Political News

ముందడుగు- కొత్త జిల్లాల కోసం కమిటీ

ఏపీ లో కొత్త జిల్లా ఏర్పాటుకు ముందడుగు పడింది. 25 జిల్లాల ఏర్పాటుకు కమిటీ ఏర్పాటైంది. అధ్యయనం కోసం ఏర్పాటైన ఈ కమిటీ కొత్త జిల్లాల ఏర్పాటులో ఎదురయ్యే ఆటంకాలు, పరిష్కరాలు, రాజకీయ సామాజిక పరిస్థితులను కూలంకుషంగా పరిశీలించనుంది.

ఈ అధ్యయన కమిటీలో ఆరుగురు సభ్యులున్నారు. సీఎస్ నీలం సాహ్ని అధ్యక్షత వహిస్తారు. సభ్యులుగా సీసీఎల్ఏ కమిషనర్, జీఏడీ కార్యదర్శి, ప్రణాళికశాఖ కార్యదర్శి, సీఎంవో అధికారి, ప్రిన్సిపల్ ఫైన్సాన్స్ సెక్రటరీ ఉంటారు. వనరుల విభజనలో సమతూకం కోసం ఆరుగురు ఆరు వేర్వేరు శాఖల నుంచి ప్రాతినిధ్యం ఉండేలా చూస్తున్నారు. ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ కమిటీ కన్వీనర్ గా వ్యవహరిస్తారు.

మూడు నెలల్లోపు కమిటీ నివేదిక ఇవ్వాలని నిర్దిష్ట గడువు విధించారు. కమిటీ ఏర్పాటుపై చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు.

ఒక్కో లోక్ సభ నియోజకవర్గం యూనిట్ గా జిల్లాలు ఏర్పాటు చేస్తామని వైఎస్ జగన్ ముందు నుంచి చెబుతున్నారు. ఏపీలో మొత్తం 25 జిల్లాలు లేదా అంతకంటే ఎక్కువ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అయితే విశాఖలోని అరకు లోక్ సభ నియోజకవర్గాన్ని మాత్రం రెండు జిల్లాలు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ఉంది. విస్తీర్ణం రీత్యా ఇది పెద్దది. మొత్తం నాలుగు జిల్లాల్లో ఇది విస్తరించింది. అరకు ఎంపీ నియోజకవర్గంలోని పాలకొండ శ్రీకాకుళం జిల్లాలో, సాలూరు, కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాలు విజయనగరం జిల్లాలో ఉన్నాయి. అరకు, పాడేరు విశాఖపట్నం జిల్లాలో కొనసాగుతుండగా, రంపచోడవరం మాత్రం తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఉంది. మొత్తం గిరిజన జనాభాయే. అందుకే దీనిపై ఒక సందిగ్దత నెలకొంది.

This post was last modified on August 7, 2020 7:24 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

తమ్ముడు పవన్ కు దారిచ్చిన అన్న బాలయ్య

ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…

21 minutes ago

కృతి శెట్టిని వెంటాడుతున్న వాయిదాలు

ఉప్పెనతో టాలీవుడ్ లో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగ్ రాయ్ లాంటి…

1 hour ago

ఆ ఆస్తులపై షర్మిలకు హక్కు లేదా?

రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్ఠను చెల్లి దెబ్బతీయాలని ప్రయత్నించిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ కంపెనీ అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌…

1 hour ago

వాహ్ డీసీఎం.. మధ్యాహ్నం అడిగితే సాయంత్రానికి ఆర్డర్స్

ప్రపంచకప్ గెలిచిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన దీపిక, తమ గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి…

4 hours ago

తమ్ముళ్ళూ… బాబు గారి రెండో వైపు చూసి తట్టుకోగలరా?

ఏపీ సీఎం చంద్ర‌బాబును ఆ పార్టీ నాయ‌కులు ఒకే కోణంలో చూస్తున్నారా?  బాబుకు రెండో కోణం కూడా ఉంద‌న్న విష‌యాన్ని…

5 hours ago

పెమ్మ‌సానికి కీల‌క బాధ్య‌త‌.. భారీ హోంవ‌ర్క్‌.. !

గుంటూరు ఎంపీ అదే విధంగా కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మ‌సాని చంద్రశేఖరకు సీఎం చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. రెండు…

6 hours ago