Political News

ముందడుగు- కొత్త జిల్లాల కోసం కమిటీ

ఏపీ లో కొత్త జిల్లా ఏర్పాటుకు ముందడుగు పడింది. 25 జిల్లాల ఏర్పాటుకు కమిటీ ఏర్పాటైంది. అధ్యయనం కోసం ఏర్పాటైన ఈ కమిటీ కొత్త జిల్లాల ఏర్పాటులో ఎదురయ్యే ఆటంకాలు, పరిష్కరాలు, రాజకీయ సామాజిక పరిస్థితులను కూలంకుషంగా పరిశీలించనుంది.

ఈ అధ్యయన కమిటీలో ఆరుగురు సభ్యులున్నారు. సీఎస్ నీలం సాహ్ని అధ్యక్షత వహిస్తారు. సభ్యులుగా సీసీఎల్ఏ కమిషనర్, జీఏడీ కార్యదర్శి, ప్రణాళికశాఖ కార్యదర్శి, సీఎంవో అధికారి, ప్రిన్సిపల్ ఫైన్సాన్స్ సెక్రటరీ ఉంటారు. వనరుల విభజనలో సమతూకం కోసం ఆరుగురు ఆరు వేర్వేరు శాఖల నుంచి ప్రాతినిధ్యం ఉండేలా చూస్తున్నారు. ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ కమిటీ కన్వీనర్ గా వ్యవహరిస్తారు.

మూడు నెలల్లోపు కమిటీ నివేదిక ఇవ్వాలని నిర్దిష్ట గడువు విధించారు. కమిటీ ఏర్పాటుపై చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు.

ఒక్కో లోక్ సభ నియోజకవర్గం యూనిట్ గా జిల్లాలు ఏర్పాటు చేస్తామని వైఎస్ జగన్ ముందు నుంచి చెబుతున్నారు. ఏపీలో మొత్తం 25 జిల్లాలు లేదా అంతకంటే ఎక్కువ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అయితే విశాఖలోని అరకు లోక్ సభ నియోజకవర్గాన్ని మాత్రం రెండు జిల్లాలు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ఉంది. విస్తీర్ణం రీత్యా ఇది పెద్దది. మొత్తం నాలుగు జిల్లాల్లో ఇది విస్తరించింది. అరకు ఎంపీ నియోజకవర్గంలోని పాలకొండ శ్రీకాకుళం జిల్లాలో, సాలూరు, కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాలు విజయనగరం జిల్లాలో ఉన్నాయి. అరకు, పాడేరు విశాఖపట్నం జిల్లాలో కొనసాగుతుండగా, రంపచోడవరం మాత్రం తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఉంది. మొత్తం గిరిజన జనాభాయే. అందుకే దీనిపై ఒక సందిగ్దత నెలకొంది.

This post was last modified on August 7, 2020 7:24 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

33 minutes ago

మెగా మాస్ ఈజ్ బ్యాక్

మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…

41 minutes ago

ఆ ప్రచారంపై మండిపడ్డ కోమటిరెడ్డి

తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…

2 hours ago

అమరావతిపై మాట్లాడే నైతిక హక్కు ఉందా జగన్!

ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…

2 hours ago

నాగ్ ఓకే అనడమే ఆలస్యం

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…

3 hours ago

ప్రభాస్ సరదాలు ఓవర్… ఇక సమరమే!

ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…

3 hours ago