Political News

మోడీని ఆటోగ్రాఫ్ అడిగిన బైడెన్..

ఇమేజ్ పెంచుకోవటంలో మోడీకున్న తెలివి సమకాలీన ప్రపంచంలో మరే నేతకు లేదనే చెప్పాలి. ఒకప్పుడు అగ్రరాజ్యం అమెరికా ప్రతి మూడు నెలలకు ఒకసారి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి తమ దేశానికి వచ్చే వెసులుబాటు లేదనే మాటను ప్రస్తావిస్తూ ఉండేది. అలాంటి అమెరికా ఇప్పుడు ఆయనకు ఎర్ర తివాచీ పరవటమే కాదు.. మోడీని తమకు కల్పించాలంటూ అమెరికా అధ్యక్షుడి మీద విపరీతమైన ఒత్తిళ్లు వస్తున్నాయట. విన్నంతనే కాకమ్మ కథ వినేందుకు మేమే దొరికామా? అని మీరు అనొచ్చు. కానీ.. ఇప్పుడు వస్తున్న వార్తలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి.

జీ7 సమ్మిట్ లో పాల్గొనేందుకు జపాన్ వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారినట్లు చెబుతున్నారు. ఓపక్క అమెరికా అధ్యక్షుడు.. మరోపక్క జపాన్ ప్రధానమంత్రితో పాటు.. బ్రిటన్ ప్రధాని.. ఇలా సంపన్న దేశాలకు చెందిన పలువురు దేశాధినేతలు ఉన్నా.. మోడీ ముందు వారంతా దిగదుడుపే అన్నట్లుగా పరిస్థితులు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

తాజాగా వచ్చిన ఒక వార్త ఇప్పుడు విస్మయానికి గురి చేస్తోంది. జీ7సమ్మిట్ సందర్భంగా మోడీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పాపులార్టీ ఎంతన్న విషయాన్ని అమెరికా అధ్యక్షుడు..ఆస్ట్రేలియా ప్రధాని చెప్పటం విశేషం. ప్రధాని మోడీతో వ్యక్తిగతంగా మాట్లాడిన సందర్భంలో బైడన్ ఒక ఆసక్తికర విషయాన్ని ప్రస్తావించినట్లు చెబుతున్నారు. వచ్చే నెలలో బైడెన్ ఆహ్వానం మేరకు అమెరికాకు వెళుతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.

దీంతో.. ఆయన పాల్గొనే కార్యక్రమాలకు తమను కూడా భాగస్వామ్యం చేయాలన్న విషయాన్ని బైడన్ ను పలువురు కోరుతున్నారట. అనేక వర్గాల నుంచి తనకు ఒత్తిళ్లు వస్తున్న విషయాన్ని మోడీకి బైడెన్ తెలియజేసినట్లు చెబుతున్నారు. తనను ఎప్పుడు కలవని వారు.. పరిచయం లేని వారు సైతం ఫోన్ ద్వారా సంప్రదిస్తూ.. మోడీతో కలిపించే అవకాశం గురించి విన్నపాలు చేస్తున్నట్లు చెప్పటం గమనార్హం. ఈ సందర్భంగా మోడీని ఆటోగ్రాఫ్ ఇవ్వాలంటూ బైడెన్ సరదాగా అడిగినట్లుగా చెబుతున్నారు.

మోడీతో బైడెన్ వ్యక్తిగతంగా మాట్లాడే సమయంలోనే అక్కడకు వచ్చిన ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ సైతం.. బైడెన్ ఎదుర్కొంటున్న సమస్యనే తాను ఎదుర్కొంటున్నట్లుగా చెప్పినట్లుగా చెబుతున్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఒక కార్యక్రమంలో మోడీ పొల్గొంటున్నారు. ఈ ప్రోగ్రాంకు తాము కూడా వస్తామని పలువురు తనకు మెసేజ్ లు పంపుతున్నారని పేర్కొన్నారు.

అయితే.. మోడీ పాల్గొనే వేదికకు 20వేల మంది సామర్థ్యమే ఉందని.. దానికి సంబంధించిన టికెట్లు ఇప్పటికే అమ్ముడయమయాయని… తమకు టికెట్లు కావాలంటూ బోలెడన్ని వినతులు వస్తున్నట్లుగా పేర్కొన్నట్లుగా.. వారి సంభాషణలు విన్నవారు చెప్పినట్లుగా మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సంభాషణలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ కలుగజేసుకొని.. మోడీ తనకు పెద్ద సమస్యగా మారారని.. ఇదేమీ తాను ఆట పట్టించటం లేదని.. కావాలంటే తమ టీంను అడగాలని అన్నట్లు చెప్పగా.. ఆస్ట్రేలియా ప్రధాని కూడా అలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఇటీవల చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో దేశంలో మోడీ ఇమేజ్ కు డ్యామేజ్ జరుగుతోందన్న ప్రచారం జరుగుతుంటే.. అందుకు భిన్నమైన వాదన తెర మీదకు రావటం.. అది కూడా అంతర్జాతీయం కావటం ఆసక్తికరంగా మారింది.

This post was last modified on May 22, 2023 11:47 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

45 minutes ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

1 hour ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

2 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

2 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

3 hours ago

రాంబాబు రావడమే ఆలస్యం

మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…

3 hours ago