యువగళం పాదయాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్.. అహరహం శ్రమిస్తున్నారు. యాత్ర సాగుతున్న తీరును నిరంతరం ఆయన సమీక్షించుకుంటు న్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి క్విక్గా తయారై.. వెంటనే సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎంత మంది వచ్చినా.. సెల్ఫీలు తీసుకుంటున్నా రు. అదేవిధంగా పాదయాత్ర జరుగుతున్న ప్రాంతంలో సమస్యలు తెలుసుకుంటున్నారు.
దీనిపై ప్రత్యేకంగా నోట్స్ కూడా రాసుకుంటున్నారు. పైకి కనిపించేవి కొన్ని ఉంటే.. కనిపించనవి ఈ యాత్రలో చాలానే ఉంటున్నా యి. కొన్ని సామాజిక వర్గాలకు నారా లోకేష్ ఇచ్చిన హామీలను తన డైరీలో ప్రత్యేకంగా ఆయన రాసుకుంటున్నారు. అదేవిధం గా యువతకు ఏటా జాబ్ క్యాలెండర్, మహిళలకు వ్యక్తిగత రుణాలు, వడ్డెర సామాజిక వర్గానికి ఎస్టీ హోదా.. వంటివాటిని మేనిఫెస్టోలో పెట్టేందుకు రెడీ అవుతున్నారు.
ఇక, సాయంత్రం పాదయాత్ర ముగించిన తర్వాత.. శిబిరానికిచేరుకుని.. అక్కడే ఉన్నా.. రెస్ట్ తీసుకోకుండా.. రోజంతా జరిగిన పాదయాత్ర వివరాలను రాసుకుంటున్నారు. వాటినే మీడియాకు పంపిస్తున్నారు. అదే సమయంలో పార్టీపరంగా యాక్టివ్గా ఉన్న నాయకులు ఎవరు.. ఎవరెవరు.. ఎంత సేపు యాత్రలో పాల్గొంటున్నారు. ప్రజలను ఎలా మొబిలైజ్ చేస్తున్నారు? వంటి అన్ని విషయాలను కూడా నారా లోకేష్ నమోదు చేసుకుంటున్నారు.
ఈ విషయంలో ఏ చిన్న తేడా వచ్చిందని భావించినా.. ఆయన శిబిరానికి పిలిచి నాయకులను ప్రశ్నిస్తు న్నట్టు సమాచారం. అంతేకాదు.. ఇప్పటి వరకు పాదయాత్ర నిర్వహించిన అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో వైసీపీ లోటు పాట్లు, ఎమ్మెల్యేల వ్యక్తిగత వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. తద్వారా.. వారికి దీటైన అభ్యర్థులకే వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున టికెట్లు ఇచ్చే అవకాశం ఉందనే అంచనాలు వస్తున్నాయి. సో.. ఎలా చూసుకున్నా.. యువగళం అంత ఆషామాషీగా అయితే.. నిర్వహించడం లేదని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on May 25, 2023 11:38 am
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…
సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…
నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…
భారత్ నుంచి పరారైపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి సంబంధించి రోజుకో కొత్త తరహా వింతలు, విశేషాలు వెలుగు…