వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహార శైలి కొంతకాలంగా ఏపీతొపాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఓ వైపు వైసీపీని విమర్శిస్తూనే….మరోవైపు, సీఎం జగన్ కు విధేయుడిని అంటున్న రఘురామకృష్ణంరాజు వ్యవహారం వైసీపీ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.
నిమ్మగడ్డ వ్యవహారం నుంచి మూడు రాజధానుల బిల్లు ఆమోదం వరకు సందర్భానుసారంగా విమర్శలు గుప్పిస్తోన్న రఘురామకృష్ణంరాజు తాజాగా జగన్ ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ కు అమరావతి గతంలోనూ కలిసి వచ్చిందని, భవిష్యత్తులోనూ కలిసొస్తుందని అన్నారు.
అమరావతిని పరిపాలనా రాజధానిగా కొనసాగించాలని, విశాఖకు రాజధాని తరలించవద్దని చేతులు జోడించి వేడుకుంటున్నానని చెప్పారు. రాజధాని తరలింపు వల్ల నష్టపోతున్న వారికి ధైర్యం చెప్పేందుకు మనోధైర్య యాత్ర చేస్తానని ఆర్ ఆర్ ఆర్ అన్నారు.
అమరావతి రైతులకు న్యాయం జరుగుతోందని, అమరావతిని పరిపాలనా రాజధానిగా కొనసాగించాలని రఘురామకృష్ణం రాజు అన్నారు.
అంతేకాదు, అమరావతిలో ఇల్లు కట్టుకున్నాక జగన్ కు కలిసి వచ్చిందని, భవిష్యత్తులోనూ కలిసి వస్తుందని అన్నారు. అందుకే, అమరావతిని పాలనా రాజధానిగా కొనసాగించాలని, అమరవాతి నుంచే జగన్ పాలన సాగించాలని అన్నారు.
కావాలంటే సీఎం క్యాంప్ ఆఫీస్, లెజిస్లేటివ్ క్యాపిటల్ వేరే చోట పెట్టుకోవాలని, విశాఖ వాసులు కూడా తమకు రాజధాని వద్దనుకుంటున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధానిని మార్చవద్దని చేతులు జోడించి వేడుకుంటున్నానని, రాజధాని మార్పు వల్ల రైతులు నష్టపోతారని అన్నారు. రాజధాని తరలింపు వల్ల చనిపోయిన వారిని సీఎం జగన్ పరామర్శించాలని, రాజధాని తరలింపు వల్ల నష్టపోతున్న వారికి ధైర్యం చెప్పేందుకు ఎంపీగా ఆగస్టు 20 నుంచి మనోధైర్య యాత్ర చేపట్టబోతున్నానని అన్నారు.
అమరావతిలో రాజధాని కోసం మహిళల నిరసనను కుక్కలతో పోలుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, కుక్కలు వేట కుక్కలై తరిమేరోజులు దగ్గరలోనే ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. పేరు చివర రెండక్షరాలు ఉన్న వ్యక్తులను కాపాడేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. విభజన చట్టంలో రాజధాని అనిమాత్రమే ఉందని, ఆ అంశాల ఆధారంగానే కోర్టులో న్యాయం జరుగుతుందని చెప్పారు.
ప్రజాస్వామ్యం లో ఎన్నుకున్న వారిని రాజీనామా చేయమని అనడం సరికాదని బొత్స అన్నారని, అందుకు ఆయనకు కృతజ్ఞతలు అని రఘురామకృష్ణంరాజు చెప్పారు. తన నియోజకవర్గ ఎమ్మెల్యేలు తనను రాజీనామా చేయమంటున్నారని, వారంతా బొత్స వ్యాఖ్యలు దృష్టిలో ఉంచుకోవాలని ఎద్దేవా చేశారు.
మరి, రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలను జగన్ ఏ విధంగా తీసుకుంటారు…ఆయన సలహాను పాటించి అమరావతి నుంచి పాలన సాగిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు, రోజు రోజుకు రఘురామకృష్ణంరాజు విమర్శల తీవ్రత పెరుగుతున్నా….వైసీపీ శ్రేణుల మౌనంగా ఉండడంపై కూడా చర్చజరుగుతోంది. ఏది ఏమైనా వైసీపీకి సొంతపార్టీలోనే రఘురామకృష్ణంరాజు మేకయ్యారని చెప్పక తప్పదు.
This post was last modified on August 7, 2020 11:35 am
మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…
జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ గెలుపు తర్వాత భారత్ సెమీస్ అవకాశాలు ఇప్పుడు పక్కా లెక్కల మీద ఆధారపడి ఉన్నాయి. నెట్…
ప్రాణానికి ప్రాణం అనేది పాత సామెత. స్ట్రోకుకు స్ట్రోకు కొత్త ట్రెండ్. ఇటీవలే ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కు చెందిన…
మెక్సికోలో అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ మాఫియా డాన్ నెమెసియో రూబెన్ ఒసెగ్వెరా సెర్వంటెస్ అలియాస్ 'ఎల్ మెంచో' కథ ముగిసింది.…
న్యాచురల్ స్టార్ నాని తన ఇమేజ్ ని ఏ దిశగా తీసుకెళ్తున్నాడో ప్రేక్షకులకు పూర్తి క్లారిటీ వచ్చేస్తోంది. దసరాతో తెచ్చుకున్న…
ప్రభాస్ సినిమాలు సెట్స్ మీద ఎన్ని ఉన్నా ముందుగా ఏది విడుదలవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొన్న మాట వాస్తవం. ఆదిపురుష్…