లాక్ డౌన్ వేళ అనేక మంచి పనులు చేశారు మెగాస్టార్ చిరంజీవి. సినీ కార్మికులను ఆదుకునే కార్యక్రమాలు చేపట్టడంతో పాటు కరోనా మీద అవగాహన కల్పించేలా అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు ఆయన మరో మంచి పనికి శ్రీకారం చుట్టారు. కోవిడ్ చికిత్సలో అత్యంత కీలకంగా మారిన ప్లాస్మా దానంపై జనాల్లో అవగాహన పెంచే పనిలో పడ్డారు. ఇప్పటికే ఈ విషయమై వీడియోల ద్వారా జనాల్ని జాగృతం చేసే ప్రయత్నం చేశారు. తాజాగా ఆయన హైదరాబాద్లో ప్లాస్మా దాతల్ని సన్మానించారు. సైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కరోనాను జయించి కోవిడ్ పేషంట్లకు ప్లాస్మా దానం చేసిన 150 మందిని చిరంజీవి, సజ్జనార్ కలిసి సన్మానించడంతో పాటు ప్రెస్ మీట్ నిర్వహించి.. ప్లాస్మా దానంపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ మాట్లాడుతూ.. మధ్యలో దగ్గారు. దీంతో సమావేశంలో చిన్న అలజడి రేగింది. చిరంజీవి వెంటనే తమాయించుకుని.. తాను దగ్గుతున్నానని కంగారు పడాల్సిన పని లేదని.. తాను బాగానే ఉన్నానని అన్నారు.
ఈ రోజుల్లో మామూలుగా దగ్గు వచ్చి దగ్గడానికి కూడా భయపడాల్సి వస్తోందని చిరు అనడంతో అందరూ నవ్వారు. ప్లాస్మా.. కరోనా సోకిన వారికి సంజీవినిలా పనిచేస్తోందన్న చిరు.. కరోనాను జయించిన వారిలో మూడు నెలల పాటు యాంటీ బాడీస్ ఉంటాయని.. ప్లాస్మాలోని యాంటీ బాడీస్ 24 గంటల నుంచి 48 గంటల్లోపు తిరిగి వస్తాయని.. కరోనా జయించిన ఒక్కో వ్యక్తి 30 సార్లు ప్లాస్మా డొనేట్ చేయవచ్చని చెప్పారు.
థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి..…