Political News

అందరికీ షాకిచ్చిన సుప్రీంకోర్టు!

కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించాలన్న వాదనను విపక్షాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే అంశంపై ఆదేశాలు జారీ చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై దాఖలైన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు కొట్టేసింది.

తమ ముందుకు వచ్చిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు సుప్రీంకోర్టు నో చెప్పింది. జస్టిస్ జేకే మహేశ్వరి.. జస్లిస్ పీఎస్ నరసింహాలతో కూడిన ధర్మాసనం ఈ రోజు (శుక్రవారం) పరిశీలించింది. ఈ సందర్భంగా సుప్రీం బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేయటం వెనుకున్న ఉద్దేశం తమకు తెలుసని.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద దీని విచారణకు తాము నో చెబుతున్నట్లుగా పిటిషన్ దారు న్యాయవాది జయ సుకిన్ కు సుప్రీం బెంచ్ చెప్పింది.

కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనాన్ని ఆదివారం ప్రారంభించనున్న వేళ.. ఆ కార్యక్రమానికి రాష్ట్రపతిని ఆహ్వానించకపోవటం ద్వారా లోక్ సభ సెక్రటేరియట్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని పిటిషన్ దారు తన పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే.. ఈ వాదనను సుప్రీం పరిగణలోకి తీసుకోలేదు.

ఈ పరిణామం నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారం ఆదివారం కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభిస్తారు. అయితే.. ఈ కార్యక్రమానికి తాము హాజరు కామని 19ప్రతిపక్ష పార్టీలు నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఈ వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన వైఖరిని ఇప్పటివరకు వెల్లడించలేదు. ఇక.. ఏపీ ముఖ్యమంత్రి మాత్రం ఈ కార్యక్రమానికి హాజరు కానున్న విషయాన్ని వెల్లడించింది. మిగిలిన వారు హాజరు కావాలని పేర్కొనటం గమనార్హం.

This post was last modified on May 27, 2023 7:22 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

2 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

2 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

2 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

3 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

5 hours ago

మెస్సీ వచ్చే… మంత్రి పదవి పాయె

దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…

6 hours ago