Political News

ఆ నలుగురికి తలంటిన అధిష్టానం

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు మరో ఏడాది లోపే జరుగుతున్న వేళ బీజేపీ అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నలుగురి వల్ల వస్తున్న అనర్థాలను అరికట్టే చర్యలు చేపట్టింది. ఎక్కడా నోరు మెదపవద్దని, పార్టీ లైన్ ను మాత్రమే ప్రచారం చేసేందుకు వారి సేవలను వినియోగించాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. దానితో వాళ్లు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.

నిజానికి వైసీపీ పాలనా వైఫల్యాల పై గాకుండా టీడీపీ పై విమర్శలు చేయడం రాష్ట్ర బీజేపీలో కొంతమంది నేతలకు అలవాటైంది. పోలవరం నిర్మాణం జరగకపోయినా, అమరావతి ఆగిపోయినా పట్టించుకోని బీజేపీ నేతలకు సాక్షాత్తు హోమ్‌మంత్రి అమిత్‌ షా తిరుపతిలో తలంటారు. దీంతో అమరావతి రైతుల పాదయాత్రకు హడావుడిగా వెళ్లి మద్దతు పలికారు. అమరావతిలో ఆర్‌-5 జోన్ ఏర్పాటు చేసి బయటవారికి పట్టాలు ఇస్తున్నా… బీజేపీ నేతలు నోరు మెదపకపోవడం పై రాజధాని రైతులు ఆగ్రహంగా ఉన్నారు. ఈలోపు పవన్‌ కళ్యాణ్‌ ఢిల్లీ వెళ్లి కేంద్ర బీజేపీ నేతలు, మంత్రి మురళీధరన్ , శివప్రకాష్‌ జీ , బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో భవిష్యత్తులో తన పార్టీ వైఖరి , ఎన్నికల సందర్బంగా తాను వ్యవహరించే విధానం పై స్పష్టంగా చెప్పివచ్చారు. పనిలో పనిగా రాష్ట్రంలో బీజేపీ నేతలు వ్యవహారశైలి వాళ్లు ఇస్తున్న స్టేట్‌మెంట్ లను అక్కడ వివరించారు..

పవన్ ఫిర్యాదులపై బీజేపీ అధిష్టానం సీరియస్ గా దృష్టి పెట్టింది. ఓ నలుగురు నేతల ఓవరాక్షన్ తో ఏపీలో పార్టీ పూర్తిగా దెబ్బతింటోందని గుర్తించింది. వారిని ఢిల్లీ పిలిపించి .. పార్టీని ఎందుకు అభాసుపాలు చేస్తున్నారని ప్రశ్నించింది. ఇకపై మౌనంగా ఉండాలని దిశా నిర్దేశం చేసింది. పొత్తుల వ్యవహారం వారి పరిధిలోకి రాదని అందుకే ఆ అంశంపై వారు నోరుమెదపకపోవడమే మంచిదని ఆదేశించంది. ఈ విషయంలో మీడియా ప్రశ్నలకు కూడా స్పందించవద్దని, కనీసం ప్రైవేటుగా ఎవరితోనైనా మాట్లాడినా లీకైపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. దీనితో బక్కచిక్కిపోయిన ఆ నలుగురు ఇప్పుడు బయట నోరు తెరవడం మానేశారు.

వైసీపీ ప్రభుత్వంపై పోరాటంలో ఆ నేతలు ఇకపై చిత్తశుద్ధిగా పనిచేయాలని కూడా అధిష్టానం సూచించింది. చివరకు ఎమ్మెల్సీల అవినీతిని కూడా ఎండగట్టాలని ఆదేశించింది. దానితో పార్టీ సమావేశాల్లో వారెవ్వరూ పొత్తులపై మాట్లాడకుండా జాగ్రత్త పడ్డారు. నిత్యం టీడీపీని విమర్శించే ఆ నాయకులకు ఇప్పుడు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయ్యింది. పాపం ఆ నలుగురు ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని అనుకుంటున్నాం..

This post was last modified on May 23, 2023 9:50 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

2 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

2 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

2 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

3 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

5 hours ago

మెస్సీ వచ్చే… మంత్రి పదవి పాయె

దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…

6 hours ago