యాలీ

మరో వారం రోజుల్లో (మే 13న) జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-భాజాపా కూటమికి సంఘీభావం తెలుపుతూ ఎన్నారై టీడీపీ…

7 hours ago

ఆర్ఆర్ఆర్‌పై ఆ ప్ర‌శ్నకు రాజ‌మౌళి అస‌హ‌నం

ఆర్ఆర్ఆర్ సినిమా అద్భుత విజ‌యం సాధించిన‌ప్ప‌టికీ.. ఆ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్‌తో పోలిస్తే జూనియ‌ర్ ఎన్టీఆర్ పాత్ర‌లో అంత బ‌లం…

9 hours ago