అప్పు చేసి పప్పు కూడు తినరా.. ఓ నరుడా! అన్న సూత్రం ఏపీకి బాగానే వర్తిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023-24) ప్రారంభమై.. కేవలం నెలన్నరే అయింది(ఏప్రిల్-మే15). అయితే.. ఈనెలన్నర కాలంలో ఏపీ ప్రభుత్వం ఏకంగా 13,500 కోట్ల రూపాయలను అప్పుగా తెచ్చింది. తాజాగా దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆర్బీఐ మరో రెండు వేల కోట్ల రూపాయల అప్పు ఇచ్చింది. మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా ప్రభుత్వం రూ. రెండు వేల కోట్ల రుణం తెచ్చింది.
ఇక, తాజాగా తెచ్చిన అప్పునకు వడ్డీ ఠారెత్తి పోతోంది. రూ.వెయ్యి కోట్లు 11 సంవత్సరాలకు 7.36 శాతం వడ్డీ, మరో వెయ్యి కోట్లు 15 సంవత్సరాలకు 7.30 శాతం వడ్డీకి రుణం తీసుకుంది. దీంతో ఇప్పటి వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఇచ్చిన ఎఫ్ఆర్బీఎం పరిమితిలో జగన్ ప్రభుత్వం రూ.13 వేల 500 కోట్లు అప్పు చేసినట్టు అయింది. ఇంకా మిగిలింది రూ. 17 వేల 500 కోట్లే… ఈ లోపు ఆర్ధికలోటు కింద ఏపీ ప్రభుత్వానికి కేంద్రం రూ. 10 వేల కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసింది.
2014-2019 వరకూ టీడీపీ ప్రభుత్వం ఆర్ధికలోటు విడుదల చేయాలన్నా అవసరం లేదని కేంద్రం పిడివాదన వినిపించింది. తాజాగా రెవెన్యూ లోటు కింద నిధులు విడుదల చేయడంతో అప్పుడు మాట్లాడిన బీజేపీ నేతలపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
This post was last modified on May 24, 2023 8:43 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…