Political News

ఆ నలుగురికి తలంటిన అధిష్టానం

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు మరో ఏడాది లోపే జరుగుతున్న వేళ బీజేపీ అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నలుగురి వల్ల వస్తున్న అనర్థాలను అరికట్టే చర్యలు చేపట్టింది. ఎక్కడా నోరు మెదపవద్దని, పార్టీ లైన్ ను మాత్రమే ప్రచారం చేసేందుకు వారి సేవలను వినియోగించాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. దానితో వాళ్లు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.

నిజానికి వైసీపీ పాలనా వైఫల్యాల పై గాకుండా టీడీపీ పై విమర్శలు చేయడం రాష్ట్ర బీజేపీలో కొంతమంది నేతలకు అలవాటైంది. పోలవరం నిర్మాణం జరగకపోయినా, అమరావతి ఆగిపోయినా పట్టించుకోని బీజేపీ నేతలకు సాక్షాత్తు హోమ్‌మంత్రి అమిత్‌ షా తిరుపతిలో తలంటారు. దీంతో అమరావతి రైతుల పాదయాత్రకు హడావుడిగా వెళ్లి మద్దతు పలికారు. అమరావతిలో ఆర్‌-5 జోన్ ఏర్పాటు చేసి బయటవారికి పట్టాలు ఇస్తున్నా… బీజేపీ నేతలు నోరు మెదపకపోవడం పై రాజధాని రైతులు ఆగ్రహంగా ఉన్నారు. ఈలోపు పవన్‌ కళ్యాణ్‌ ఢిల్లీ వెళ్లి కేంద్ర బీజేపీ నేతలు, మంత్రి మురళీధరన్ , శివప్రకాష్‌ జీ , బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో భవిష్యత్తులో తన పార్టీ వైఖరి , ఎన్నికల సందర్బంగా తాను వ్యవహరించే విధానం పై స్పష్టంగా చెప్పివచ్చారు. పనిలో పనిగా రాష్ట్రంలో బీజేపీ నేతలు వ్యవహారశైలి వాళ్లు ఇస్తున్న స్టేట్‌మెంట్ లను అక్కడ వివరించారు..

పవన్ ఫిర్యాదులపై బీజేపీ అధిష్టానం సీరియస్ గా దృష్టి పెట్టింది. ఓ నలుగురు నేతల ఓవరాక్షన్ తో ఏపీలో పార్టీ పూర్తిగా దెబ్బతింటోందని గుర్తించింది. వారిని ఢిల్లీ పిలిపించి .. పార్టీని ఎందుకు అభాసుపాలు చేస్తున్నారని ప్రశ్నించింది. ఇకపై మౌనంగా ఉండాలని దిశా నిర్దేశం చేసింది. పొత్తుల వ్యవహారం వారి పరిధిలోకి రాదని అందుకే ఆ అంశంపై వారు నోరుమెదపకపోవడమే మంచిదని ఆదేశించంది. ఈ విషయంలో మీడియా ప్రశ్నలకు కూడా స్పందించవద్దని, కనీసం ప్రైవేటుగా ఎవరితోనైనా మాట్లాడినా లీకైపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. దీనితో బక్కచిక్కిపోయిన ఆ నలుగురు ఇప్పుడు బయట నోరు తెరవడం మానేశారు.

వైసీపీ ప్రభుత్వంపై పోరాటంలో ఆ నేతలు ఇకపై చిత్తశుద్ధిగా పనిచేయాలని కూడా అధిష్టానం సూచించింది. చివరకు ఎమ్మెల్సీల అవినీతిని కూడా ఎండగట్టాలని ఆదేశించింది. దానితో పార్టీ సమావేశాల్లో వారెవ్వరూ పొత్తులపై మాట్లాడకుండా జాగ్రత్త పడ్డారు. నిత్యం టీడీపీని విమర్శించే ఆ నాయకులకు ఇప్పుడు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయ్యింది. పాపం ఆ నలుగురు ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని అనుకుంటున్నాం..

This post was last modified on May 23, 2023 9:50 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

19 minutes ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

1 hour ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

1 hour ago

గుణశేఖర్ గారు లాజిక్ మిస్సయ్యారు

ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…

2 hours ago

షాకిచ్చిన రామ్ చరణ్… పెద్ది వస్తోందా?

ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…

2 hours ago

మే 1 కోసం కొత్త సినిమాల కొట్లాట

ఏప్రిల్ 30 'పెద్ది' తప్పుకున్నాక అందరి దృష్టి ఆ స్లాట్ మీద పడింది. ఇది ముందే ఊహించిన 'గాయపడ్డ సింహం'…

4 hours ago