గతంలో కొన్ని కొన్ని చోట్ల దయ్యం ఉందనే భయంతో ఓ స్త్రీ రేపురా! అని గుమ్మాలకు ఉన్న తలుపు చెక్కలపై రాసుకునేవారు. ఇప్పుడు సీబీఐ వారు.. ఓ ఎంపీ రేపు రా! అని తమ ఆఫీస్కు బోర్డు కట్టుకు న్నారా? అంటూ.. నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీనికి కారణం.. సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో సీఎం తమ్ముడు, ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ.. నాలుగు అడుగులు ముందుకు.. పది అడుగులు వెనక్కి సాగుతుండడమేనని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
విచారణ పేరుతో అధికారులు ఎంపీని పిలవడం.. ఆయన ఏదో ఒక కారణంగా తప్పించుకోవడం.. జరుగుతూనే ఉంది. దీంతో నెటిజన్లు.. జరుగుతున్న పరిణామాలపై వ్యంగ్యోక్తులు సంధిస్తున్నారు. ఇక, తాజాగా అవినాష్ రెడ్డి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆదేశాలిచ్చింది. ఇదిలావుంటే, సీబీఐ దర్యాప్తులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
శుక్రవారం ఉదయం 11 గంటలకు తమ ఎదుట ఎట్టిపరిస్థితుల్లోనూ హాజరుకావాలని సీబీఐ నోటీసులిచ్చి న విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి పులివెందుల బయలుదేరిన అవినాష్రెడ్డి మార్గమధ్యంలోనే వెనుదిరిగారు. ఆయన మాతృమూర్తికి ఆరోగ్యం బాగోలేదని పులివెందుల నుంచి సమాచారం రావడంతో ఎంపీ వెనుదిరగడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి.. ఎంపీకి నోటీసులు జారీ చేసింది సీబీఐ.
వాస్తవానికి నాలుగు రోజుల కిందటే ఆయన విచారణకు రావాల్సి ఉంది. కానీ… ‘ఇంత ఆకస్మికంగా పిలిస్తే రాలేను. ముందస్తు కార్యక్రమాలున్నాయి’ అని తెలిపారు. దీంతో శుక్రవారం తప్పనిసరిగా రావాలని అప్పుడే సీబీఐ అధికారులు చెప్పారు. అవినాశ్ను అవసరమైతే అరెస్టు కూడా చేస్తామని సీబీఐ ఇదివరకే స్పష్టం చేసిన తరుణంలో ఉత్కంఠ కూడా పెరిగింది. మరి ఇప్పుడు సోమవారం వరకు వాయిదా ఉండడంతో .. ఏం చేస్తారో చూడాలి. దీనిపైనే నెటిజన్లు ఆసక్తిక ర కామెంట్లు చేస్తున్నారు.
This post was last modified on May 20, 2023 4:47 pm
ఈ రోజుల్లో రీమేక్ సినిమా చేయడం అన్నది పెద్ద రిస్క్గా మారిపోయిన మాట వాస్తవం. ఇంటర్నెట్, ఓటీటీల విప్లవం వల్ల…
గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…
తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…
డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు రద్దయి.. కొన్ని విమానాలు తీవ్ర ఆలస్యమై.. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…