ఏపీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి పురంధేశ్వరి ఉరఫ్ చిన్నమ్మ.. సంచలన ఆరోపణలు చేశారు. ఏపీలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. అరాచక, విధ్వంస పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. ఊబిలోకి నెట్టేసినట్లు.. రాష్ట్రం ఆర్ధిక సంక్షోభంలో ఉందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని కూడా అర్హులైన లబ్ధిదారునికి అందించకుండా.. వచ్చే నిధులను దారి మళ్లించే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంత దీనావస్థలో ఉందంటే.. చివరికి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఒకటవ తారీఖున జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉంది. ఇది ఎంతో బాధాకరమైన విషయం. ప్రజలందరూ ఈ పరిస్థితిపై ఆలోచించాలి. ఉద్యోగస్తులందరూ ఈ జీతం మీదే ఆధారపడి తీసుకున్న వస్తువులపై బ్యాంకుల వద్దకు వెళ్లి.. ఈఏంఐ మీద కాస్త వెసులుబాటు కల్పించాలని ప్రాధేయపడే స్థితిలో ఉన్నారు అని పురందేశ్వరి వ్యాఖ్యానించారు.
గ్రామాలకు 15 ఆర్థిక కమిటీ కింద కేంద్రం నేరుగా ఇస్తున్న సహకారాన్ని సైతం రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని పురందేశ్వరి ఆరోపించారు. వైసీపీని సమర్థించే సర్పంచులు సైతం.. ఇవ్వాళ బయటకొచ్చి సోషల్ మీడియాలో, ప్రెస్లలో తమ వనరుల్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోందని గోడు వెళ్లబోసుకుంటున్నారని చెప్పారు. ఈ లెక్కన.. మన రాష్ట్రం ఎంత దీనావస్థలో ఉందో ఒఖసారి ప్రజలు గమనించాలన్నారు.
పోనీ.. దారి మళ్లించిన నిధులతో ఎక్కడైనా అభివృద్ధి చేశారా అంటే, అదీ లేదని మండిపడ్డారు. రాష్ట్రంలోని రోడ్లన్నీ గుంతల మయంగా తయారయ్యాయని, ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదని పేర్కొన్నారు. ఉద్యోగాలు లేక రాయలసీమ బిడ్డలు వలసపోతున్నారని పురందేశ్వరి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించుకోవడం ద్వారానే ఈ పరిస్థితి నుంచి బయట పడేందుకు అవకాశం ఉందని పురందేశ్వరి పిలుపునిచ్చారు. ప్రస్తుతం తమ ఓటు బ్యాంకు పెరిగిందన్నారు.
This post was last modified on May 25, 2023 6:43 am
డీలిమిటేషన్, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులు లోక్ సభలో వీగిపోయిన నేపథ్యంలో ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. ఆ విశ్లేషణలన్నింటిలో ఒకటి మాత్రం…
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు.. తమపై చేస్తున్న యుద్ధం నేపథ్యంలో కీలకమైన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన విషయం తెలిసిందే. ఈ…
దేశమంతా ఆసక్తిగా ఎదురు చూసిన నియోజకవర్గాల పునర్విభజన, మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లకు ఉద్దేశించిన బిల్లులకు పార్లమెంటులో చుక్కెదురైంది. డీలిమిటేషన్, మహిళా బిల్లులకు ఆమోదం…
మతపరంగా రిజర్వేషన్లను కల్పించేది లేదని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పార్లమెంటులో తెగేసి చెప్పారు. మహిళా బిల్లు…
సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ కొత్త మూవీ సంబరాల ఏటిగట్టు ఇప్పటిదాకా విడుదల తేదీ ఖరారు చేసుకోలేదు. ఫిలిం…
మలయాళ హీరో టొవినో థామస్ ఈ మధ్య తెలుగు మీడియాలో బాగానే నానాడు. జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ అవకాశాన్ని వదులుకున్నానని,…