Political News

వైసీపీలోకి ప్రభాకర్ రెడ్డి…కానీ షరతు!

బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 మార్చి విక్రయించిన కేసులో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న జలాధర కంపెనీ మేనేజర్ నాగేశ్వర్ రెడ్డితో పాటు మరో ఇద్దరిని పోలీసులు కూడా పోలీసులు దాదాపు రెండు నెలల క్రితం అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలు తాజాగా బెయిల్ పై విడుదలయ్యారు.

ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఓ పనిచేస్తే తాను వైసీపీ కండువా కప్పుకునేందుకు రెడీ అని అన్నారు. అయితే, తాను వైసీపీలో చేరేందుకు కొన్ని షరతులు పెట్టారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తే తాను వైసీపీలో చేరడానికి సిద్ధమని జేసీ ప్రభాకర్ రెడ్డి షరతు పెట్టారు.

అనంతపురం ఫైర్ బ్రాండ్ బ్రదర్స్ లో ఒకరైన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి బెయిల్ పై విడుదలైన తర్వాత మీడియాతో మాట్లాడారు. రాజధానిని అమరావతిలో కొనసాగిస్తానని జగన్ ప్రకటిస్తే తాను వైసీపీలో చేరతానని సంచలన ప్రకటన చేశారు. తనను రాజకీయాల నుంచి తప్పుకోమన్నా అలాగే చేస్తానని, తన నిర్ణయంలో మార్పు ఉండదని అన్నారు. అమరావతి కోసం రైతులంతా కొన్ని నెలలుగా పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జేసీ ఆరోపించారు.

ఎన్టీఆర్ హయాంలో 11 రోజులు, జగన్ పాలనలో 54 రోజులు జైలులో ఉన్నానని అన్నారు. తాను ఎటువంటి అవకతవకలకు పాల్పడలేదని, కావాలనే తనను ఈ కేసులో ఇరికించారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. కాగా, రాజధాని అమరావతిలోనే ఉంచితే తమ పదవులు వదిలేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇపుడు అదే బాటలో జేసీ కూడా వెళ్లడం విశేషం.

Share
Show comments
Published by
Satya

Recent Posts

హహ హాసిని… స్టేజ్ మీద ఏడ్చేసింది

జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…

1 hour ago

మీ వాళ్లకు చెప్పండి… ఏపీ సీఎంకి తెలంగాణ మంత్రి లేఖ

తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…

2 hours ago

మోదీ స్కిన్ టోన్… అక్కడ తెలుపు.. ఇక్కడ నలుపా?

ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్‌పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…

2 hours ago

టీవీ సౌండ్ హఠాత్తుగా ఆగిపోయిందే

మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…

3 hours ago

ఎన్టీఆర్ నీల్… ఇంకో ఏడాది ఆలస్యంగా

అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…

3 hours ago

కొత్త ‘మహావతారం’పై విమర్శలేల?

గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…

5 hours ago