Political News

ఘోర ప్రమాదం… రెండు ముక్కలైన ఎయిరిండియా విమానం

కేరళలోని కోజికోడ్ లో శుక్రవారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దుబాయ్ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానం ల్యాండింగ్ సమయంలో రన్ వే పై స్కిడ్ అయ్యింది. ఈ ప్రమాదంలో విమానం ఏకంగా రెండు ముక్కలైపోయింది. ఈ ప్రమాదం విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లలో ఒకరు మరణించగా… విమానంలోని చాలా మంది తీవ్ర గాయాలపాలయ్యారు. వెనువెంటనే స్పందించిన కారిపూర్ ఎయిర్ పోర్టు సిబ్బంది హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడ్డ ప్రయాణికులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.

ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే… 184 మంది ప్రయాణికులతో ఎయిరిండియాకు చెందిన ఐఎక్స్-1344 విమానం దుబాయ్ నుంచి కోజికోడ్ కు బయలుదేరింది. శుక్రవారం రాత్రి సరిగ్గా 7.45 గంటలకు కోజికోడ్ లోని కారిపూర్ ఎయిర్ పోర్టుకు ఈ విమానం చేరింది. ప్రయాణమంతా సాఫీగా సాగిన నేపథ్యంలో విమానం ల్యాండ్ కాగానే… ప్రయాణికులంతా విమానం దిగేసి ఇళ్లకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. ఎయిర్ పోర్టు రన్ వే పైకి వచ్చిన విమానం ల్యాండింగ్ సమయంలో రన్ వేపై ఒక్కసారిగా స్కిడ్ అయ్యింది. ఊహించని ఈ పరిణామంతో విమానం ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. అంతేకాకుండా విమానం ఏకంగా రెండు ముక్కలుగా విడిపోయింది. మొత్తంగా ఈ ప్రమాదం భారీ ప్రమాదంగానే పరిగణించక తప్పదు.

ప్రమాద సమయంలో విమానంలో 184 మంది ప్రయాణికులతో పాటు ఆరుగురు సిబ్బందితో కలిసి మొత్తం 190 మంది ఉన్నట్లుగా ఎయిరిండియా తెలిపింది. ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది రెండు భాగాలుగా విడిపోయిన విమానంలో చిక్కుకుపోయిన క్షతగాత్రులను బయటకు తీసే పనిని మొదలుపెట్టారు. ఈ ప్రమాదంలో ఓ పైలట్ మృతి చెందారు. ప్రమాద తీవ్రత నేపథ్యంలో విమానంలోని చాలా మంది తీవ్రంగా గాయపడినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. విమాన శకలాల నుంచి ప్రయాణికులను బయటకు తీసిన సిబ్బంది వారిని ఆసుపత్రికి తరలించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

This post was last modified on August 7, 2020 9:37 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

53 minutes ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

1 hour ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

3 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

3 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

4 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

5 hours ago