రాబోయే ఎన్నికల్లో భూమా అఖిలప్రియకు తెలుగుదేశం పార్టీలో టికెట్ డౌటనే ప్రచారం పెరిగిపోతోంది. వరుస వివాదాల్లో మునిగిపోయిన అఖిలను పార్టీలో నుండి ఎలా సాగనంపాలనే విషయాన్ని చంద్రబాబునాయుడు, లోకేష్ తీవ్రంగా ఆలోచిస్తున్నారు. దూకుడుగా వెళుతు అందరితోను గొడవలు పెట్టుకుంటున్న అఖిలను పద్ధతి మార్చుకోమని చంద్రబాబు చాలాసార్లే హెచ్చరించారు. అయినా తన పద్దతిని మాజీమంత్రి ఏమాత్రం మార్చుకోలేదు. పద్దతి మార్చుకోకపోగా మరింత వివాదాస్పదమవుతున్నారు.
సరిగ్గా ఈ సమయంలోనే సొంతపార్టీ నేతపైనే అఖిల మద్దతుదారులు దాడిచేయటం పార్టీలో సంచలనంగా మారింది. పార్టీలో కీలకనేతయిన ఏవీ సుబ్బారెడ్డిపై అఖిల మద్దతుదారులు దాడిచేసి తీవ్రంగా కొట్టారు. అఖిల ఉసిగొల్పటం వల్లే ఆమె మద్దతుదారులు తనపైన దాడిచేసినట్లు ఏవీ మండిపడ్డారు. అందుకనే తనపై హత్యాయత్నానికి పాల్పడినట్లు అఖిలపై ఫిర్యాదుచేశారు. తర్వాత అఖిల కూడా ఏవీపైన ఫిర్యాదుచేయటం, కేసు నమోదవ్వటం వెంటవెంటనే జరిగిపోయింది.
తాను కాకుండా పార్టీని కూడా రోడ్డున పడేసిన అఖిలపై చంద్రబాబు బాగా కోపంగా ఉన్నారట. అందుకనే జరిగిన గొడవపై త్రిసభ్య సంఘాన్ని వేశారు. శ్రీనివాసరెడ్డి, కాల్వ శ్రీనివాస్, అమర్నాధరెడ్డి నంద్యాలకు వెళ్ళి అందరితోను మాట్లాడారట. జరిగిన గొడవలో పూర్తిగా అఖిలదే తప్పని కొందరు సీనియర్ నేతలు స్పష్టంగా చెప్పారట. దాంతో అదే విషయాన్ని కమిటి చంద్రబాబుకు రిపోర్టు ఇచ్చినట్లు సమాచారం. రిపోర్టు ఆధారంగా అఖిలకు వచ్చేఎన్నికల్లో టికెట్ దక్కేది అనుమానమే అంటున్నారు తమ్ముళ్ళు.
కిడ్నాపులు, హత్యకు కుట్ర, ఫోర్జరీ, దాడుల కేసుల్లో ఇరుక్కున్న అఖిలను పార్టీలో నుండి పంపే విషయమై సీరియస్ గానే ఆలోచిస్తున్న చంద్రబాబుకు మంచి అవకాశం దొరికినట్లు టాక్ వినిపిస్తోంది. ఇపుడు గనుక అఖిలపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటే మిగిలిన నేతలకు కూడా ఒక హెచ్చరికలాగ ఉంటుందని కూడా అనుకుంటున్నారు. ఇదే సమయంలో ఏవీ వియ్యంకుడు బోండా ఉమ అయితే అఖిలపైన గట్టిగా యాక్షన్ తీసుకోవాల్సిందే అని పట్టుబడుతున్నట్లు తమ్ముళ్ళు చెబుతున్నారు. ఒకవైపు అఖిలపై యాక్షన్ తీసుకోవాలని ఒత్తిళ్ళు, మరోవైపు వివాదాస్పదమవుతున్న ఆమె దూకుడు, ఇంకోవైపు త్రిసభ్య కమిటి రిపోర్టు. మొత్తంమీద అఖిలకు టికెట్ కష్టమే అని పార్టీలో టాక్ నడుస్తోంది. మరి చంద్రబాబు ఏమిచేస్తారో చూడాల్సిందే.
This post was last modified on May 22, 2023 11:50 am
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంపు కార్యాలయంపై శనివారం దాడి…
ఇప్పుడు అన్ని పరిశ్రమల్లో, సోషల్ మీడియాలో హాట్ గా ఉన్న డిస్కషన్స్ లో రామాయణ టీజర్ దే ఫస్ట్ ప్లేస్.…
సమాజం ఎంతో అభివృద్ధి చెందుతున్నా... లింగ బేధానికి దిక్కే లేకున్నా.. మగ పిల్లలే కావాలి... ఆడపిల్లలు వద్దన్న భావన ఇంకా పూర్తిగా కనుమరుగు కాలేదు. అందుకు నిదర్శనమే…
విలక్షణమైన కథలు ఎంచుకుంటాడని పేరున్న అడివి శేష్ సినిమా వచ్చి చాలా కాలమయ్యింది. హిట్ 2 ది సెకండ్ కేస్…
సంతోష్ శోభన్, సంగీత్ శోభన్. ఈ రెండు పేర్లు చూసి ఇండస్ట్రీలో వాళ్లే అప్పుడప్పుడూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మొన్న…