ఏపీ సీఎం జగన్ సొంత జిల్లా కడప. ఇప్పటి వరకు వైసీపీకి తిరుగులేని జిల్లాగా పేరు తెచ్చుకుంది. అంతేకా దు.. కొన్నినియోజక వర్గాల్లో వైసీపీకి ప్రజలు బ్రహ్మరథం కూడా పట్టారు. అయితే.. అలాంటి జిల్లాపై ఇప్పుడు సీఎం జగన్కు అనుమానపు మేఘాలు ముసురుకున్నాయి. దీనికి కారణం.. టీడీపీ యువ నేత నారా లోకేష్ యువగళం ఇక్కడ ప్రారంభం కావడమే. ఇటీవల చంద్రబాబు సైతం ఇక్కడ పర్యటించారు.
ఇక, వైనాట్ పులివెందుల నినాదంతో పార్టీ నాయకులు కూడా దూసుకుపోతున్నారు. ప్రతి ఇంటినీ టచ్ చేస్తున్నారు. ఇదంతా టీడీపీలో సైలెంట్గా జరిగిపోతోంది. ఈ నేపథ్యంలో తమ కూసాలు బలంగా ఉన్నా యా? కదల బారుతున్నాయా? అని వైసీపీలో అనుమానం రేగింది. దీంతో కొన్నాళ్ల కిందటే ఇక్కడ ఐప్యాక్ సర్వేను రంగంలోకి దింపినట్టు సమాచారం. వీరు ముఖ్యంగా మూడు అంశాలపై దృష్టి పెట్టినట్టు సమాచారం.
ప్రస్తుత ఎమ్మెల్యేల పనితీరు: ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? వారు గడపగడపకు కార్యక్రమాన్ని ముందుకు తీసు కువెళ్తున్నారా? లేదా? ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? సంక్షేమ పథకాలు అందుతున్నవారు ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఎమ్మెల్యేలకు.. ప్రజలకు మధ్య అవినాభావ సంబంధం కొనసాగుతోందా? లేదా? అనే కీలక అంశాలపై దృష్టి పెట్టినట్టు సమాచారం.
వైఎస్ కుటుంబ నేతల పరిస్థితి: వైసీపీకి కడపలో కొన్ని కీలక నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో కమలాపురం ఒకటి. ఇక్కడ వైఎస్ కుటుంబ బంధువులే పోటీకి దిగే ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి వారి పరిస్థితి ఎలా ఉంటుంది? వారిలో ఎవరు విజయం దక్కించుకునే అవకాశం ఉంది? అనే కోణంలోనూ ఐప్యాక్ సర్వే సాగుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కమలాపురం(జగన్ సొంత మేనమామ రవీంద్రనాథ్రెడ్డి) నియోజకవర్గంలో రవీంద్రనాథ్ వరుసగా గెలుస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఆయన వారసుడిని రంగంలోకి దింపాలని భావిస్తున్నారు. అదేసమయంలో జగన్కు బాబాయిల వరసయ్యే మరికొందరు కూడా రంగంలో ఉన్నారు. దీంతో ఇక్కడ ఎవరికి ప్రజల మద్దతు లభిస్తోందనే అంశంపై సర్వే సాగుతోంది. మార్పుతప్పదనే: కొన్నాళ్లుగా కడపలో మార్పు తప్పదనే నియోజకవర్గాలు కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మెతక వైఖరి అవలంబిస్తున్న నాయకులు.. ప్రతిపక్షాలకు సరైన సమాధానం చెప్పకుండా నేతలకు చెక్ పెట్టాలని పార్టీ భావిస్తోంది. ఇలాంటి వాటిలో బద్వేల్ నియోజకవర్గం పేరు బాహాటంగా వినిపిస్తోంది.
ఇక్కడ నుంచి డాక్టర్ సుధ గత ఏడాది జరిగిన ఉప పోరులో విజయం దక్కించుకున్నారు. కానీ. విపక్షాలకు కౌంటర్ ఇవ్వలేక పోతున్నారు. దీంతో ఆమెను మార్చక తప్పదని అంటున్నారు. ఇలాంటి వాటిపై కూడా.. సర్వే సాగుతోంది. మరోవైపు యువగళం ఎఫెక్ట్పైనా.. చర్చసాగుతోంది. మర ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on May 26, 2023 2:52 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…