Political News

నిన్న జ‌గ‌న్‌.. ఈ రోజు చంద్ర‌బాబు.. ఒకే ప‌నిచేశారుగా!!

ఒకే ఒరలో రెండు క‌త్తులు ఇమ‌డ‌వ‌ని అంటారు. అలాగే.. ప‌ర‌స్ప‌ర విరుద్ధ‌మైన పార్టీల నేత‌ల అభిప్రాయాలు .. ల‌క్ష్యాలు కూడా క‌ల‌వ‌వు. ముఖ్యంగా ఏపీ వంటిరాష్ట్రంలో అధికార పార్టీ వైసీపీ ఒక‌టంటే.. ప్ర‌తిప‌క్షం టీడీపీ మ‌రొక‌టి అంటుంది. అలాంటి రెండు పార్టీలు కూడా ఒక విష‌యంలో క‌లిసిపోయాయి. ఇరు పార్టీలు కూడా ప్ర‌ధాని మోడీ విష‌యానికి వ‌చ్చేస‌రికి రెండు పార్టీలు కూడా.. జై కొట్టాయి.

అదే.. కొత్త పార్ల‌మెంటు భ‌వ‌నం ప్రారంభోత్స‌వానికి సంబంధించి అటు వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌.. ప్ర‌ధాని మోడీకి జై కొట్టిన మ‌రుస‌టి రోజే టీడీపీ అధినేత కూడా జేజేలు ప‌లికారు. దీంతో ఇరు పార్టీల వ్య‌వ‌హారం..చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తాజాగా ట్వీట్ చేశారు.

కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం చరిత్రాత్మకమైందని, చారిత్రాత్మక కట్టడాన్ని నిర్మించడంలో దోహదపడిన ప్రధాని మోడీకి, కేంద్రానికి అభినందనలు తెలుపుతున్నట్లు చంద్రబాబు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. చట్టాల రూపకల్పనకు పార్లమెంటు భవనం వేదిక కావాలని, 2047 నాటికి స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి పేదలు లేని దేశం కోసం కొత్త పార్లమెంట్ భవనం దిక్సూచి కావాలని చంద్రబాబు అన్నారు.

కేంద్ర ప్ర‌బుత్వ ఆహ్వానం మేరకు త‌మ పార్టీ ఎంపీల‌ను కార్య‌క్ర‌మానికిపంపిస్తున్న‌ట్టు తెలిపారు. అయితే.. పార్ల‌మెంటు భ‌వ‌నం ప్రారంభోత్స‌వం నాడు.. త‌మ పార్టీ(టీడీపీ) వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఎన్టీఆర్ జ‌యంతి ఉన్నందున తాను రాలేక పోతున్నాన‌ని కేంద్రానికి పంపిన లేఖ‌లో చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు.

This post was last modified on May 26, 2023 10:03 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తారక్ ఫ్యాన్స్‌కు ఆ రోజు నిద్ర ఉండదు

మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…

36 minutes ago

‘పోకిరి’లో ఆ ట్రాక్ పూరి తీసేద్దామనుకుంటే..

టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…

2 hours ago

ఇక రాంబాబు రానట్టే

సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్‌లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే…

3 hours ago

వెంకీ మాట విన‌క‌పోవ‌డంతోనే ఆ ఫ్లాప్

తెలుగు సినీ చ‌రిత్ర‌లోనే అత్యంత హైప్ మ‌ధ్య విడుద‌లైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒక‌టి. 2001 సంక్రాంతికి మృగ‌రాజు, న‌ర‌సింహ‌నాయుడు లాంటి…

5 hours ago

మూకుమ్మడిగా మహేష్ సినిమాలను పిండుతున్నారు

రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…

7 hours ago

సోషల్ మీడియా వేరే ప్రపంచం కాదే

ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…

11 hours ago