నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, జగన్ సర్కారును అంత తేలిగ్గా వదిలేలా లేరు. కొన్ని నెలల నుంచి పార్టీ మీద, ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడుతున్న రఘురామ.. ఈ మధ్య కొంచెం నెమ్మదించినట్లు కనిపించారు. కానీ మళ్లీ ఆయన గళం ఊపందుకుంటోంది. ఇటీవలే ఆయనకు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరీ రక్షణ కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ ఉత్సాహంలో ఆయన మరింత వాడిగా విమర్శలు మొదలుపెట్టారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన రాజధాని అంశంపై ఆయన మాట్లాడారు. ఈ విషయమై జగన్ సర్కారుపై ఘాటు విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని.. ఇలాంటి సమయంలో రాజధాని మారుస్తారా అని ఆయన ఎద్దేవా చేశారు.
ప్రభుత్వం మారినప్పుడుల్లా రాజధాని మార్చుకుంటూపోవడం ఏం పద్ధతని ఆయన ప్రశ్నించారు. అమరావతి నుంచి రాజధానిని తరలించాలని పట్టుబడితే.. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులందరికీ నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుందని.. అందుకు రూ.80 వేల కోట్లు అవసరమవుతాయని ఆయన చెప్పారు. అమరావతిలో రాజధాని వస్తుందని మధ్యతరగతి ప్రజలు దాచుకున్న సొమ్ముతో భూములు కొన్నారని.. దయచేసి వారికి ఇబ్బంది కలిగించొద్దని కోరారు.
అమరావతి నిర్మాణానికి ఎంత ఖర్చు చేశారో తెలపాలని ఏపీ హైకోర్టు కోరడం మంచి పరిణామం అన్న.. రఘురామ రాజధాని విషయంలో రిఫరెండానికి వెళ్లాలని జగన్ ప్రభుత్వాన్ని మరోసారి సవాలు చేశారు. న్యాయవ్యవస్థపై దుష్ప్రచారం ప్రభుత్వానికే నష్టం కల్గుతుందన్న ఆయన.. ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వ్యక్తిని బెదిరించడం సరికాదన్నారు. తనను కూడా వైకాపా వాళ్లు చాలాసార్లు బెదిరించారని గుర్తుచేశారు.
This post was last modified on August 7, 2020 4:31 pm
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…