తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడును ఒక విజనరీగా అభివర్ణిస్తారు చాలామంది. విజన్ 2020 అంటే నవ్విన వాళ్లు.. ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీల్లో ఆయన విజన్ను కళ్లారా చూస్తున్నారని అంటారు. చంద్రబాబు ఏం మాట్లాడినా.. ఏం చేసినా.. అది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ఉంటుందని అభిమానులు ఆయన్ని కొనియాడుతుంటారు. బాబుకు టీడీపీ వాళ్లు మరీ ఎక్కువ ఎలివేషన్ ఇచ్చినట్లు అనిపించినా.. ఆయన విజనరీ అనడంలో సందేహం లేదు.
కేంద్ర ప్రభుత్వం 2 వేల నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో బాబు విజన్, ఆయన ఆలోచన తీరు మరోసారి చర్చనీయాంశం అవుతోంది. 2 వేలు సహా పెద్ద నోట్లను రద్దు చేస్తే దేశంలో అవినీతి, బ్లాక్ మనీ, మనీ లాండరింగ్ చాలా తగ్గుతాయని ఆయన ఎప్పట్నుంచో చెబుతున్నారు. గతంలో పెద్ద నోట్ల రద్దు చేసినపుడు ఆయన మద్దతు పలికారు. అది జరగాలని ముందే అన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2 వేల నోటు విషయంలో ఆయన ముందు నుంచి వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు.
2 వేల నోట్లను రద్దు చేయాలని కొన్ని నెలల ముందు కూడా గట్టిగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అదే నిర్ణయం ప్రకటించడంతో బాబు అభిమానులకు ఆయనకు సోషల్ మీడియాలో ఎలివేషన్ ఇస్తున్నారు. బాబు విజన్ అలా ఉంటుందని.. ఆయన చెబితే జరిగి తీరుతుందని కొనియాడుతున్నారు.
ఐతే కేంద్రం నుంచి బాబుకు ముందే సమాచారం ఉందా.. అందుకే ఈ రకంగా మాట్లాడారా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంకో ఏడాదిలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా రాబోతున్న నేపథ్యంలో అందుకోసం నిధులు సమకూర్చి పెట్టుకున్న ప్రత్యర్థులను దెబ్బ కొట్టడానికే మోడీ సర్కారు ఈ నిర్ణయం తీసుకుందని.. ఇది వైరి పక్షాలకు గట్టి దెబ్బే అన్న చర్చ కూడా నడుస్తోంది. చంద్రబాబుకు ముందే ఈ అంచనా ఉంది కాబట్టి ఆయన ఈ విషయంలో జాగ్రత్త పడి ఉంటాడనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఎన్నికల కోసం భారీ మొత్తంలో 2 వేల నోట్లతో నిధులు దాచి పెట్టిన వాళ్లకి మాత్రం ఇది పెద్ద ఇబ్బందే.
This post was last modified on May 20, 2023 11:01 am
తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది. 2023లో జరిగిన మూడో ఎన్నికలో ఆ…
తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాజకీయ తెరంగేట్రం ఆదిలోనే కష్టనష్టాలను చవిచూసింది. ఎన్నికలకు కాస్తంత ముందుగా కరూర్ లో…
ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు…
అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…