కమ్యూనిస్టులు ముఖ్యంగా సీపీఐ ఆంధ్రప్రదేశ్లో చాలా యాక్టివ్ గా ఉంది. జగన్ ప్రభుత్వ అరాచకాలపై పోరాటంలో కొన్ని సందర్భాల్లో లీడ్ రోల్ కూడా సీపీఐదే. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ రోజు ఏదోక కార్యక్రమంలో పాల్గొంటూ వైసీపీ ప్రభుత్వ తీరును ఎండగడుతుంటారు. అమరావతి రైతుల పోరాటమైనా, విశాఖ ఉక్కు ఉద్యమమైనా సీపీఐ బాధితుల వెంట నిలుస్తూనే ఉంది. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయ భవిష్యత్తుపై సీపీఐ ఆలోచనలో పడిపోయింది.
రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేస్తామని రామకృష్ణ ప్రకటించేశారు. పైగా బీజేపీతో జతకట్టవద్దని పవన్ కల్యాణ్ కు సూచించారు. దక్షిణాదిన బీజేపీకి అవకాశాలు లేవని అందుకే ఆ పార్టీతో కలవొద్దని పవన్ కు ఆయన హితబోధ చేస్తున్నారు.
నిజానికి పవన్ కు కమ్యూనిస్టు భావాలున్న మాట వాస్తవం. గతంలో వామపక్షాలతో స్నేహం చేసిన మాట నిజం. కాకపోతే 2019లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఆయన బీజేపీతో స్నేహాన్ని ప్రకటించారు, పొత్తు కూడా ఉంటుందన్నారు, ఇంకా రోడ్ మ్యాప్ ఇవ్వలేదని అభ్యంతరమూ, ఆగ్రహమూ చెందుతున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని అంటున్న పవన్ కేవలం టీడీపీ, జనసేనతోనే పొత్తు పెట్టుకుంటామని చెబుతూనే ఉన్నారు.
ఐనా ఉద్యమాల్లో, నిరసనల్లో భాగస్వామిగా ఉన్న సీపీఐకి ఆశ చావలేదనుకోవాలి. పవన్ తోనూ, టీడీపీతోనూ కలిసి పోటీ చేయాలనుకుంటోంది.ఆ దిశగానే సంకేతాలిస్తోంది. అయితే ఇప్పటికే డిసైడైపోయిన ఆ రెండు పార్టీలు కమ్యూనిస్టుల ప్రతిపాదనను ఆమోదించే అవకాశాలు తక్కువగానే ఉండొచ్చు. కాకపోతే బీజేపీతో పొత్తు కుదరని పక్షంలో వామపక్షాలతో కలిసిపోయేందుకు కొంత మేర అవకాశాలున్నాయి. మహా అయితే ఒకటి రెండు ఎమ్మెల్యే సీట్లను వారికి వదిలేసే వీలుంటుంది.
This post was last modified on May 19, 2023 5:21 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…