వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో చక్రం తిప్పాలని భావిస్తున్న తెలంగాణ అధికార పార్టీ బీ(టీ)ఆర్ ఎస్ గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని.. కేంద్రంలో వచ్చేది కేసీఆర్ సర్కారేనని ఆ పార్టీ ప్రముఖులు తరచు గా చెబుతుంటారు. అయితే.. అసలు బీఆర్ ఎస్ పార్టీ దేశంలో ఎంతమందికి పరిచయం అయింది? అనే ది ఇప్పుడు ఆసక్తిగా మారింది. దేశంలో తాజాగా ఎన్డీటీవీ–లోక్నీతి–సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్(సీఎస్డీఎస్) సంయుక్తంగా ‘ప్రజాభిప్రాయం’ పేరుతో నిర్వహించిన సర్వేలో బీఆర్ ఎస్పై ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.
మొత్తంగా 19 రాష్ట్రాల్లోని 71 నియోజకవర్గాల్లో.. 7,202 మందితో నిర్వహించిన ఈ సర్వే.. మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, ఒడిసా, పశ్చిమ బెంగాల్, పంజాబ్, యూపీ వంటి కీలకమైన రాష్ట్రాలు కూడా ఉన్నాయి. వీటిలో 70 శాతం మంది ప్రజలు తమకు బీఆర్ ఎస్ అంటే తెలియదని సమాధానం చెప్పారు.అదేమైనా స్వచ్ఛంద సంస్థా? అని ప్రశ్నించిన వారు కూడా ఉన్నారని సర్వేలో చెప్పడం గమనార్హం. దీనిని బట్టి కేంద్రంలో చక్రం తిప్పాలని భావిస్తున్న బీఆర్ ఎస్ పరిస్థితి రాష్ట్ర సరిహద్దులు దాటటం లేదనే వాదన బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో దీనికి ఈ సర్వే దన్నుగా మారింది.
ఇక, దక్షిణాది నుంచి కేసీఆర్ను ప్రధానిగా కోరుతున్న వారు 0.2శాతం మంది కూడా లేక పోవడం.. ఆయన తెలంగాణ నాయకుడే అని తీర్మానం చేయడం ఈ సర్వేలో స్పష్టంగా తెలిసింది. పార్టీ గురించి తెలియద ని చాలా మంది ప్రజలు చెప్పగా.. కేసీఆర్ గురించి మాత్రం 40 శాతం మంది ప్రజలు తెలుసునని వ్యాఖ్యా నించారు. అయితే.. ఆయనను ప్రధానిగా అంగీకరిస్తారా? అంటే.. లేదని ముక్తకంఠంతో చెప్పుకొచ్చారు. ఆయనను ఒక రాష్ట్ర నాయకుడిగానే చూస్తున్నవారు 70 నుంచి 75 శాతం వరకు ఉన్నారు. మరి దీనిని బట్టి.. బీఆర్ ఎస్ కేంద్రంలో ఏమేరకు చక్రం తిప్పుతుందో చూడాలి.
This post was last modified on May 24, 2023 11:54 am
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…