Political News

ముందడుగు- కొత్త జిల్లాల కోసం కమిటీ

ఏపీ లో కొత్త జిల్లా ఏర్పాటుకు ముందడుగు పడింది. 25 జిల్లాల ఏర్పాటుకు కమిటీ ఏర్పాటైంది. అధ్యయనం కోసం ఏర్పాటైన ఈ కమిటీ కొత్త జిల్లాల ఏర్పాటులో ఎదురయ్యే ఆటంకాలు, పరిష్కరాలు, రాజకీయ సామాజిక పరిస్థితులను కూలంకుషంగా పరిశీలించనుంది.

ఈ అధ్యయన కమిటీలో ఆరుగురు సభ్యులున్నారు. సీఎస్ నీలం సాహ్ని అధ్యక్షత వహిస్తారు. సభ్యులుగా సీసీఎల్ఏ కమిషనర్, జీఏడీ కార్యదర్శి, ప్రణాళికశాఖ కార్యదర్శి, సీఎంవో అధికారి, ప్రిన్సిపల్ ఫైన్సాన్స్ సెక్రటరీ ఉంటారు. వనరుల విభజనలో సమతూకం కోసం ఆరుగురు ఆరు వేర్వేరు శాఖల నుంచి ప్రాతినిధ్యం ఉండేలా చూస్తున్నారు. ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ కమిటీ కన్వీనర్ గా వ్యవహరిస్తారు.

మూడు నెలల్లోపు కమిటీ నివేదిక ఇవ్వాలని నిర్దిష్ట గడువు విధించారు. కమిటీ ఏర్పాటుపై చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు.

ఒక్కో లోక్ సభ నియోజకవర్గం యూనిట్ గా జిల్లాలు ఏర్పాటు చేస్తామని వైఎస్ జగన్ ముందు నుంచి చెబుతున్నారు. ఏపీలో మొత్తం 25 జిల్లాలు లేదా అంతకంటే ఎక్కువ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అయితే విశాఖలోని అరకు లోక్ సభ నియోజకవర్గాన్ని మాత్రం రెండు జిల్లాలు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ఉంది. విస్తీర్ణం రీత్యా ఇది పెద్దది. మొత్తం నాలుగు జిల్లాల్లో ఇది విస్తరించింది. అరకు ఎంపీ నియోజకవర్గంలోని పాలకొండ శ్రీకాకుళం జిల్లాలో, సాలూరు, కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాలు విజయనగరం జిల్లాలో ఉన్నాయి. అరకు, పాడేరు విశాఖపట్నం జిల్లాలో కొనసాగుతుండగా, రంపచోడవరం మాత్రం తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఉంది. మొత్తం గిరిజన జనాభాయే. అందుకే దీనిపై ఒక సందిగ్దత నెలకొంది.

This post was last modified on August 7, 2020 7:24 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

రాజమౌళి, మహేష్ కొట్టుకోవడమేంటయ్యా

దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…

13 minutes ago

మున్నా మంచి స్ట్రాటజీ వాడుతున్నాడు

మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని…

30 minutes ago

ఇలాంటిది వేరే మతంలో జరిగి ఉంటే?: పవన్

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై…

4 hours ago

చరణ్‌పై మచ్చ పడనివ్వని అల్లు శిరీష్

మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…

5 hours ago

టీమిండియా సెమీస్ చేరాలంటే ఏం జరగాలి?

జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ గెలుపు తర్వాత భారత్ సెమీస్ అవకాశాలు ఇప్పుడు పక్కా లెక్కల మీద ఆధారపడి ఉన్నాయి. నెట్…

6 hours ago

దురంధర్ టీమ్ భలే స్ట్రోక్ ఇచ్చింది

ప్రాణానికి ప్రాణం అనేది పాత సామెత. స్ట్రోకుకు స్ట్రోకు కొత్త ట్రెండ్. ఇటీవలే ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కు చెందిన…

6 hours ago