Political News

తెలంగాణ కాంగ్రెస్ – గట్టి ప్లానింగే !

ఈనెల 26వ తేదీన తెలంగాణా కాంగ్రెస్ సీనియర్ నేతలందరినీ అధిష్టానం పిలిపించింది. అందరినీ ఢిల్లీకి రమ్మని ఆదేశించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధి, ప్రియాంకగాంధి తదితరులు తెలంగాణా నేతలతో భేటీ అవటానికే రమ్మని ఆదేశించారు. తొందరలో జరగబోతున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు, దిశానిర్దేశం చేసేందుకే కీలకమైన భేటీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ మధ్యనే జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

కర్నాటక ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించిన విధానాలను, అనుసరించిన వ్యూహాలను వివరించి అదే ఫార్ములాను తెలంగాణాలో కూడా అమలుచేసేట్లుగా సీనియర్ నేతలను ఆదేశించబోతున్నట్లు సమాచారం. కర్నాటక ఫార్ములా అంటే నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకురావటం, అభ్యర్ధుల ఎంపిక విషయంలో ఎలాంటి వివాదాలకు తావులేకుండా చూసుకోవటం, ప్రచారం విషయంలో అందరు కలిసికట్టుగా ఉండటం, ఎన్నికల కోసం ఖర్చుచేసే నిధులను చివరిదాకా అందేట్లు చూడటం, అధికార పార్టీ చేసిన తప్పులను నూరుశాతం జనాలకు అర్ధమయ్యేట్లు వివరించి చెప్పటం.

అలాగే పార్టీ ప్రచారాన్ని, హామీలను జనాలందరికీ చేరేట్లుగా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నది కీలకం. చివరగా సోషల్ మీడియాను సమర్ధవంతంగా ఉపయోగించుకోవటం కూడా చాలా కీలకమన్న విషయాన్ని అధిష్టానం గుర్తించింది. గతంలో జరిగిన ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో సోషల్ మీడియాను కర్నాటకలో ఉపయోగించుకున్నంతగా ప్రభావవంతంగా ఉపయోగించుకోలేదు. అందుకనే రేపటి తెలంగాణా ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రచారాన్ని ఎంత వీలైతే అంత ఎక్కువగా ఉపయోగించుకోవాలని అధిష్టానం స్పష్టం చేయబోతోందని సమాచారం.

అయితే కర్నాటకలో సీనియర్లు ఏకతాటిపైన నడిచినట్లు తెలంగాణాలో సాధ్యమేనా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని దింపేసి ఆ పదవిలో కూర్చోవాలని చాలామంది సీనియర్లు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి, భట్టి విక్రమార్క లాంటి వాళ్ళతో రేవంత్ కు ఏమాత్రం పడటంలేదు. మరి సీనియర్ల మధ్య వివాదాలను ఏ విధంగా పరిష్కరిస్తుందనేది ఆసక్తిగా మారింది. తాజాగా కోమటిరెడ్డి మాట్లాడుతు కాంగ్రెస్ కు 80 సీట్లు ఖాయమని జోస్యం చెప్పారు. చెప్పటమేనా దాన్ని సాధించే మార్గముందా అన్నదే కీలకం.

This post was last modified on May 24, 2023 11:47 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

2 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

2 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

2 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

3 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

5 hours ago

మెస్సీ వచ్చే… మంత్రి పదవి పాయె

దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…

6 hours ago