రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను బంధులే ముంచేస్తాయేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తొందరలోనే దళితబంధు పథకాన్ని అమలుచేయాలని కేసీయార్ ఈమధ్యనే ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారు. ఆదేశాలిచ్చారు కానీ ఆచరణ ఎలాగో మాత్రం చెప్పలేదు. ఎందుకంటే దళితబంధు పథకం అమలుకు కనీసం రు. 20 వేల కోట్లు కావాలి. అంతడబ్బు ప్రభుత్వం దగ్గర లేదన్నది వాస్తవం. ఈ పథకాన్ని పక్కన పెట్టేస్తే బీసీ బంధు పథకం అమలుకు కూడా కేసీయార్ రెడీ అవుతున్నారు.
విచిత్రం ఏమిటంటే పథకాల అమలుకు తగినంత నిధులు ప్రభుత్వం దగ్గర లేకుండానే పథకాలను పక్కాగా అమలుచేసేయాలని కేసీయార్ ఆదేశాలిచ్చేస్తున్నారు. దళితబంధు పథకాన్ని అమలుచేసేందుకు 2022-23 ఆర్ధిక సంవత్సరంలోనే రెడీ అయ్యారు. అయితే ఒక్క లబ్దిదారుడికి కూడా పథకంలో డబ్బులు అందలేదు. కారణం ఏమిటంటే ప్రభుత్వం దగ్గర అవసరమైన రు. 17 వేల కోట్లు లేకపోవటమే. తర్వాత 2023-24 ఆర్ధిక సంవత్సరంలో కూడా దళితబంధుకు ప్రభుత్వం రు. 17500 కోట్లను కేటాయించినా ఇంతవరకు పథకం అమలుకాలేదు.
కారణం ఏమిటంటే సేమ్ డబ్బులు లేకపోవటమే. మరో ఆరు మాసాల్లో ఎన్నికలుండగా ఇలాంటి పథకాలను ప్రకటించటం ఎందుకు, అమలు విషయంలో గాలిమాటలు చెప్పటం ఎందుకు? నిజానికి హుజూరాబాద్ ఉపఎన్నికలోనే దళితబంధు పథకం ప్రకటించి కొంత హడావుడి చేశారు కేసీయార్. కొందరికి డబ్బులు ఇచ్చి, కొందరికి ఇవ్వక నానా గోలైంది. మొత్తానికి ఎవరూ బీఆర్ఎస్ కు ఓటేయకుండా బీజేపీ తరపున పోటీచేసిన ఈటల రాజేందర్ ను గెలిపించారు.
ఈటల గెలుపుతో మండిపోయిన కేసీయార్ తర్వాత పథకం అమలుపై పెద్దగా శ్రద్ధపెట్టలేదు. అయితే మళ్ళీ ఎన్నికలు వస్తున్న నేపధ్యంలోనే దళితబంధని, బీసీబంధని హడావుడి మొదలుపెట్టారు. దళితబంధుకే డబ్బులు లేకపోతే ఇక బీసీబంధు కూడా ఏ విధంగా అమలుచేయగలరు ? దళితబంధులో ప్రతి లబ్దిదారుడికి రు. 10 లక్షలయితే బీసీబంధులో లబ్దిదారుడికి లక్ష రూపాయలు. ఇక్కడే బీసీ సంఘాల నుండి నిరసన వ్యక్తమవుతోంది. దళితులకు రు. 10 లక్షలిచ్చి తమకు మాత్రం లక్ష రూపాయలే ఏందని గోలచేస్తున్నారు. తమకు కూడా రు. 10 లక్షలు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ఈ బంధులే కేసీయార్ ను ముంచేసేట్లుగా ఉన్నాయి చూస్తుంటే.
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…