Political News

ప్రెస్ మీట్లో చిరు ద‌గ్గారు.. ఆ త‌ర్వాత‌

లాక్ డౌన్ వేళ అనేక మంచి ప‌నులు చేశారు మెగాస్టార్ చిరంజీవి. సినీ కార్మికుల‌ను ఆదుకునే కార్య‌క్రమాలు చేప‌ట్ట‌డంతో పాటు క‌రోనా మీద అవ‌గాహ‌న క‌ల్పించేలా అనేక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. ఇప్పుడు ఆయ‌న మ‌రో మంచి ప‌నికి శ్రీకారం చుట్టారు. కోవిడ్ చికిత్స‌లో అత్యంత కీల‌కంగా మారిన ప్లాస్మా దానంపై జ‌నాల్లో అవ‌గాహ‌న పెంచే ప‌నిలో ప‌డ్డారు. ఇప్ప‌టికే ఈ విష‌య‌మై వీడియోల ద్వారా జ‌నాల్ని జాగృతం చేసే ప్ర‌య‌త్నం చేశారు. తాజాగా ఆయ‌న హైద‌రాబాద్‌లో ప్లాస్మా దాత‌ల్ని స‌న్మానించారు. సైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ స‌జ్జ‌నార్‌తో క‌లిసి ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

కరోనా‌ను జయించి కోవిడ్ పేషంట్లకు ప్లాస్మా దానం చేసిన 150 మందిని చిరంజీవి, సజ్జనార్ క‌లిసి స‌న్మానించ‌డంతో పాటు ప్రెస్ మీట్ నిర్వ‌హించి.. ప్లాస్మా దానంపై అవ‌గాహ‌న క‌ల్పించే ప్ర‌య‌త్నం చేశారు. ఈ సంద‌ర్భంగా చిరంజీవి మాట్లాడుతూ మాట్లాడుతూ.. మ‌ధ్య‌లో ద‌గ్గారు. దీంతో స‌మావేశంలో చిన్న అల‌జ‌డి రేగింది. చిరంజీవి వెంట‌నే త‌మాయించుకుని.. తాను ద‌గ్గుతున్నాన‌ని కంగారు ప‌డాల్సిన ప‌ని లేద‌ని.. తాను బాగానే ఉన్నాన‌ని అన్నారు.

ఈ రోజుల్లో మామూలుగా ద‌గ్గు వ‌చ్చి ద‌గ్గడానికి కూడా భ‌య‌ప‌డాల్సి వ‌స్తోంద‌ని చిరు అన‌డంతో అంద‌రూ న‌వ్వారు. ప్లాస్మా.. కరోనా సోకిన వారికి సంజీవినిలా పనిచేస్తోందన్న చిరు.. కరోనాను జయించిన వారిలో మూడు నెలల పాటు యాంటీ బాడీస్ ఉంటాయని.. ప్లాస్మాలోని యాంటీ బాడీస్ 24 గంటల నుంచి 48 గంటల్లోపు తిరిగి వస్తాయని.. కరోనా జయించిన ఒక్కో వ్యక్తి 30 సార్లు ప్లాస్మా డొనేట్ చేయవచ్చని చెప్పారు.

suman

Recent Posts

భాగ్యశ్రీ… ముచ్చటగా మూడో భాషలోకి

ఫలితాలతో సంబంధం లేకుండా అవకాశాలు అందుకునే కథానాయికలు చాలా కొద్ది మందే ఉంటారు. అందుకు వారి గ్లామర్, యాక్టింగ్ టాలెంట్‌తో…

56 minutes ago

నిర్మాతకు 15 కండిషన్లు పెట్టిన కొత్త హీరోయిన్

తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లు కనిపించడం అరుదు. కాస్త పేరున్న నిర్మాణ సంస్థల్లో తెరకెక్కే చిత్రాల్లో ఎక్కువగా పర భాషా…

1 hour ago

నవీన్ పొలిశెట్టి… 5500 కోట్ల ఫ్రేమ్

నవీన్ పొలిశెట్టి నటించిన గత కొన్ని చిత్రాల్లో తన పేరు వెనుక ‘స్టార్ ఎంటర్టైనర్’ అనే ట్యాగ్ పడుతున్న సంగతి…

2 hours ago

ఇదేం లాజిక్ ఎంపీ గారూ?

విజయవాడలో సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. సాయికృష్ణది లాకప్…

3 hours ago

ఒకే వేదికపై ముగ్గురు సీఎంలు!… కొత్త చరిత్రే!

దక్షిణ భారత దేశంలో గురువారం ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఒకే వేదికపై ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి కనిపించారు. అంతేకాదండోయ్…తాము…

3 hours ago

OG యూనివర్స్ ఏం చూపించబోతోంది

ఎన్నడూ లేనిది పవన్ కళ్యాణ్ ఓజి 2 విషయంలో దూకుడు చూపిస్తున్నారు. సురేందర్ రెడ్డికి కమిటైన ప్రాజెక్టు పక్కనపెట్టి మరీ…

4 hours ago