Modi
ఒకటి కాదు..రెండు కాదు.. ఏకంగా 19 పార్టీలు.. ప్రధాని మోడీపై నిప్పులు చెరిగాయి. “మేం వచ్చేది లేదు.. ఏం చేసుకుంటారో చేసుకోండి. ప్రజాస్వామ్యం మీ మూతి మీద మీసమా.. అలానే తిప్పుకోండి!” అంటూ తీవ్ర వ్యాఖ్యాలు చేశాయి. దీనికికారణం.. పార్లమెంటు నూతన భవనాన్ని రాజ్యాంగ అధినేతగా రాష్ట్రపతి కాకుండా ప్రధానమంత్రి ప్రారంభించడానికి రెడీ కావడమే.
దాదాపు 200 కోట్ల రూపాయల ఖర్చుతో ఢిల్లీలో ‘సెంట్రల్ విస్టా’ పేరుతో కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో తొలి దశ ప్రధాన నిర్మాణాన్ని మోడీ చేతుల మీదుగా ఈ నెల 28న ప్రారంభించనున్నారు. అయితే.. రాజ్యాంగ వేదిక అయిన.. పార్లమెంటును రాజ్యాంగ పరిరక్షణ కర్త అయిన.. రాష్ట్రపతి ప్రారంభించాలి కానీ.. ఇలా ప్రధాని ప్రారంభించడం ఏంటనేది.. విపక్ష నాయకుల విమర్శ.
ఈ క్రమంలోనే అనేక తర్జన భర్జనల అనంతరం.. కాంగ్రెస్, డీఎంకే, ఆప్, శివసేన(యూబీటీ), సమాజ్వాదీ పార్టీ, సీపీఐ, జేఎంఎం, కేరళ కాంగ్రెస్(మణి), వీసీకే(విడుతలై చిరుతైగల్ కట్చి), ఆర్ఎల్డీ, టీఎంసీ, జేడీ(యూ), ఎన్సీపీ, సీపీఎం, ఆర్జేడీ, ఐయూఎంఎల్, నేషనల్ కాన్ఫరెన్స్, ఆర్ఎస్పీ, ఎండీఎంకే వంటి 19 పార్టీలు ఈ ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాయి. ఆయా పార్టీలకు ఇప్పటికే పార్లమెంటు స్పీకర్ నుంచి ఆహ్వానాలు అందిన విషయం తెలిసిందే.
‘పార్లమెంట్ కొత్త భవనాన్ని రాష్ట్రపతితో కాకుండా ప్రధాని మోడీ ప్రారంభించనుండటం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే. ఈ తీరు రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించడం కిందికే వస్తుంది. ఈ అప్రజాస్వామిక చర్యలు ప్రధాని మోడీకి కొత్తేం కాదు. పార్లమెంట్లో విపక్ష నేతలు భారత ప్రజల సమస్యలను లేవనెత్తి నప్పుడు వారిపై అనర్హత వేటు వేశారు. సస్పెండ్ చేశారు. వారి మాటలను మ్యూట్ చేశారు. పార్లమెంట్ నుంచి ప్రజాస్వామ్య స్ఫూర్తిని పక్కన పెట్టినప్పుడు.. ఇక కొత్త భవనంలో మాకు ఏ విలువా కనిపించడం లేదు’ అని విపక్ష పార్టీలు తమ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశాయి.
This post was last modified on May 24, 2023 5:19 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…
ఏపీకి పొరుగునే ఉన్న తమిళనాడులో ఇప్పుడు ఇదే తరహా రాజకీయాలు కూడా కనిపిస్తున్నాయి. పార్టీలు లెక్కకు మిక్కిలిగా ఉన్నా.. నాయకులు…