వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు లేకపోయినా.. తెలుగు దేశం పార్టీ సునాయాసంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని మేధావులు అంచనా వేస్తున్నారు. ఎన్నికలకు సమయం చేరువ అవడంతో ఏ పార్టీ విజయం దక్కించుకుంటుంది..? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ప్రస్తుతం ఉన్న అంచనాలు ఏంటి? అనేవి చర్చకు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధానంగా ప్రతిపక్షం టీడీపీ పుంజుకుందనే వాదన బలంగా వినిపిస్తోంది.
గత ఎన్నికలను పరిశీలిస్తే.. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ఆయన నాయకులను కాదు.. తనను చూసి ఓట్లు వేయాలని.. తనను చూసి గెలిపించాలని పిలుపునిచ్చారు. అయితే.. అప్పట్లో ప్రజలు ఈ మాటలను వినిపించుకోలేదు. దీనికి కూడా కారణం ఉంది. స్థానికంగా నాయకుల పై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో టీడీపీ నేతలను ఓడించారనే చర్చ అప్పట్లో జోరుగా సాగింది.
అయితే.. ఇప్పుడు పరిస్థితి మారిందని అంటున్నారు మేధావులు. వచ్చే ఎన్నికల్లో నాయకులు కాకుండా.. పార్టీ అధినేతల చుట్టూ.. రాజకీయాలు.. ఓట్లు తిరిగేలా.. ప్రస్తుతం రాజకీయ పరిణామాలు మారాయని అంటున్నారు మేధావులు. వైసీపీ కూడా ఇదే కోరుకుంటుందా.. లేదా? అనేది పక్కన పెడితే.. ఈ సారి వైసీపీ నాయకులపై ఆధారపడింది. మీరే గెలిపించాలి.. అని సీఎం జగన్ పదే పదే తన నాయకులకు పిలుపునిస్తున్నారు.
దీంతో క్షేత్రస్థాయిలో అనుకూల పరిస్థితి ఉంటే.. వైసీపీ విజయం దక్కించుకునేందుకు అవకాశం ఉంటుంది. టీడీపీ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. చంద్రబాబు నాయుడు 75 ఏళ్ల వయసులోనూ.. ప్రజల మధ్య తిరుగుతున్నారు. దీంతో వ్యక్తిగతంగా చంద్రబాబు ఇమేజ్ భారీగా పెరిగింది. అంతేకాదు.. ఆయన వల్లే రాష్ట్రం డెవలప్ అవుతుందనే మౌత్ పబ్లిసిటీ ఎక్కువగా జరుగుతోందని మేదావులు అంటున్నారు. దీంతో పొత్తులు లేకపోయినా.. ఆయన గెలుపు ఖాయమని అంటున్నారు.
This post was last modified on May 23, 2023 4:36 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…