Political News

అమరావతి కోసం వైసీపీ ఎంపీ మనోధైర్య యాత్ర

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహార శైలి కొంతకాలంగా ఏపీతొపాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఓ వైపు వైసీపీని విమర్శిస్తూనే….మరోవైపు, సీఎం జగన్ కు విధేయుడిని అంటున్న రఘురామకృష్ణంరాజు వ్యవహారం వైసీపీ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.

నిమ్మగడ్డ వ్యవహారం నుంచి మూడు రాజధానుల బిల్లు ఆమోదం వరకు సందర్భానుసారంగా విమర్శలు గుప్పిస్తోన్న రఘురామకృష్ణంరాజు తాజాగా జగన్ ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ కు అమరావతి గతంలోనూ కలిసి వచ్చిందని, భవిష్యత్తులోనూ కలిసొస్తుందని అన్నారు.

అమరావతిని పరిపాలనా రాజధానిగా కొనసాగించాలని, విశాఖకు రాజధాని తరలించవద్దని చేతులు జోడించి వేడుకుంటున్నానని చెప్పారు. రాజధాని తరలింపు వల్ల నష్టపోతున్న వారికి ధైర్యం చెప్పేందుకు మనోధైర్య యాత్ర చేస్తానని ఆర్ ఆర్ ఆర్ అన్నారు.

అమరావతి రైతులకు న్యాయం జరుగుతోందని, అమరావతిని పరిపాలనా రాజధానిగా కొనసాగించాలని రఘురామకృష్ణం రాజు అన్నారు.

అంతేకాదు, అమరావతిలో ఇల్లు కట్టుకున్నాక జగన్ కు కలిసి వచ్చిందని, భవిష్యత్తులోనూ కలిసి వస్తుందని అన్నారు. అందుకే, అమరావతిని పాలనా రాజధానిగా కొనసాగించాలని, అమరవాతి నుంచే జగన్ పాలన సాగించాలని అన్నారు.

కావాలంటే సీఎం క్యాంప్ ఆఫీస్, లెజిస్లేటివ్ క్యాపిటల్ వేరే చోట పెట్టుకోవాలని, విశాఖ వాసులు కూడా తమకు రాజధాని వద్దనుకుంటున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధానిని మార్చవద్దని చేతులు జోడించి వేడుకుంటున్నానని, రాజధాని మార్పు వల్ల రైతులు నష్టపోతారని అన్నారు. రాజధాని తరలింపు వల్ల చనిపోయిన వారిని సీఎం జగన్ పరామర్శించాలని, రాజధాని తరలింపు వల్ల నష్టపోతున్న వారికి ధైర్యం చెప్పేందుకు ఎంపీగా ఆగస్టు 20 నుంచి మనోధైర్య యాత్ర చేపట్టబోతున్నానని అన్నారు.

అమరావతిలో రాజధాని కోసం మహిళల నిరసనను కుక్కలతో పోలుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, కుక్కలు వేట కుక్కలై తరిమేరోజులు దగ్గరలోనే ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. పేరు చివర రెండక్షరాలు ఉన్న వ్యక్తులను కాపాడేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. విభజన చట్టంలో రాజధాని అనిమాత్రమే ఉందని, ఆ అంశాల ఆధారంగానే కోర్టులో న్యాయం జరుగుతుందని చెప్పారు.

ప్రజాస్వామ్యం లో ఎన్నుకున్న వారిని రాజీనామా చేయమని అనడం సరికాదని బొత్స అన్నారని, అందుకు ఆయనకు కృతజ్ఞతలు అని రఘురామకృష్ణంరాజు చెప్పారు. తన నియోజకవర్గ ఎమ్మెల్యేలు తనను రాజీనామా చేయమంటున్నారని, వారంతా బొత్స వ్యాఖ్యలు దృష్టిలో ఉంచుకోవాలని ఎద్దేవా చేశారు.

మరి, రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలను జగన్ ఏ విధంగా తీసుకుంటారు…ఆయన సలహాను పాటించి అమరావతి నుంచి పాలన సాగిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు, రోజు రోజుకు రఘురామకృష్ణంరాజు విమర్శల తీవ్రత పెరుగుతున్నా….వైసీపీ శ్రేణుల మౌనంగా ఉండడంపై కూడా చర్చజరుగుతోంది. ఏది ఏమైనా వైసీపీకి సొంతపార్టీలోనే రఘురామకృష్ణంరాజు మేకయ్యారని చెప్పక తప్పదు.

This post was last modified on August 7, 2020 11:35 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

1 hour ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

1 hour ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

4 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

6 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

6 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

6 hours ago