Political News

కేసీఆర్ మీద కోపం.. మోడీని ఇరికించిన తమిళ సై?

కాస్తంత తేడాగా ఉన్నప్పటికీ ఒకేలాంటి సీన్ ఇప్పుడు తెర మీదకు వచ్చింది. కొన్ని సందర్భాల్లో మాట్లాడటానికి మించిన పెద్ద తప్పు మరొకటి ఉండదు. తాము వినిపించే వాదనకు సారూప్యత ఉందన్న ఉద్దేశంతో నోటికి పని చెబితే కొత్త తలనొప్పి రావటం ఖాయం. ఇప్పుడు అలాంటి తీరునే ప్రదర్శించారు తెలంగాణ గవర్నర్ తమిళ సై.
కొత్త పార్లమెంటు భవనం మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న వేళ.. దాని ప్రారంభోత్సవాన్ని ప్రధాని మోడీ చేత కాకుండా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత ఓపెన్ చేయించాలన్న డిమాండ్ తో పాటు.. 19 రాజకీయ పార్టీలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయించటం తెలిసిందే.

రాష్ట్రపతి చేత కొత్త పార్లమెంటు భవనాన్ని ఓపెన్ చేయించాలన్న పిటిషన్ ఒకటి తాజాగా సుప్రీంకోర్టు దాఖలైంది కూడా. ఇలాంటి వేళ.. ఈ మధ్యనే తెలంగాణలో కొత్త సచివాలయాన్ని ప్రారంభించిన సమయంలో గవర్నర్ ను ఆహ్వానించకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవటం.. దానిపై గవర్నర్ తమిళ సై స్పందించటం తెలిసిందే. కొత్త సచివాలయానికి గవర్నర్ ను ఎందుకు ఆహ్వానించాలంటూ కేసీఆర్ సర్కారు నుంచి వచ్చిన సమాధానాన్ని తప్పు పడుతున్నారు గవర్నర్ తమిళ సై.

తాజాగా ఆమె మాట్లాడుతూ.. మొన్నీ మధ్యనే తెలంగాణలో కొత్తగా కట్టిన సచివాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. గవర్నర్ ను ఆహ్వానించలేదా? అని అందరూ ప్రశ్నించారు. ఆహ్వానించలేదని నిర్మొహమాటంగా అధికార పార్టీ నుంచి జవాబు వచ్చింది. నేరుగా వచ్చి పిలవకున్నా నాకు కనీసం ఆహ్వానం కూడా అందలేదు. రాష్ట్రపతిని రాజకీయేతర వ్యక్తంటున్న విపక్షాలు గవర్నర్ల విషయంలో మాత్రం ఎందుకు ఈ మాట అనటం లేదు’’అని తమిళ సై ప్రశ్నిస్తున్నారు.

ఆమె కోణంలో చూసినప్పుడు సరైన పాయింట్ గానే ఉంటుంది. కానీ.. గవర్నర్ ను గుర్తించాలన్న ఆమె మాటతో మోడీ సర్కారు ఇరుకున పడుతుందన్న విషయాన్ని ఆమె గుర్తించకపోవటం గమనార్హం. ప్రభుత్వం తనను గుర్తించాలన్న తపన తమిళ సైకి ఉన్నప్పుడు.. కేంద్రంలోని మోడీ సర్కారు పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతితో ప్రారంభించాలన్న వాదనకు మొగ్గు చూపినట్లే కదా? కేంద్రానికి అలాంటి ఆలోచన లేనప్పుడు.. తాజాగా తాము నియమించిన గవర్నర్ నోటి నుంచి వచ్చిన మాట తమను ఇరుకున పడేసినట్లుగా మోడీ సర్కారు భావిస్తుంది కదా? అంటున్నారు. తనను గుర్తించలేదన్న గవర్నర్ వాదన బాగానే ఉన్నా.. ఈ తొందరలో తాను మాట్లాడిన మాటలు కేంద్రంలోని మోడీ సర్కారుకు ఇబ్బందికరంగా ఉంటాయన్న విషయాన్ని ఆమె గుర్తిస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

This post was last modified on May 26, 2023 4:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

5 minutes ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

4 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

5 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

6 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

6 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

7 hours ago