Political News

నిన్న జ‌గ‌న్‌.. ఈ రోజు చంద్ర‌బాబు.. ఒకే ప‌నిచేశారుగా!!

ఒకే ఒరలో రెండు క‌త్తులు ఇమ‌డ‌వ‌ని అంటారు. అలాగే.. ప‌ర‌స్ప‌ర విరుద్ధ‌మైన పార్టీల నేత‌ల అభిప్రాయాలు .. ల‌క్ష్యాలు కూడా క‌ల‌వ‌వు. ముఖ్యంగా ఏపీ వంటిరాష్ట్రంలో అధికార పార్టీ వైసీపీ ఒక‌టంటే.. ప్ర‌తిప‌క్షం టీడీపీ మ‌రొక‌టి అంటుంది. అలాంటి రెండు పార్టీలు కూడా ఒక విష‌యంలో క‌లిసిపోయాయి. ఇరు పార్టీలు కూడా ప్ర‌ధాని మోడీ విష‌యానికి వ‌చ్చేస‌రికి రెండు పార్టీలు కూడా.. జై కొట్టాయి.

అదే.. కొత్త పార్ల‌మెంటు భ‌వ‌నం ప్రారంభోత్స‌వానికి సంబంధించి అటు వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌.. ప్ర‌ధాని మోడీకి జై కొట్టిన మ‌రుస‌టి రోజే టీడీపీ అధినేత కూడా జేజేలు ప‌లికారు. దీంతో ఇరు పార్టీల వ్య‌వ‌హారం..చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తాజాగా ట్వీట్ చేశారు.

కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం చరిత్రాత్మకమైందని, చారిత్రాత్మక కట్టడాన్ని నిర్మించడంలో దోహదపడిన ప్రధాని మోడీకి, కేంద్రానికి అభినందనలు తెలుపుతున్నట్లు చంద్రబాబు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. చట్టాల రూపకల్పనకు పార్లమెంటు భవనం వేదిక కావాలని, 2047 నాటికి స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి పేదలు లేని దేశం కోసం కొత్త పార్లమెంట్ భవనం దిక్సూచి కావాలని చంద్రబాబు అన్నారు.

కేంద్ర ప్ర‌బుత్వ ఆహ్వానం మేరకు త‌మ పార్టీ ఎంపీల‌ను కార్య‌క్ర‌మానికిపంపిస్తున్న‌ట్టు తెలిపారు. అయితే.. పార్ల‌మెంటు భ‌వ‌నం ప్రారంభోత్స‌వం నాడు.. త‌మ పార్టీ(టీడీపీ) వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఎన్టీఆర్ జ‌యంతి ఉన్నందున తాను రాలేక పోతున్నాన‌ని కేంద్రానికి పంపిన లేఖ‌లో చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు.

This post was last modified on May 26, 2023 10:03 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

35 minutes ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

6 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

7 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago