అప్పు చేసి పప్పు కూడు తినరా.. ఓ నరుడా! అన్న సూత్రం ఏపీకి బాగానే వర్తిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023-24) ప్రారంభమై.. కేవలం నెలన్నరే అయింది(ఏప్రిల్-మే15). అయితే.. ఈనెలన్నర కాలంలో ఏపీ ప్రభుత్వం ఏకంగా 13,500 కోట్ల రూపాయలను అప్పుగా తెచ్చింది. తాజాగా దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆర్బీఐ మరో రెండు వేల కోట్ల రూపాయల అప్పు ఇచ్చింది. మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా ప్రభుత్వం రూ. రెండు వేల కోట్ల రుణం తెచ్చింది.
ఇక, తాజాగా తెచ్చిన అప్పునకు వడ్డీ ఠారెత్తి పోతోంది. రూ.వెయ్యి కోట్లు 11 సంవత్సరాలకు 7.36 శాతం వడ్డీ, మరో వెయ్యి కోట్లు 15 సంవత్సరాలకు 7.30 శాతం వడ్డీకి రుణం తీసుకుంది. దీంతో ఇప్పటి వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఇచ్చిన ఎఫ్ఆర్బీఎం పరిమితిలో జగన్ ప్రభుత్వం రూ.13 వేల 500 కోట్లు అప్పు చేసినట్టు అయింది. ఇంకా మిగిలింది రూ. 17 వేల 500 కోట్లే… ఈ లోపు ఆర్ధికలోటు కింద ఏపీ ప్రభుత్వానికి కేంద్రం రూ. 10 వేల కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసింది.
2014-2019 వరకూ టీడీపీ ప్రభుత్వం ఆర్ధికలోటు విడుదల చేయాలన్నా అవసరం లేదని కేంద్రం పిడివాదన వినిపించింది. తాజాగా రెవెన్యూ లోటు కింద నిధులు విడుదల చేయడంతో అప్పుడు మాట్లాడిన బీజేపీ నేతలపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
This post was last modified on May 24, 2023 8:43 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…