Political News

మోడీని ఆటోగ్రాఫ్ అడిగిన బైడెన్..

ఇమేజ్ పెంచుకోవటంలో మోడీకున్న తెలివి సమకాలీన ప్రపంచంలో మరే నేతకు లేదనే చెప్పాలి. ఒకప్పుడు అగ్రరాజ్యం అమెరికా ప్రతి మూడు నెలలకు ఒకసారి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి తమ దేశానికి వచ్చే వెసులుబాటు లేదనే మాటను ప్రస్తావిస్తూ ఉండేది. అలాంటి అమెరికా ఇప్పుడు ఆయనకు ఎర్ర తివాచీ పరవటమే కాదు.. మోడీని తమకు కల్పించాలంటూ అమెరికా అధ్యక్షుడి మీద విపరీతమైన ఒత్తిళ్లు వస్తున్నాయట. విన్నంతనే కాకమ్మ కథ వినేందుకు మేమే దొరికామా? అని మీరు అనొచ్చు. కానీ.. ఇప్పుడు వస్తున్న వార్తలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి.

జీ7 సమ్మిట్ లో పాల్గొనేందుకు జపాన్ వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారినట్లు చెబుతున్నారు. ఓపక్క అమెరికా అధ్యక్షుడు.. మరోపక్క జపాన్ ప్రధానమంత్రితో పాటు.. బ్రిటన్ ప్రధాని.. ఇలా సంపన్న దేశాలకు చెందిన పలువురు దేశాధినేతలు ఉన్నా.. మోడీ ముందు వారంతా దిగదుడుపే అన్నట్లుగా పరిస్థితులు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

తాజాగా వచ్చిన ఒక వార్త ఇప్పుడు విస్మయానికి గురి చేస్తోంది. జీ7సమ్మిట్ సందర్భంగా మోడీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పాపులార్టీ ఎంతన్న విషయాన్ని అమెరికా అధ్యక్షుడు..ఆస్ట్రేలియా ప్రధాని చెప్పటం విశేషం. ప్రధాని మోడీతో వ్యక్తిగతంగా మాట్లాడిన సందర్భంలో బైడన్ ఒక ఆసక్తికర విషయాన్ని ప్రస్తావించినట్లు చెబుతున్నారు. వచ్చే నెలలో బైడెన్ ఆహ్వానం మేరకు అమెరికాకు వెళుతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.

దీంతో.. ఆయన పాల్గొనే కార్యక్రమాలకు తమను కూడా భాగస్వామ్యం చేయాలన్న విషయాన్ని బైడన్ ను పలువురు కోరుతున్నారట. అనేక వర్గాల నుంచి తనకు ఒత్తిళ్లు వస్తున్న విషయాన్ని మోడీకి బైడెన్ తెలియజేసినట్లు చెబుతున్నారు. తనను ఎప్పుడు కలవని వారు.. పరిచయం లేని వారు సైతం ఫోన్ ద్వారా సంప్రదిస్తూ.. మోడీతో కలిపించే అవకాశం గురించి విన్నపాలు చేస్తున్నట్లు చెప్పటం గమనార్హం. ఈ సందర్భంగా మోడీని ఆటోగ్రాఫ్ ఇవ్వాలంటూ బైడెన్ సరదాగా అడిగినట్లుగా చెబుతున్నారు.

మోడీతో బైడెన్ వ్యక్తిగతంగా మాట్లాడే సమయంలోనే అక్కడకు వచ్చిన ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ సైతం.. బైడెన్ ఎదుర్కొంటున్న సమస్యనే తాను ఎదుర్కొంటున్నట్లుగా చెప్పినట్లుగా చెబుతున్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఒక కార్యక్రమంలో మోడీ పొల్గొంటున్నారు. ఈ ప్రోగ్రాంకు తాము కూడా వస్తామని పలువురు తనకు మెసేజ్ లు పంపుతున్నారని పేర్కొన్నారు.

అయితే.. మోడీ పాల్గొనే వేదికకు 20వేల మంది సామర్థ్యమే ఉందని.. దానికి సంబంధించిన టికెట్లు ఇప్పటికే అమ్ముడయమయాయని… తమకు టికెట్లు కావాలంటూ బోలెడన్ని వినతులు వస్తున్నట్లుగా పేర్కొన్నట్లుగా.. వారి సంభాషణలు విన్నవారు చెప్పినట్లుగా మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సంభాషణలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ కలుగజేసుకొని.. మోడీ తనకు పెద్ద సమస్యగా మారారని.. ఇదేమీ తాను ఆట పట్టించటం లేదని.. కావాలంటే తమ టీంను అడగాలని అన్నట్లు చెప్పగా.. ఆస్ట్రేలియా ప్రధాని కూడా అలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఇటీవల చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో దేశంలో మోడీ ఇమేజ్ కు డ్యామేజ్ జరుగుతోందన్న ప్రచారం జరుగుతుంటే.. అందుకు భిన్నమైన వాదన తెర మీదకు రావటం.. అది కూడా అంతర్జాతీయం కావటం ఆసక్తికరంగా మారింది.

This post was last modified on May 22, 2023 11:47 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రేవంత్ రెడ్డి `వ‌న్ మ్యాన్ ఆర్మీ`… సరిపోవట్లేదా?

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో వ‌న్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి క‌నిపిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి…

2 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో ఎవరిది పైచేయి?

ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో ఒక‌ప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్ద‌గా క‌నిపించ‌డం లేద‌న్న టాక్ వినిపిస్తోంది. కీల‌క నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

2 hours ago

క‌ర‌ణం `క‌ల‌` ఏమైంద‌బ్బా ..!

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి.. రాజ‌కీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన నేత‌. కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌ను ఎమ్మెల్యేగా చూసుకోవాల‌న్న…

6 hours ago

ఏలా చూసినా… మన సీట్లు పెరుగుతాయి

నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…

7 hours ago

RRR వల్ల కానిది దురంధర్ చేయగలదా

బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…

7 hours ago

అక్కడ నెలకు రెండు సార్లు జీతం? ఇదేదో బాగుందే..

ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…

7 hours ago