Political News

యువ‌గ‌ళం ఆషామాషీ కాదు త‌మ్ముళ్లూ.. బీ కేర్‌ఫుల్‌!!

యువ‌గ‌ళం పాద‌యాత్ర‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌.. అహ‌ర‌హం శ్ర‌మిస్తున్నారు. యాత్ర సాగుతున్న తీరును నిరంత‌రం ఆయ‌న స‌మీక్షించుకుంటు న్నారు. ఉద‌యం లేచిన ద‌గ్గ‌ర నుంచి క్విక్‌గా త‌యారై.. వెంట‌నే సెల్ఫీ విత్ లోకేష్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. ఎంత మంది వ‌చ్చినా.. సెల్ఫీలు తీసుకుంటున్నా రు. అదేవిధంగా పాద‌యాత్ర జ‌రుగుతున్న ప్రాంతంలో స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్నారు.

దీనిపై ప్ర‌త్యేకంగా నోట్స్ కూడా రాసుకుంటున్నారు. పైకి క‌నిపించేవి కొన్ని ఉంటే.. క‌నిపించ‌నవి ఈ యాత్ర‌లో చాలానే ఉంటున్నా యి. కొన్ని సామాజిక వ‌ర్గాల‌కు నారా లోకేష్ ఇచ్చిన హామీల‌ను త‌న డైరీలో ప్ర‌త్యేకంగా ఆయ‌న రాసుకుంటున్నారు. అదేవిధం గా యువ‌త‌కు ఏటా జాబ్ క్యాలెండ‌ర్, మ‌హిళ‌ల‌కు వ్య‌క్తిగ‌త రుణాలు, వ‌డ్డెర సామాజిక వ‌ర్గానికి ఎస్టీ హోదా.. వంటివాటిని మేనిఫెస్టోలో పెట్టేందుకు రెడీ అవుతున్నారు.

ఇక‌, సాయంత్రం పాద‌యాత్ర ముగించిన త‌ర్వాత‌.. శిబిరానికిచేరుకుని.. అక్క‌డే ఉన్నా.. రెస్ట్ తీసుకోకుండా.. రోజంతా జ‌రిగిన పాద‌యాత్ర వివ‌రాల‌ను రాసుకుంటున్నారు. వాటినే మీడియాకు పంపిస్తున్నారు. అదే స‌మ‌యంలో పార్టీప‌రంగా యాక్టివ్‌గా ఉన్న నాయ‌కులు ఎవ‌రు.. ఎవ‌రెవ‌రు.. ఎంత సేపు యాత్ర‌లో పాల్గొంటున్నారు. ప్ర‌జ‌ల‌ను ఎలా మొబిలైజ్ చేస్తున్నారు? వంటి అన్ని విష‌యాల‌ను కూడా నారా లోకేష్ న‌మోదు చేసుకుంటున్నారు.

ఈ విష‌యంలో ఏ చిన్న తేడా వ‌చ్చింద‌ని భావించినా.. ఆయ‌న శిబిరానికి పిలిచి నాయ‌కుల‌ను ప్ర‌శ్నిస్తు న్నట్టు స‌మాచారం. అంతేకాదు.. ఇప్ప‌టి వర‌కు పాద‌యాత్ర నిర్వ‌హించిన అనంత‌పురం, చిత్తూరు, క‌ర్నూలు జిల్లాల్లో వైసీపీ లోటు పాట్లు, ఎమ్మెల్యేల వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను కూడా అడిగి తెలుసుకున్నారు. త‌ద్వారా.. వారికి దీటైన అభ్య‌ర్థుల‌కే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున టికెట్‌లు ఇచ్చే అవ‌కాశం ఉంద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. సో.. ఎలా చూసుకున్నా.. యువ‌గ‌ళం అంత ఆషామాషీగా అయితే.. నిర్వ‌హించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Satya

Recent Posts

శేఖ‌ర్ మాస్ట‌ర్ వెర్స‌స్ జానీ మాస్ట‌ర్

టాలీవుడ్ అగ్ర‌శ్రేణి డ్యాన్స్ మాస్ట‌ర్లు ఇద్ద‌రి మ‌ధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు…

2 hours ago

పృథ్విరాజ్ టార్గెట్ మిస్ అయ్యిందా

మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…

2 hours ago

‘మంగాపురం’లో ఏదో విషయం ఉంది

ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…

3 hours ago

వైసీపీ నేతలు రేవంత్ రెడ్డిని దూషించడమేంటి?

ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…

3 hours ago

కత్తి కొనల మీద ‘ప్యారడైజ్’ పరుగులు

టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…

4 hours ago

ఇంకెంతమంది భారతీయులు బలి కావాలి?

పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…

4 hours ago